ETV Bharat / state

ప్రజల ఆలోచనలు వినడం మా ప్రభుత్వ విధానం : సీఎం రేవంత్​ రెడ్డి - TG Fire dept passing out parade

Telangana Fire Service Passing Out Parade : ప్రజల ఆలోచనలు వినడం మా ప్రజా ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో విద్యా, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. హైదరాబాద్​లోని వట్టినాగుపల్లిలో అగ్ని మాపక శాఖ పాసింగ్​ అవుట్​ పరేడ్​కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్​ రెడ్డి, అందరి ప్రాణాలు కాపాడటంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమని ప్రశంసించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 12:21 PM IST

Updated : Jul 26, 2024, 2:42 PM IST

Telangana Fire department passing out parade in Hyderabad
Telangana Fire department passing out parade in Hyderabad (ETV Bharat)

Telangana Fire department passing out parade in Hyderabad : తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే అత్యంత కీలకమైన విషయమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. హైదరాబాద్​లోని వట్టినాగుపల్లిలో అగ్ని మాపక శాఖ పాసింగ్​ అవుట్​ పరేడ్​కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి విచ్చేశారు. ఈ పాసింగ్​ అవుట్​ పరేడ్​ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాసింగ్​ అవుట్​ పరేడ్​లో 483 మంది శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​ బాబు, ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'ప్రజల ఆలోచనలు వినడం మా ప్రజా ప్రభుత్వ విధానం. 90 శాతంపైగా యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ విధానం. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్​ ప్రవేశపెట్టాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతం వస్తోంది. ప్రభుత్వం పట్ల నిరుద్యోగులకు విశ్వాసం, నమ్మకం కలిగించాం. అందరి ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకం.' అని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

"ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలనేదే ఈ ప్రభుత్వ విధానం. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో విద్యారంగం, హెల్త్​, ఇరిగేషన్​ రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాం. రైతులకు పూర్తి సహకారం అందించాలనే లక్ష్యంతో బడ్జెట్​లో అధిక కేటాయింపులు జరిగాయి. గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగులకు ప్రతినెల మొదటి తారీఖున జీతాలు రాలేదు. అందుకు వారు ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇస్తున్నాం. ఈ విధంగా ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం వచ్చే విధంగా చేశాం. ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం." - రేవంత్​ రెడ్డి, సీఎం

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్​ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024

ఏటా జూన్‌ 2న నోటిఫికేషన్‌ ఇచ్చి డిసెంబర్‌ 9లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్‌ క్యాలెండర్‌ : సీఎం రేవంత్‌ - CM Revanth Met UPSC Candidates

Telangana Fire department passing out parade in Hyderabad : తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే అత్యంత కీలకమైన విషయమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. హైదరాబాద్​లోని వట్టినాగుపల్లిలో అగ్ని మాపక శాఖ పాసింగ్​ అవుట్​ పరేడ్​కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి విచ్చేశారు. ఈ పాసింగ్​ అవుట్​ పరేడ్​ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాసింగ్​ అవుట్​ పరేడ్​లో 483 మంది శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​ బాబు, ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'ప్రజల ఆలోచనలు వినడం మా ప్రజా ప్రభుత్వ విధానం. 90 శాతంపైగా యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ విధానం. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్​ ప్రవేశపెట్టాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతం వస్తోంది. ప్రభుత్వం పట్ల నిరుద్యోగులకు విశ్వాసం, నమ్మకం కలిగించాం. అందరి ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకం.' అని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

"ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలనేదే ఈ ప్రభుత్వ విధానం. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో విద్యారంగం, హెల్త్​, ఇరిగేషన్​ రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాం. రైతులకు పూర్తి సహకారం అందించాలనే లక్ష్యంతో బడ్జెట్​లో అధిక కేటాయింపులు జరిగాయి. గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగులకు ప్రతినెల మొదటి తారీఖున జీతాలు రాలేదు. అందుకు వారు ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇస్తున్నాం. ఈ విధంగా ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం వచ్చే విధంగా చేశాం. ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం." - రేవంత్​ రెడ్డి, సీఎం

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్​ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024

ఏటా జూన్‌ 2న నోటిఫికేషన్‌ ఇచ్చి డిసెంబర్‌ 9లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్‌ క్యాలెండర్‌ : సీఎం రేవంత్‌ - CM Revanth Met UPSC Candidates

Last Updated : Jul 26, 2024, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.