ETV Bharat / state

ఆ ఇద్దరు అక్కలు నన్ను మోసం చేశారు - అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా : సీఎం రేవంత్ - CM Revanth on BRS Woman MLAs

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 3:04 PM IST

Updated : Aug 1, 2024, 3:51 PM IST

CM Revanth Reddy Speech at Assembly : అక్కలను అడ్డం పెట్టుకొని బీఆర్​ఎస్​ రాజకీయం చేస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. బీఆర్​ఎస్​ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తుందని అన్నారు. అసెంబ్లీలో స్కిల్​ యూనివర్సిటీ బిల్లు ఆమోదం కోసం జరిగిన చర్చలో ఈ విధంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు.

CM Revanth Reddy Comments on BRS Woman MLAs
CM Revanth Reddy Comments on BRS Woman MLAs (ETV Bharat)

CM Revanth Reddy Comments on BRS Woman MLAs : 'బీఆర్​ఎస్​ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తుంది. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్​ఎస్​ రాజకీయం చేస్తోంది. సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసినా ఏం అనలేదు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. పార్టీని వదిలివెళ్లిన వారిలో ఒకరు మహిళా కమిషన్​ ఛైర్మన్​ పదవి తెచ్చుకున్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారని' సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

తన కుటుంబ సభ్యురాలు సీతక్క పట్ల ఎంత అవమానకరంగా మాట్లాడారని సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన చెందారు. సీతక్కను అవమానించేలా సోషల్​ మీడియాలో మీమ్స్​ పెట్టడమేనా మీ నీతి అని ప్రశ్నించారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించవచ్చా అని అడిగారు. ఎవరి ఉచ్చులో పడి తప్పుదోవ పడుతున్న అక్కలను తాను చెబుతున్నది ఒక్కటే మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తిహాడ్​ జైలులో ఉన్నారని గుర్తు చేశారు. వారిని అరెస్టు చేయవద్దని అవసరమైతే తమ చెల్లెలను ఏడాదిపాటు జైలులో ఉంచమని బేరసారాలు చేసుకున్నారని సీఎం విమర్శలు చేశారు.

"సబిత, సునీత కోసం కొట్లాడింది నేను. మహిళలను నేను గౌరవిస్తాను. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. జైళ్లో ఉన్న సొంత చెల్లి గురించి మాట్లాడరు. రైతు రుణమాఫీని దెబ్బ తీసి స్కిల్​ వర్సిటీ ఆలోచనను అడ్డుకునేందుకు యత్నించారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తానని మోసం చేశారు. దళితునికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి బర్త్​రఫ్​ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ -​ ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే గడ్డం ప్రసాద్​ను స్పీకర్​ను చేశారు"- రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసిన చరిత్ర కాంగ్రెస్​ది : దళితుడైన స్పీకర్​ ముందు కింద కూర్చోవడం ఇష్టం లేకనే కేసీఆర్​ సభకు రాలేదని సీఎం రేవంత్​ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దళిత బిడ్డను అధ్యక్ష అని అనడం ఇష్టం లేకే కేసీఆర్​ సభకు రాలేదన్నారు. దళితుడిని అధ్యక్షా అనే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చిందని తెలిపారు. దళితులను అవమానించిన కేసీఆర్​, సభలో మాట్లాడాలంటే ఆ దళితులనే అధ్యక్షా అని అడుక్కునే పరిస్థితిని కాంగ్రెస్​ తీసుకొచ్చిందని చెప్పారు. కేసీఆర్​కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్​, వార్డు మెంబరైన హరీశ్​ రావును రాష్ట్ర మంత్రిని చేసింది రాజశేఖర్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీనే అని గుర్తు చేశారు.

సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ధర్నా - బలవంతంగా బయటకు తీసుకొచ్చిన మార్షల్స్ - POLICE ARREST THE BRS MLAS

కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదు : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Reacts Sabhitha Comments

CM Revanth Reddy Comments on BRS Woman MLAs : 'బీఆర్​ఎస్​ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తుంది. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్​ఎస్​ రాజకీయం చేస్తోంది. సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసినా ఏం అనలేదు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. పార్టీని వదిలివెళ్లిన వారిలో ఒకరు మహిళా కమిషన్​ ఛైర్మన్​ పదవి తెచ్చుకున్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారని' సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

తన కుటుంబ సభ్యురాలు సీతక్క పట్ల ఎంత అవమానకరంగా మాట్లాడారని సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన చెందారు. సీతక్కను అవమానించేలా సోషల్​ మీడియాలో మీమ్స్​ పెట్టడమేనా మీ నీతి అని ప్రశ్నించారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించవచ్చా అని అడిగారు. ఎవరి ఉచ్చులో పడి తప్పుదోవ పడుతున్న అక్కలను తాను చెబుతున్నది ఒక్కటే మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తిహాడ్​ జైలులో ఉన్నారని గుర్తు చేశారు. వారిని అరెస్టు చేయవద్దని అవసరమైతే తమ చెల్లెలను ఏడాదిపాటు జైలులో ఉంచమని బేరసారాలు చేసుకున్నారని సీఎం విమర్శలు చేశారు.

"సబిత, సునీత కోసం కొట్లాడింది నేను. మహిళలను నేను గౌరవిస్తాను. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. జైళ్లో ఉన్న సొంత చెల్లి గురించి మాట్లాడరు. రైతు రుణమాఫీని దెబ్బ తీసి స్కిల్​ వర్సిటీ ఆలోచనను అడ్డుకునేందుకు యత్నించారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తానని మోసం చేశారు. దళితునికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి బర్త్​రఫ్​ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ -​ ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే గడ్డం ప్రసాద్​ను స్పీకర్​ను చేశారు"- రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసిన చరిత్ర కాంగ్రెస్​ది : దళితుడైన స్పీకర్​ ముందు కింద కూర్చోవడం ఇష్టం లేకనే కేసీఆర్​ సభకు రాలేదని సీఎం రేవంత్​ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దళిత బిడ్డను అధ్యక్ష అని అనడం ఇష్టం లేకే కేసీఆర్​ సభకు రాలేదన్నారు. దళితుడిని అధ్యక్షా అనే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చిందని తెలిపారు. దళితులను అవమానించిన కేసీఆర్​, సభలో మాట్లాడాలంటే ఆ దళితులనే అధ్యక్షా అని అడుక్కునే పరిస్థితిని కాంగ్రెస్​ తీసుకొచ్చిందని చెప్పారు. కేసీఆర్​కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్​, వార్డు మెంబరైన హరీశ్​ రావును రాష్ట్ర మంత్రిని చేసింది రాజశేఖర్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీనే అని గుర్తు చేశారు.

సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ధర్నా - బలవంతంగా బయటకు తీసుకొచ్చిన మార్షల్స్ - POLICE ARREST THE BRS MLAS

కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదు : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Reacts Sabhitha Comments

Last Updated : Aug 1, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.