ETV Bharat / state

అన్యాక్రాంతమవుతున్న అరుదైన కేన్ మొక్కలు - అధికారుల నిర్లక్ష్యమే కారణం! - Cane Trees Conservation

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 4:35 PM IST

Cane Trees in Mulugu District : దట్టమైన అడవిలో పెరిగే అరుదైన మొక్కలవి. ఎండను సైతం తట్టుకుని పచ్చగా పెరుగుతూ చల్లని నీడనివ్వడం ఆ మొక్కల సహజ గుణం. అవే ములుగు జిల్లా పాలంపేటలోని కేన్ మొక్కలు. ఎన్నోపక్షులు ఇతర జీవజాలానికి నిలయమైన ఈ ప్రాంతం క్రమేపీ కనుమరుగవుతోంది. కొన్ని రోజులుగా ఈ ప్రదేశం అన్యాక్రాంతానికి గురవుతోంది. మానవ తప్పిదాలతో అరుదైన ‍వెదురు జాతికి చెందిన కేన్‌ మెుక్కలను క్రమంగా నాశనం చేస్తున్నారు. గతంలో అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టినా ప్రస్తుతం అలాంటివేవీ కనిపించని పరిస్థితి. 51ఎకరాల్లో విస్తరించి ఉన్న కేన్‌ మెుక్కలు ప్రస్తుతం 5 ఎకరాలకు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ దుస్థితికి కారణమేంటి? వీటిని సంరక్షించే అవకాశమే లేదా? ఇప్పుడు చూద్దాం.

Endangered Cane Trees in Mulugu
Cane Trees in Mulugu District
అన్యాక్రాంతమవుతున్న అరుదైన కేన్ మొక్కలు అధికారుల నిర్లక్ష్యమే కారణం

Cane Trees in Mulugu District : వృక్షాలు మానవాళి మనుగడకు మూలం. వాటిని కాపాడుకోకపోతే మన ఉనికిని మనమే నాశనం చేసుకున్న వారిమవుతాం. కానీ, ప్రస్తుతం చెట్లు తగ్గిపోతున్నాయి. ఈరోజు కనిపించని అడవులు పాతికేళ్ల తర్వాత ఉంటాయా అంటే చెప్పలేని పరిస్థితి. అడవులు అంతరించిపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పటికే కీలకమైన వృక్ష సంపద కనుమరుగవుతోంది. అందులోనూ అరుదైన చెట్లపై స్మగ్లర్ల కన్ను పడి వాటి ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట శివారులో రామప్ప ఆలయం తూర్పు ద్వార సమీపంలో ఏపుగా పెరిగే అరుదైన వెదురు జాతికి చెందిన కేన్‌‍‍ మొక్కలు పూర్తిగా కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి.

కేరళ, అసోం తర్వాత తెలంగాణలోని పాలంపేట శివారు, పాకాల సరస్సు వద్ద మాత్రమే పెరిగే అరుదైన జీవవైవిధ్య కేన్‌ మొక్కలు మానవాళికే గాక పక్షులకు ఎంతో మేలు చేస్తాయి. ఇది అరకేసీ కుటుంబానికి చెందినది. ఈ మొక్కల కాండం ముళ్లతో ఉంటుంది. దీని నుంచి వచ్చే కలపను వివిధ గృహోపకరణాలకు వినియోగిస్తారు. ముఖ్యంగా సోఫాలు, కుర్చీలు, వాకింగ్ స్టిక్స్, ఫోటో ఫ్రేమ్‌లు ఇలా రకరకాల వస్తువులు తయారు చేయడానికి వాడతారు.

