ETV Bharat / state

ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి - రేపు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి : సీఎం రేవంత్ - congress Meeting at Praja Bhavan

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 3:38 PM IST

Updated : Jul 17, 2024, 10:56 PM IST

Congress Leaders Meeting at Praja Bhavan : ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్​లో నిర్వహించిన కాంగ్రెస్​ నేతల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్​ను దేశం అనుసరించేదిలా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Congress Leaders Meeting at Praja Bhavan
Congress Leaders Meeting at Praja Bhavan (ETV Bharat)

Congress Leaders Meeting Started at Praja Bhavan : ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. గురువారం(రేపు) సాయంత్రం 4 గంటలకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి వెళుతుందన్నారు. ప్రతి రైతుకు రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వం లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో కాంగ్రెస్​ నేతల సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు. గడిచిన ఏడు నెలల పాలనపై సమీక్షించారు.

"రేపు లక్ష రూపాయల వరకు రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం. ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుంది. ఆగస్టులో రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధితో ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం"- సీఎం రేవంత్​ రెడ్డి

రుణమాఫీ పేరుతో కేసీఆర్​ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్​ శ్రేణులకు వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్​ శ్రేణులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండని, దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తంలో మాఫీ చేయలేదు : దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రాహుల్​ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలని చెప్పారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్​ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబురాలు జరగాలని అన్నారు. ఏడు నెలల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

రుణమాఫీ అమలుకు ఎన్నో నిద్రలేని రాత్రులు : మరోవైపు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని కాంగ్రెస్​ నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆగస్టు దాటకుండానే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో కాంగ్రెస్​ నేతల సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు. గడిచిన ఏడు నెలల పాలనపై సమీక్షిస్తున్నారు.

"అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. రేషన్​కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం. ఎవరికీ ఆపం. ఎవరికీ అవకాశం ఇవ్వం. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్​ బూతు, ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి. తల ఎత్తుకొని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మిగులు బడ్జెట్​తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్షల రూపాయల రుణమాఫీని రూ.25,000 చొప్పున నాలుగు దఫాలుగా పూర్తి చేశారు. రూ.ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన మనం రెండు లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నాం"- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

మొదటి దఫా రైతు రుణమాఫీకి సిద్ధం - మరో రూ.15వేల కోట్ల నిధుల కోసం వేట - Crop Loan Waiver In Telangana

పాస్‌బుక్‌ ఆధారంగానే రైతు రుణమాఫీ - ఎల్లుండిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ! - CM REVANTH CLARIFIED ON LOAN WAIVER

Congress Leaders Meeting Started at Praja Bhavan : ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. గురువారం(రేపు) సాయంత్రం 4 గంటలకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి వెళుతుందన్నారు. ప్రతి రైతుకు రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వం లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో కాంగ్రెస్​ నేతల సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు. గడిచిన ఏడు నెలల పాలనపై సమీక్షించారు.

"రేపు లక్ష రూపాయల వరకు రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం. ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుంది. ఆగస్టులో రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధితో ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం"- సీఎం రేవంత్​ రెడ్డి

రుణమాఫీ పేరుతో కేసీఆర్​ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్​ శ్రేణులకు వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్​ శ్రేణులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండని, దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తంలో మాఫీ చేయలేదు : దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రాహుల్​ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలని చెప్పారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్​ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబురాలు జరగాలని అన్నారు. ఏడు నెలల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

రుణమాఫీ అమలుకు ఎన్నో నిద్రలేని రాత్రులు : మరోవైపు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని కాంగ్రెస్​ నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆగస్టు దాటకుండానే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో కాంగ్రెస్​ నేతల సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు. గడిచిన ఏడు నెలల పాలనపై సమీక్షిస్తున్నారు.

"అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. రేషన్​కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం. ఎవరికీ ఆపం. ఎవరికీ అవకాశం ఇవ్వం. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్​ బూతు, ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి. తల ఎత్తుకొని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మిగులు బడ్జెట్​తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్షల రూపాయల రుణమాఫీని రూ.25,000 చొప్పున నాలుగు దఫాలుగా పూర్తి చేశారు. రూ.ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన మనం రెండు లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నాం"- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

మొదటి దఫా రైతు రుణమాఫీకి సిద్ధం - మరో రూ.15వేల కోట్ల నిధుల కోసం వేట - Crop Loan Waiver In Telangana

పాస్‌బుక్‌ ఆధారంగానే రైతు రుణమాఫీ - ఎల్లుండిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ! - CM REVANTH CLARIFIED ON LOAN WAIVER

Last Updated : Jul 17, 2024, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.