ETV Bharat / state

సీఎం రేవంత్ రెడ్డి​ రిక్వెస్ట్​ - స్మార్ట్​ సిటీస్​ మిషన్​ గడువు పొడిగించిన కేంద్రం - extend smart cities mission

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 4:13 PM IST

Updated : Jun 30, 2024, 4:28 PM IST

Central Govt Extend Smart Cities Mission Scheme : సీఎం రేవంత్​ రెడ్డి విజ్ఞప్తి మేరకు స్మార్ట్​ సిటీస్​ మిషన్​ గడువును 2025 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలతోనే గడువు ముగియనుండగా, మరో ఏడాది పాటు గడువును పెంచి 2025 మార్చి 31వరకు పెంచారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రితో ఈ విషయం భేటీ అయ్యారు. ఇప్పుడు ప్రతిఫలంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తెలిపింది.

Central Govt Extend Smart Cities Mission Scheme
Central Govt Extend Smart Cities Mission Scheme (ETV Bharat)

CM Revanth Request Smart Cities Mission Extend : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. స్మార్ట్​ సిటీస్​ మిషన్​ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, స్మార్ట్​ సిటీస్​ మిషన్​ పనుల గడువును పొడిగించింది. దిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్​ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​ను కలిసి స్మార్ట్​ సిటీస్​ మిషన్​ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్​ వరకు పొడిగించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం, మరో ఏడాది పాటు స్మార్ట్​ సిటీస్​ మిషన్​ను పొడిగించింది.

కేంద్ర ప్రభుత్వం గత ఒప్పందం ప్రకారం స్మార్ట్​ సిటీస్​ మిషన్​ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో వరంగల్​, కరీంనగర్​ నగరాల్లో స్మార్ట్​ సిటీస్​ మిషన్​ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్​లో ఇప్పటివరకు 45 పనులు పూర్తి కాగా, రూ.518 కోట్లతో మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్​లో 25 పనులు పూర్తి కాగా, మరో రూ.287 కోట్లకు సంబంధించిన 22 పనులు కొనసాగుతున్నాయి. స్మార్ట్​ సిటీ మిషన్​ పనులు పూర్తి కానందున ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్​ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు.

సీఎం విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం స్మార్ట్​ సిటీ మిషన్​ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండదని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఫస్ట్​ కమ్​ ఫస్ట్​ పద్ధతిన విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.

స్మార్ట్​ సిటీస్​ మిషన్​ పథకం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 జూన్​ 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మిషన్​ అమలు బాధ్యతను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. స్మార్ట్​ సిటీస్​ మిషన్​ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా వంద నగరాలను ఎంపిక చేశారు. ఈ వంద నగరాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన మౌలిక సదుపాయాలు, స్వచ్ఛమైన, స్థిరమైన పర్యావరణం, అధిక నాణ్యత గల జీవనాన్ని అందించే నగరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. ఇప్పటికీ కూడా సక్సెస్​ ఫుల్​గా రన్​ అవుతుంది. తెలంగాణ నుంచి వరంగల్​, హైదరాబాద్​, కరీంనగర్​ జిల్లాలు ఎంపిక అయ్యాయి.

కరీంనగర్​ స్మార్ట్​సిటీ నిధుల దుర్వినియోగంపై సర్కార్‌ ఫోకస్ - తీగల వంతెన, మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులపైనా విచారణ

India Smart Cities Conclave 2023 : బెస్ట్ స్మార్ట్ సిటీగా ఇందౌర్​.. సూరత్​కు రెండో స్థానం

CM Revanth Request Smart Cities Mission Extend : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. స్మార్ట్​ సిటీస్​ మిషన్​ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, స్మార్ట్​ సిటీస్​ మిషన్​ పనుల గడువును పొడిగించింది. దిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్​ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​ను కలిసి స్మార్ట్​ సిటీస్​ మిషన్​ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్​ వరకు పొడిగించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం, మరో ఏడాది పాటు స్మార్ట్​ సిటీస్​ మిషన్​ను పొడిగించింది.

కేంద్ర ప్రభుత్వం గత ఒప్పందం ప్రకారం స్మార్ట్​ సిటీస్​ మిషన్​ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో వరంగల్​, కరీంనగర్​ నగరాల్లో స్మార్ట్​ సిటీస్​ మిషన్​ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్​లో ఇప్పటివరకు 45 పనులు పూర్తి కాగా, రూ.518 కోట్లతో మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్​లో 25 పనులు పూర్తి కాగా, మరో రూ.287 కోట్లకు సంబంధించిన 22 పనులు కొనసాగుతున్నాయి. స్మార్ట్​ సిటీ మిషన్​ పనులు పూర్తి కానందున ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్​ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు.

సీఎం విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం స్మార్ట్​ సిటీ మిషన్​ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండదని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఫస్ట్​ కమ్​ ఫస్ట్​ పద్ధతిన విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.

స్మార్ట్​ సిటీస్​ మిషన్​ పథకం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 జూన్​ 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మిషన్​ అమలు బాధ్యతను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. స్మార్ట్​ సిటీస్​ మిషన్​ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా వంద నగరాలను ఎంపిక చేశారు. ఈ వంద నగరాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన మౌలిక సదుపాయాలు, స్వచ్ఛమైన, స్థిరమైన పర్యావరణం, అధిక నాణ్యత గల జీవనాన్ని అందించే నగరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. ఇప్పటికీ కూడా సక్సెస్​ ఫుల్​గా రన్​ అవుతుంది. తెలంగాణ నుంచి వరంగల్​, హైదరాబాద్​, కరీంనగర్​ జిల్లాలు ఎంపిక అయ్యాయి.

కరీంనగర్​ స్మార్ట్​సిటీ నిధుల దుర్వినియోగంపై సర్కార్‌ ఫోకస్ - తీగల వంతెన, మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులపైనా విచారణ

India Smart Cities Conclave 2023 : బెస్ట్ స్మార్ట్ సిటీగా ఇందౌర్​.. సూరత్​కు రెండో స్థానం

Last Updated : Jun 30, 2024, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.