ETV Bharat / state

రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చడమే మా లక్ష్యం - సీఎం రేవంత్​ - CM REVANTH INAGURATES COGNIZANT

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 7:43 PM IST

Updated : Aug 14, 2024, 7:59 PM IST

CM REVANTH INAGURATES COGNIZANT CAMPUS : రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కొనసాగించిన అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. తమ పోటీ, పొరుగు రాష్ట్రాలైనా ఏపీ, కర్ణాటకతో కాదని ప్రపంచంతోనే తమ పోటీ అని పునరుద్ఘాటించారు.

CM REVANTH AIMS TRILLION DOLLAR ECONOMY
CM REVANTH INAGURATES COGNIZANT CAMPUS (ETV Bharat)

CM REVANTH AIMS TRILLION DOLLAR ECONOMY : హైదరాబాద్‌ అభివృద్ది విషయంలో ప్రపంచంతోనే పోటీ పడుతాం తప్ప, పక్క రాష్ట్రాలతో కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే పదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేదే తమ సంకల్పమని వెల్లడించారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ది చేస్తామని సీఎం ప్రకటించారు.

ఐటీ అభివృద్దికి పునాది : హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్​ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ కాగ్నిజెంట్‌ విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, రాజీవ్‌ గాంధీ కృషితో హైదరాబాద్​లో ఐటీ అభివృద్దికి పునాదిపడిందని సీఎం వివరించారు.

పెట్టుబడుల వెల్లువ : రాజకీయ వైషమ్యాలకు పోకుండా ఆ తర్వాత చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్దిని కొనసాగించారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తాను తిరిగి వచ్చినట్లు ముఖ్యమంత్రి​ తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియాలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నానని, ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం వివరించారు.

రాబోయే 2 నెలల్లో మరిన్ని ఒప్పందాలు జరుగుతాయని, తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ రెండో రింగ్‌ రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ద్వారా సెమీ అర్బన్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఔట్‌ సైడ్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిధి గ్రామాలను ఆసియాలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్​ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, పారిశ్రామిక వేత్తలకు ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నట్లు సీఎం తెలిపారు.

"రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వాలు కొనసాగించిన నగర అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాము. మా పోటీ, పొరుగు రాష్ట్రాలైనా ఏపీ, కర్ణాటకతో కాదు. ప్రపంచంతోనే మేము పోటీ పడతాం". - రేవంత్​రెడ్డి, సీఎం

రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - పార్టీ నేతల ఘన స్వాగతం - CM Revanth Landed in Hyderabad

సియోల్​లో సీఎం రేవంత్ పెట్టుబడుల వేట - మెగా కారు టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు హ్యుందాయ్ సంసిద్ధత - CM Revanth South Korea Tour

CM REVANTH AIMS TRILLION DOLLAR ECONOMY : హైదరాబాద్‌ అభివృద్ది విషయంలో ప్రపంచంతోనే పోటీ పడుతాం తప్ప, పక్క రాష్ట్రాలతో కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే పదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేదే తమ సంకల్పమని వెల్లడించారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ది చేస్తామని సీఎం ప్రకటించారు.

ఐటీ అభివృద్దికి పునాది : హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్​ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ కాగ్నిజెంట్‌ విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, రాజీవ్‌ గాంధీ కృషితో హైదరాబాద్​లో ఐటీ అభివృద్దికి పునాదిపడిందని సీఎం వివరించారు.

పెట్టుబడుల వెల్లువ : రాజకీయ వైషమ్యాలకు పోకుండా ఆ తర్వాత చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్దిని కొనసాగించారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తాను తిరిగి వచ్చినట్లు ముఖ్యమంత్రి​ తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియాలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నానని, ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం వివరించారు.

రాబోయే 2 నెలల్లో మరిన్ని ఒప్పందాలు జరుగుతాయని, తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ రెండో రింగ్‌ రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ద్వారా సెమీ అర్బన్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఔట్‌ సైడ్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిధి గ్రామాలను ఆసియాలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్​ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, పారిశ్రామిక వేత్తలకు ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నట్లు సీఎం తెలిపారు.

"రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వాలు కొనసాగించిన నగర అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాము. మా పోటీ, పొరుగు రాష్ట్రాలైనా ఏపీ, కర్ణాటకతో కాదు. ప్రపంచంతోనే మేము పోటీ పడతాం". - రేవంత్​రెడ్డి, సీఎం

రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - పార్టీ నేతల ఘన స్వాగతం - CM Revanth Landed in Hyderabad

సియోల్​లో సీఎం రేవంత్ పెట్టుబడుల వేట - మెగా కారు టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు హ్యుందాయ్ సంసిద్ధత - CM Revanth South Korea Tour

Last Updated : Aug 14, 2024, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.