ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ - పరవళ్లు తొక్కిన గోదారమ్మ - SITARAMA PROJECT LAUNCHED

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 1:37 PM IST

Updated : Aug 15, 2024, 3:25 PM IST

Sitarama Project in Bhadradri District : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. పూనుగూడెం పంప్​ హౌస్​ నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.

Sitarama Project in Khammam District
Sitarama Project in Khammam District (ETV Bharat)

CM Revanth Reddy Launched Sitarama Project : సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పూసుగూడెం పంప్​ హౌస్​ను సీఎం రేవంత్​ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీఎస్​ శాంతి కుమారి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు ఫైలాన్​ను సీఎం రేవంత్​ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు.

'బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేలు గత పదేళ్లులో ఏనాడు వారి నియోజకవర్గాలకు నీళ్లు కావాలని అడగలేదు. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నీళ్లు కావాలని అడుగుతున్నారు. ఇది తమ ప్రభుత్వం విశ్వసనీయతకు నిదర్శనం. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్​, హరీశ్​రావు వారి మాటలతో అంచనాలు పెంచి నిధులు దోచుకున్నారు అందుకే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎలాంటి కోరికలు కోరలేదు. పదేళ్ల కాలంలో ఎక్కడ ప్రాజెక్టుల్లో అక్రమాలు బయటపడతాయని భయపడి సీడబ్ల్యూసీకి డీపీఆర్​లను పంపించలేదు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా డీపీఆర్​ను కూడా పంపించలేదు. ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులకు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయం కనిపించింది. రూ.18 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.7 వేల కోట్లను ఖర్చు చేశారు. కానీ ఒక్క గుంట భూమికి కూడా నీరు ఇవ్వలేదు.' అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

ప్రాజెక్టులు రీడిజైనింగ్​ పేరుతో వేల కోట్లు దోచుకోవచ్చని చూశారు తప్పా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన ఏనాడు మాజీ సీఎం కేసీఆర్​, హరీశ్​ రావుకు లేదని విమర్శించారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టును నాల్చారని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, అదేవిధంగా పాలమూరు జిల్లాలోనూ పరిస్థితులు ఇదే రకంగా ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్​ పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టు పంపులను ఆన్​ చేయలేదని అన్నారు. పదేళ్లులో ఈ ప్రాజెక్టు పనులను బీఆర్​ఎస్​ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత పదేళ్లులో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. హరీశ్​ రావు తమ ప్రభుత్వ శ్రమను చులకనగా చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.

మూడు పంప్​ హౌస్​లు ప్రారంభం : అంతకు ముందు సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్​ హౌస్​ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ప్రారంభించారు. అలాగే భద్రాద్రిలోని మూడో పంప్​ హౌస్​ను ములకలపల్లి మండలం కమలాపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్​ జిల్లాలకు 1.20 లక్షల ఎకరాలకు ఆయకట్ట ద్వారా సాగునీరు అందనుంది.

సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్​ రన్​ సక్సెస్ - త్వరలోనే ప్రారంభం - Sitarama Project Trial Run

సీతారామ ప్రాజెక్టు తొలి పంప్​హౌస్​​ ట్రయల్ రన్ విజయవంతం - భావోద్వేగానికి గురైన తుమ్మల - Seetharama Project Trail Run

CM Revanth Reddy Launched Sitarama Project : సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పూసుగూడెం పంప్​ హౌస్​ను సీఎం రేవంత్​ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీఎస్​ శాంతి కుమారి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు ఫైలాన్​ను సీఎం రేవంత్​ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు.

'బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేలు గత పదేళ్లులో ఏనాడు వారి నియోజకవర్గాలకు నీళ్లు కావాలని అడగలేదు. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నీళ్లు కావాలని అడుగుతున్నారు. ఇది తమ ప్రభుత్వం విశ్వసనీయతకు నిదర్శనం. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్​, హరీశ్​రావు వారి మాటలతో అంచనాలు పెంచి నిధులు దోచుకున్నారు అందుకే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎలాంటి కోరికలు కోరలేదు. పదేళ్ల కాలంలో ఎక్కడ ప్రాజెక్టుల్లో అక్రమాలు బయటపడతాయని భయపడి సీడబ్ల్యూసీకి డీపీఆర్​లను పంపించలేదు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా డీపీఆర్​ను కూడా పంపించలేదు. ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులకు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయం కనిపించింది. రూ.18 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.7 వేల కోట్లను ఖర్చు చేశారు. కానీ ఒక్క గుంట భూమికి కూడా నీరు ఇవ్వలేదు.' అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

ప్రాజెక్టులు రీడిజైనింగ్​ పేరుతో వేల కోట్లు దోచుకోవచ్చని చూశారు తప్పా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన ఏనాడు మాజీ సీఎం కేసీఆర్​, హరీశ్​ రావుకు లేదని విమర్శించారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టును నాల్చారని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, అదేవిధంగా పాలమూరు జిల్లాలోనూ పరిస్థితులు ఇదే రకంగా ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్​ పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టు పంపులను ఆన్​ చేయలేదని అన్నారు. పదేళ్లులో ఈ ప్రాజెక్టు పనులను బీఆర్​ఎస్​ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత పదేళ్లులో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. హరీశ్​ రావు తమ ప్రభుత్వ శ్రమను చులకనగా చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.

మూడు పంప్​ హౌస్​లు ప్రారంభం : అంతకు ముందు సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్​ హౌస్​ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ప్రారంభించారు. అలాగే భద్రాద్రిలోని మూడో పంప్​ హౌస్​ను ములకలపల్లి మండలం కమలాపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్​ జిల్లాలకు 1.20 లక్షల ఎకరాలకు ఆయకట్ట ద్వారా సాగునీరు అందనుంది.

సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్​ రన్​ సక్సెస్ - త్వరలోనే ప్రారంభం - Sitarama Project Trial Run

సీతారామ ప్రాజెక్టు తొలి పంప్​హౌస్​​ ట్రయల్ రన్ విజయవంతం - భావోద్వేగానికి గురైన తుమ్మల - Seetharama Project Trail Run

Last Updated : Aug 15, 2024, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.