ప్రకృతితో స్నేహం రాజమ్మతాండ ఆరోగ్య రహస్యం - చావుకే సవాల్ విసురుతున్న గ్రామం - Healthy Village Rajamma Tanda

కేన్‌ మొక్కలు పర్యావరణహితం కావడంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. మొక్కలు పెరిగే ప్రాంతం రామప్ప చెరువు కట్ట కింది భాగం కావడంతో ఏడాది పొడవునా ఇక్కడి నేలలో తేమ ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండే కేన్‌మొక్కలు విస్తరించి ఉన్న ప్రాంతంలోకి మనుషులే కాదు ఇతర జంతువులు వెళ్లడం కష్టం. అందువల్లే ఇక్కడ అరుదైన తెల్లమద్ది వృక్షాలు ఉన్నాయి.

కేన్‌చెట్ల మధ్య ఉన్న ఇతర వృక్షాలపై వేలసంఖ్యలో గబ్బిలాలు నివసిస్తూ ఉంటాయి. వాటితోపాటు మొత్తం 120 జాతుల పక్షులు ఇక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు గుర్తుగా అరుదైన జీవవైవిధ్య ప్రాంతంగా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ, అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా కేన్‌వృక్షాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా జీవవైవిధ్యం సైతం ప్రమాదంలో పడుతోంది.

Endangered Cane Trees in Mulugu : సాప తీగ బరిగగా పిలుచుకునే కేన్‌ మొక్కలు జీవవైవిధ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఇవి పెరిగే పాలంపేట శివారు ప్రాంతాన్ని 1974లో అటవీశాఖ జీవవైవిద్య, పరిరక్షణ ప్రాంతంగా గుర్తించింది. ఈ మొక్కలపై పరిశోధనలు చేయడానికి అనేక ప్రాంతాల నుంచి వృక్ష శాస్త్ర నిపుణులు, విద్యార్థులు పాలంపేటకు వచ్చేవారు. అలా ఒకసారి పరిశోధనలకు వచ్చిన ఓ శాస్త్రవేత్తల బృందం కేరళ తర్వాత పాలంపేటలో మాత్రమే ఈ మొక్కలు ఉన్నాయని గుర్తించారు. దాదాపు 60ఎకరాల్లో ఉన్న ఈ మొక్కలు ఔషధ గుణాలు కలిగినవని తేల్చారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉండే కొన్ని కుటుంబాలు ఈ వెదురుతోనే చేతికర్రలు, ఊయల వంటి తయారు చేసి ఉపాధి పొందేవారు. కొన్నేళ్లుగా వారు వలస వెళ్లడంతో వీటిని పట్టించుకునే వారు కరవయ్యారు.

Bhoothpur Village Story : భూత్పూర్​ వాసుల క'న్నీటి' గోస.. ఎవరికీ పట్టడం లేదా..?

కేన్‌ మొక్కలను సంరక్షించాలన్న పాలంపేట స్థానికుల డిమాండ్‌తో 2014లో అటవీ, రెవెన్యూ శాఖలు సర్వే చేపట్టాయి. ఆ ప్రాంతం చుట్టూ కందకం తవ్వించారు. అయితే, వీటి సంరక్షణ‌పై కొద్దిరోజులు మాత్రమే దృష్టి సారించారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో మళ్లీ ఆ స్థలాలు పంటల సాగుకోసం ఆక్రమణలకు గురయ్యాయి. అలా తొలుత 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేన్‌ మొక్కలు ప్రస్తుతం ఐదారు ఎకరాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఉన్న కొద్ది పాటి మొక్కలను కూడా కొంత మంది కలప స్మగ్లర్లు కొద్దికొద్దిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల వీటికి కావాలని నిప్పు పెట్టడంతో పెద్ద సంఖ్యలో మొక్కలు కాలి బూడిదయ్యాయి.

