ETV Bharat / state

ఏక సభ్య కమిషన్ నివేదిక సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్

ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో ఏకసభ్య కమిషన్​ నివేదిక సమర్పించాలి - ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

cm revanth sc Classification
cm revanth sc Classification (ETV Bharat)

CM Revanth Reddy on SC Classification : ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్​ నివేదిక ఇచ్చిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య న్యాయ కమిషన్​ ఏర్పాటు ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ఏక సభ్య కమిషన్​ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ముందుకెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని కమిషన్​ అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM Revanth Reddy on SC Classification : ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్​ నివేదిక ఇచ్చిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య న్యాయ కమిషన్​ ఏర్పాటు ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ఏక సభ్య కమిషన్​ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ముందుకెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని కమిషన్​ అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

'2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ' - క్యాబినెట్​ సబ్​ కమిటీ కీలక సూచన

'వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం- రిజర్వేషన్ల అసలు లక్ష్యం అదే'

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.