ETV Bharat / state

ఇప్పటి వరకు తీసుకున్న పింఛన్ మొత్తాన్ని తిరిగిచ్చేయండి - అలాంటి వారందరికి సర్కార్ నోటీసులు - Aasara pensions misuse in Telangana

Aasara Pensions Misuse : ‘ఆసరా’ పింఛన్ల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ‘ఆసరా’ పొందడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఇప్పటివరకూ పొందిన డబ్బులను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా, ప్రభుత్వం సైతం దీటుగా సమాధానం చెబుతుంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 8:00 AM IST

Updated : Jul 14, 2024, 8:48 AM IST

Aasara Pensions Misuse
Aasara Pensions Misuse (ETV Bharat)

Government Serious On Aasara Pensions Misuse in Telangana : రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగమవుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ‘ఆసరా’ పొందుతున్నారని తెలిసింది. ఇదే అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వ విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్లకార్డు కలిగిన పేద వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేత పని వారు, దివ్యాంగులు, డయాలసిస్, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారు ఈ పింఛనుకు అర్హులు.

ఇటీవల కొందరు ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబీకులు, పదవీ విరమణ అనంతరం పొందే పింఛన్లతో పాటు ఆసరా పింఛన్లు అందుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దానిపై విచారణ జరపాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)ను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్, ఆర్థిక శాఖ వద్ద ఉన్న జాబితాలను పరిశీలించగా, అందులో మొత్తం 5,650 మంది ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్‌మెంట్‌ పింఛనుతో పాటుగా ఆసరా పింఛన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వీరిలో 3,824 మంది ఇప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికీ రెండు పింఛన్లు అందుకుంటున్నట్లు వెల్లడైంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 427 మంది రెండు రకాల పింఛన్లు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో దాదాపు రూ.2.50 కోట్లు ఆసరా పింఛన్లతో దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా పలువురు రెండు పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో తెలిసింది. అలాంటి వారికి ఆసరా పింఛన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ నిధులను వెంటనే వారు ఎప్పటి నుంచి ‘ఆసరా’లో పేరు నమోదు చేసుకొని దానిని పొందారో, ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు.

గత ప్రభుత్వ ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయి : కాగ్​

అర్హులకే పింఛన్లు మంత్రి సీతక్క : అర్హులకు పింఛన్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతిపైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. 'పింఛన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ, సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ మానవీయ కోణంలో పాలన సాగిస్తున్నాం' అని సీతక్క వెల్లడించారు.

'బీఆర్​ఎస్​ వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం' - హరీశ్‌రావు, కేటీఆర్‌లకు మంత్రి శ్రీధర్​ బాబు కౌంటర్ - Sridhar Babu Counter to BRS Leaders

Government Serious On Aasara Pensions Misuse in Telangana : రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగమవుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ‘ఆసరా’ పొందుతున్నారని తెలిసింది. ఇదే అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వ విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్లకార్డు కలిగిన పేద వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేత పని వారు, దివ్యాంగులు, డయాలసిస్, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారు ఈ పింఛనుకు అర్హులు.

ఇటీవల కొందరు ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబీకులు, పదవీ విరమణ అనంతరం పొందే పింఛన్లతో పాటు ఆసరా పింఛన్లు అందుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దానిపై విచారణ జరపాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)ను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్, ఆర్థిక శాఖ వద్ద ఉన్న జాబితాలను పరిశీలించగా, అందులో మొత్తం 5,650 మంది ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్‌మెంట్‌ పింఛనుతో పాటుగా ఆసరా పింఛన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వీరిలో 3,824 మంది ఇప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికీ రెండు పింఛన్లు అందుకుంటున్నట్లు వెల్లడైంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 427 మంది రెండు రకాల పింఛన్లు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో దాదాపు రూ.2.50 కోట్లు ఆసరా పింఛన్లతో దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా పలువురు రెండు పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో తెలిసింది. అలాంటి వారికి ఆసరా పింఛన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ నిధులను వెంటనే వారు ఎప్పటి నుంచి ‘ఆసరా’లో పేరు నమోదు చేసుకొని దానిని పొందారో, ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు.

గత ప్రభుత్వ ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయి : కాగ్​

అర్హులకే పింఛన్లు మంత్రి సీతక్క : అర్హులకు పింఛన్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతిపైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. 'పింఛన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ, సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ మానవీయ కోణంలో పాలన సాగిస్తున్నాం' అని సీతక్క వెల్లడించారు.

'బీఆర్​ఎస్​ వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం' - హరీశ్‌రావు, కేటీఆర్‌లకు మంత్రి శ్రీధర్​ బాబు కౌంటర్ - Sridhar Babu Counter to BRS Leaders

Last Updated : Jul 14, 2024, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.