ETV Bharat / state

విదేశీ కరెన్సీ స్మగ్లింగ్​ - రాజీవ్​గాంధీ విమానాశ్రయ కస్టమ్స్​ అధికారులపై సీబీఐ కేసు - Currency Rocket at RGIA

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 7:29 PM IST

Foreign Currency Rocket at RGIA : ఈ ఏడాది మార్చి నెలలో రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్​ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో సీబీఐ రంగంలోకి దిగింది. విమానాశ్రయం కస్టమ్స్​ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Foreign Currency Rocket at RGIA
Foreign Currency Rocket at RGIA (ETV Bharat)

CBI Books Customs Officials RGIA Foreign Currency Case : విదేశీ కరెన్సీ అక్రమ రవాణా కేసులో రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్​ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​ ద్వారా భారీగా విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరుగుతుందని ఈ ఏడాది మార్చి 16న వెలుగులోకి వచ్చింది. సీఐఎస్​ఎఫ్​ సిబ్బందితో పాటు క్రైం అండ్​ ఇంటెలిజెన్స్​ అధికారులు శంషాబాద్​ విమానాశ్రయంలో భారతీయ కరెన్సీతో విదేశీ కరెన్సీని మార్పిడీ చేస్తున్నారన్న సమాచారంతో సిటీ సైడ్​ అరైవల్​ ఏరియాలో నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.

శంషాబాద్​ విమానాశ్రయంలోని సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది, కస్టమ్స్​ విభాగంలో వరుసగా ఆఫీస్ బాయ్​, లోడర్​గా పని చేస్తున్న ఓం ప్రకాశ్​ దత్తా, ఎల్​.సంజయ్​ పాల్​ అనే ఇద్దరు వ్యక్తులను వివిధ దేశాల విదేశీ కరెన్సీని మార్పిడీ చేస్తుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. హైదరాబాద్​లోని బహదూర్​పురా నివాసితులు గులాం అలీ అతని కుమారుడు సాజిద్​తో కలిసి రూ.4.04 లక్షల విలువైన భారతీయ కరెన్సీని తీసుకువెళుతున్నారు. విదేశీ కరెన్సీలలో యూఎస్​డీ, సౌదీ రియాల్స్​, దిర్హామ్​, ఒమన్​ రియాల్స్​, సింగపూర్​ డాలర్​, కువైట్​ దినార్​ ఉన్నాయి.

సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది నగదును స్వాధీనం చేసుకుని కస్టమ్​ అధికారులకు అప్పగించారు. విదేశీ కరెన్సీని పి.చక్రపాణి, వై.శ్రీనివాసులు, సూపరింటెండెంట్​లు, హైదరాబాద్​లోని ఆర్​జీఐఏ(RGIA)లో పని చేస్తున్న ముగ్గురు, కస్టమ్స్​ విభాగంలో పని చేస్తున్న ఇన్​స్పెక్టర్​ పంకజ్​ కుమార్​ గౌతమ్​ నుంచి ఓం ప్రకాశ్​ దత్తా అందుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విదేశీ కరెన్సీ స్మగ్లింగ్​ గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు తదుపరి విచారణలో వెల్లడైంది. సీఐఎస్​ఎఫ్​ అధికారులు సీజ్​ చేసిన కరెన్సీని తదుపరి చర్యల నిమిత్తం కస్టమ్స్​ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్​ డిపార్ట్​మెంట్​ విచారణ నిమిత్తం సీబీఐ సహాయాన్ని కోరింది.

సీబీఐ కీలక పత్రాలు స్వాధీనం : ఆ తర్వాత సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్​లోని ఆర్​జీఐఏలోని కస్టమ్స్​ డిపార్ట్​మెంట్​ సూపరింటెండెంట్​ వై.శ్రీనివాసు, పేరి చక్రపాణి హైదరాబాద్​ కస్టమ్స్​ డిపార్ట్​మెంట్​, ఆర్​జీఐఏ ఇన్పెక్టర్​ పంకజ్​ గౌతమ్​ ప్రాథమికంగా అవినీతికి పాల్పడినట్లు లా ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు కస్టమ్స్​ అధికారుల ఇళ్లు, కార్యాలయంలో సోదాలు జరిపి కీలకమైన పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ ఐపీసీ సెక్షన్​ 120 బీ నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

శంషాబాద్​ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్​ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!

