Prakash Raj tweet on Tirupati Laddu Issue : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను జోడిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలున్న పోస్టును షేర్ చేశారు. ఆ ఫొటో కింద దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ ప్రకాశ్రాజ్ వ్యాఖ్యానించారు.
దీంతో మరోసారి ప్రకాశ్రాజ్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వివాదానికి సంబంధించి ప్రకాశ్ రాజ్ ఇటీవల చేసిన కామెంట్స్పై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు ఆ పార్టీ నాయకులు, మూవీ ఆర్టిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి ప్రకాశ్రాజ్ లడ్డూ వివాదంపై స్పందిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿
— Prakash Raj (@prakashraaj) September 30, 2024
జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun