ETV Bharat / state

మహానందిలో బాబోయ్​ పులి - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు - Chirutha Samcharam in Mahanandi

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 12:52 PM IST

Updated : Jul 12, 2024, 3:00 PM IST

Cheetah Wandering Around Mahanandi Temple: గత కొన్ని రోజులుగా నంద్యాల జిల్లా మహానందిలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ సమీపంలోని గోశాల వద్దకు రెండు సార్లు చిరుత వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, దానిని బంధించేందుకు ప్రత్యేక బోన్​లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Cheetah Wandering Around Mahanandi Temple
Cheetah Wandering Around Mahanandi Temple (ETV Bharat)
'అమ్మో పులి బాబోయ్​' - మహనందిలో చిరుత సంచారం - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు (ETV Bharat)

Cheetah Wandering Around Mahanandi Temple in Nandyal District: నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తుండంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆలయ సమీపంలోని గోశాల వద్దకు రెండు సార్లు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచరించడంతో పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన నాగన్న అనే యువకుడిపై చిరుత దాడి చేయడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిక ఏర్పాటు చేశారు.

నెల్లూరు జిల్లా పెనుశిల అభయారణ్యంలో పెద్దపులి, చిరుతల సంచారం - forest department officer interview

గత కొన్ని రోజులుగా చిరుత సంచారం మహానంది పరిసరాల్లో ఏదో ఒక ప్రదేశంలో కొనసాగుతోంది. మహానందిలోని టీటీడీ సత్రాల సమీపంలో గురువారం ఉదయం చిరుత కుక్కను నోటితో పట్టుకొని వెళ్లిందని, సాయంత్రం మహానందీశ్వరనగర్, ఎంప్లాయిస్‌ కాలనీలో కనిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరాదని చిరుత సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుత కదలికలను గుర్తించి బంధించేందుకు ట్రాప్​ కెమెరాలతో పాటు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

పోలవరంలో మళ్లీ చిరుత కలకలం - భయాందోళనకు గురవుతున్న ప్రజలు - Leopard Migration in Polavaram

చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో ప్రజలు వెదురు కర్రల సేకరణకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఇప్పటికే కలెక్టర్​ సైతం విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత పులి జనవాసల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

'రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లొద్దు'- చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్​ - People Alert Beware of leopard

'అమ్మో పులి బాబోయ్​' - మహనందిలో చిరుత సంచారం - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు (ETV Bharat)

Cheetah Wandering Around Mahanandi Temple in Nandyal District: నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తుండంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆలయ సమీపంలోని గోశాల వద్దకు రెండు సార్లు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచరించడంతో పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన నాగన్న అనే యువకుడిపై చిరుత దాడి చేయడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిక ఏర్పాటు చేశారు.

నెల్లూరు జిల్లా పెనుశిల అభయారణ్యంలో పెద్దపులి, చిరుతల సంచారం - forest department officer interview

గత కొన్ని రోజులుగా చిరుత సంచారం మహానంది పరిసరాల్లో ఏదో ఒక ప్రదేశంలో కొనసాగుతోంది. మహానందిలోని టీటీడీ సత్రాల సమీపంలో గురువారం ఉదయం చిరుత కుక్కను నోటితో పట్టుకొని వెళ్లిందని, సాయంత్రం మహానందీశ్వరనగర్, ఎంప్లాయిస్‌ కాలనీలో కనిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరాదని చిరుత సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుత కదలికలను గుర్తించి బంధించేందుకు ట్రాప్​ కెమెరాలతో పాటు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

పోలవరంలో మళ్లీ చిరుత కలకలం - భయాందోళనకు గురవుతున్న ప్రజలు - Leopard Migration in Polavaram

చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో ప్రజలు వెదురు కర్రల సేకరణకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఇప్పటికే కలెక్టర్​ సైతం విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత పులి జనవాసల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

'రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లొద్దు'- చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్​ - People Alert Beware of leopard

Last Updated : Jul 12, 2024, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.