Gold seize in Shamshabad airport : శంషాబాద్ విమానాశ్రయంలో 3.7కిలోల బంగారం పట్టివేత.. లగేజీబ్యాగుల తనీఖీల్లో స్వాధీనం

CBI Books Customs Officials RGIA Foreign Currency Case : విదేశీ కరెన్సీ అక్రమ రవాణా కేసులో రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్​ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​ ద్వారా భారీగా విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరుగుతుందని ఈ ఏడాది మార్చి 16న వెలుగులోకి వచ్చింది. సీఐఎస్​ఎఫ్​ సిబ్బందితో పాటు క్రైం అండ్​ ఇంటెలిజెన్స్​ అధికారులు శంషాబాద్​ విమానాశ్రయంలో భారతీయ కరెన్సీతో విదేశీ కరెన్సీని మార్పిడీ చేస్తున్నారన్న సమాచారంతో సిటీ సైడ్​ అరైవల్​ ఏరియాలో నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.

శంషాబాద్​ విమానాశ్రయంలోని సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది, కస్టమ్స్​ విభాగంలో వరుసగా ఆఫీస్ బాయ్​, లోడర్​గా పని చేస్తున్న ఓం ప్రకాశ్​ దత్తా, ఎల్​.సంజయ్​ పాల్​ అనే ఇద్దరు వ్యక్తులను వివిధ దేశాల విదేశీ కరెన్సీని మార్పిడీ చేస్తుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. హైదరాబాద్​లోని బహదూర్​పురా నివాసితులు గులాం అలీ అతని కుమారుడు సాజిద్​తో కలిసి రూ.4.04 లక్షల విలువైన భారతీయ కరెన్సీని తీసుకువెళుతున్నారు. విదేశీ కరెన్సీలలో యూఎస్​డీ, సౌదీ రియాల్స్​, దిర్హామ్​, ఒమన్​ రియాల్స్​, సింగపూర్​ డాలర్​, కువైట్​ దినార్​ ఉన్నాయి.

సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది నగదును స్వాధీనం చేసుకుని కస్టమ్​ అధికారులకు అప్పగించారు. విదేశీ కరెన్సీని పి.చక్రపాణి, వై.శ్రీనివాసులు, సూపరింటెండెంట్​లు, హైదరాబాద్​లోని ఆర్​జీఐఏ(RGIA)లో పని చేస్తున్న ముగ్గురు, కస్టమ్స్​ విభాగంలో పని చేస్తున్న ఇన్​స్పెక్టర్​ పంకజ్​ కుమార్​ గౌతమ్​ నుంచి ఓం ప్రకాశ్​ దత్తా అందుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విదేశీ కరెన్సీ స్మగ్లింగ్​ గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు తదుపరి విచారణలో వెల్లడైంది. సీఐఎస్​ఎఫ్​ అధికారులు సీజ్​ చేసిన కరెన్సీని తదుపరి చర్యల నిమిత్తం కస్టమ్స్​ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్​ డిపార్ట్​మెంట్​ విచారణ నిమిత్తం సీబీఐ సహాయాన్ని కోరింది.

సీబీఐ కీలక పత్రాలు స్వాధీనం : ఆ తర్వాత సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్​లోని ఆర్​జీఐఏలోని కస్టమ్స్​ డిపార్ట్​మెంట్​ సూపరింటెండెంట్​ వై.శ్రీనివాసు, పేరి చక్రపాణి హైదరాబాద్​ కస్టమ్స్​ డిపార్ట్​మెంట్​, ఆర్​జీఐఏ ఇన్పెక్టర్​ పంకజ్​ గౌతమ్​ ప్రాథమికంగా అవినీతికి పాల్పడినట్లు లా ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు కస్టమ్స్​ అధికారుల ఇళ్లు, కార్యాలయంలో సోదాలు జరిపి కీలకమైన పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ ఐపీసీ సెక్షన్​ 120 బీ నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

శంషాబాద్​ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్​ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!

Gold seize in Shamshabad airport : శంషాబాద్ విమానాశ్రయంలో 3.7కిలోల బంగారం పట్టివేత.. లగేజీబ్యాగుల తనీఖీల్లో స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.