ETV Bharat / state

వరద నష్టం రూ.10,320 కోట్లు - కేంద్ర బృందానికి నివేదించిన సీఎం రేవంత్ - CM REVANTH MEETS CENTRAL TEAM

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 3:11 PM IST

Updated : Sep 13, 2024, 7:41 PM IST

CM Revanth Meets Central Team Today : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టం గురించి వివరించారు. మొత్తం నష్టం రూ.10,320 కోట్లుగా అంచనావేశారు. మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రానికి వరద సాయం చేయాలని కోరారు.

CM Revanth Meets Central Team Today
CM Revanth Meets Central Team Today (ETV Bharat)

CM Revanth Meets Central Team Today : రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదలతో తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్ర బృందానికి వివరించారు. తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సచివాలయంలో ఇవాళ (సెప్టెంబరు 13వ తేదీ) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి మంత్రులు వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో చెప్పారు. పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల గురించి వివరించడంతో పాటు ఆస్తినష్టం జరిగిన తీరును కూడా కేంద్ర బృందానికి సవివరంగా తెలిపారు. 10,320 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.

Telangana Floods
తెలంగాణ వరద నష్టం అంచనాలు (ETV Bharat)

Central Team On Floods in Telangana : వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కార్యాచరణ ప్రణాళిక ఉండాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు, వరద వల్ల రాష్ట్రంలో రూ.10,320 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అత్యంత అధికంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.7,693 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.1,216 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది.

మున్నేరు దాటికి ఆనవాళ్లు కోల్పోయిన సరస్వతి నిలయాలు - చదువులు సాగేదెలా! - Munneru Floods Damage Schools

ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలి. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలి. ఇప్పుడున్న నిబంధనలు చూస్తే రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్‌లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లు నిర్ణయించారు. ఆ డబ్బుతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదు. రాష్ట్రంలో జరిగిన నష్టంతోపాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తాం. అవి పరిశీలించి విపత్తు సాయం అందించాలి. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

కేంద్ర బృందం అంతకు ముందు తెలంగాణలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కలిసింది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ అధికారులతో చర్చించిన కేంద్ర బృందానికి రాష్ట్రంలో జరిగిన ఆస్తినష్టం, పంటనష్టం గురించి తెలియజేశారు. ఏయే ప్రాంతాల్లో వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందో వివరించారు. మానవీయ కోణంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024

భారీ వర్షాలు, వరదలకు కోలుకోలేని స్థితిలో ఖమ్మం జిల్లా - రూ.417 కోట్లు బురద పాలు - Floods loss in Khammam

CM Revanth Meets Central Team Today : రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదలతో తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్ర బృందానికి వివరించారు. తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సచివాలయంలో ఇవాళ (సెప్టెంబరు 13వ తేదీ) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి మంత్రులు వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో చెప్పారు. పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల గురించి వివరించడంతో పాటు ఆస్తినష్టం జరిగిన తీరును కూడా కేంద్ర బృందానికి సవివరంగా తెలిపారు. 10,320 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.

Telangana Floods
తెలంగాణ వరద నష్టం అంచనాలు (ETV Bharat)

Central Team On Floods in Telangana : వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కార్యాచరణ ప్రణాళిక ఉండాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు, వరద వల్ల రాష్ట్రంలో రూ.10,320 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అత్యంత అధికంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.7,693 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.1,216 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది.

మున్నేరు దాటికి ఆనవాళ్లు కోల్పోయిన సరస్వతి నిలయాలు - చదువులు సాగేదెలా! - Munneru Floods Damage Schools

ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలి. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలి. ఇప్పుడున్న నిబంధనలు చూస్తే రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్‌లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లు నిర్ణయించారు. ఆ డబ్బుతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదు. రాష్ట్రంలో జరిగిన నష్టంతోపాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తాం. అవి పరిశీలించి విపత్తు సాయం అందించాలి. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

కేంద్ర బృందం అంతకు ముందు తెలంగాణలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కలిసింది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ అధికారులతో చర్చించిన కేంద్ర బృందానికి రాష్ట్రంలో జరిగిన ఆస్తినష్టం, పంటనష్టం గురించి తెలియజేశారు. ఏయే ప్రాంతాల్లో వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందో వివరించారు. మానవీయ కోణంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024

భారీ వర్షాలు, వరదలకు కోలుకోలేని స్థితిలో ఖమ్మం జిల్లా - రూ.417 కోట్లు బురద పాలు - Floods loss in Khammam

Last Updated : Sep 13, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.