3అంగుళాల పొడవైన అరుదైన ద్రాక్ష-దేశవిదేశాల్లో ఫుల్​ డిమాండ్​- రైతుకు రూ.లక్షల్లో ఆదాయం

Officers Negligence on Cane Trees Conservations : అధికారుల ఉదాసీనత అరుదైన కేన్ మొక్కల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తోంది. దీని వల్ల జీవవైవిధ్యం నాశనమవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేన్ మొక్కలను సంరక్షించాలని ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం కావాడాలని ప్రదర్శనలు చేసినా ఫలితం కనిపించట్లేదని వాపోతున్నారు. ఆక్రమణలకు అడ్డుకట్టవేసి కేన్ మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏళ్లుగా అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా అది కార్యరూపంలోకి రావడంలేదని అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి కేన్ మొక్కలను సంరక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం, దాంతో స్థానికంగా భూముల ధరలు పెరగడం వల్ల కూడా కేన్‌ మొక్కలను నాశనం చేయడానికి మరో కారణంగా కన్పిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేసి మొక్కలను సంరక్షించాలని అలాగే అరుదైన కేన్‌ మెుక్కలను మరిన్ని ఎకరాల్లో పెంచే చర్యలు చేపటాలని కోరుతున్నారు. కేవలం బోర్డులు పెట్టి మమ అనిపించకుండా, అధికారులు చిత్తశుద్ధితో ఈ అరుదైన జాతి మొక్కలను సంరక్షించి చర్యలు చేపట్టాలని అంటున్నారు. ఇక్కడే ఓ పార్క్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశలు ఉంటాయని అంటున్నారు. తద్వారా రామప్ప ఆలయ సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఘనమైన వారసత్వ సంపదగా నిలిచే రామప్ప పక్కనే ఉన్న ఈ అరుదైన వృక్ష, జీవ సంపదను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పూనుకోవాల్సింది అధికార యంత్రాంగమే.

Padakandla Srinivas: వ్యర్థాలకో అర్థం.. మోదీ మెచ్చిన వైనం

అన్యాక్రాంతమవుతున్న అరుదైన కేన్ మొక్కలు అధికారుల నిర్లక్ష్యమే కారణం

Cane Trees in Mulugu District : వృక్షాలు మానవాళి మనుగడకు మూలం. వాటిని కాపాడుకోకపోతే మన ఉనికిని మనమే నాశనం చేసుకున్న వారిమవుతాం. కానీ, ప్రస్తుతం చెట్లు తగ్గిపోతున్నాయి. ఈరోజు కనిపించని అడవులు పాతికేళ్ల తర్వాత ఉంటాయా అంటే చెప్పలేని పరిస్థితి. అడవులు అంతరించిపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పటికే కీలకమైన వృక్ష సంపద కనుమరుగవుతోంది. అందులోనూ అరుదైన చెట్లపై స్మగ్లర్ల కన్ను పడి వాటి ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట శివారులో రామప్ప ఆలయం తూర్పు ద్వార సమీపంలో ఏపుగా పెరిగే అరుదైన వెదురు జాతికి చెందిన కేన్‌‍‍ మొక్కలు పూర్తిగా కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి.

కేరళ, అసోం తర్వాత తెలంగాణలోని పాలంపేట శివారు, పాకాల సరస్సు వద్ద మాత్రమే పెరిగే అరుదైన జీవవైవిధ్య కేన్‌ మొక్కలు మానవాళికే గాక పక్షులకు ఎంతో మేలు చేస్తాయి. ఇది అరకేసీ కుటుంబానికి చెందినది. ఈ మొక్కల కాండం ముళ్లతో ఉంటుంది. దీని నుంచి వచ్చే కలపను వివిధ గృహోపకరణాలకు వినియోగిస్తారు. ముఖ్యంగా సోఫాలు, కుర్చీలు, వాకింగ్ స్టిక్స్, ఫోటో ఫ్రేమ్‌లు ఇలా రకరకాల వస్తువులు తయారు చేయడానికి వాడతారు.

ప్రకృతితో స్నేహం రాజమ్మతాండ ఆరోగ్య రహస్యం - చావుకే సవాల్ విసురుతున్న గ్రామం - Healthy Village Rajamma Tanda

కేన్‌ మొక్కలు పర్యావరణహితం కావడంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. మొక్కలు పెరిగే ప్రాంతం రామప్ప చెరువు కట్ట కింది భాగం కావడంతో ఏడాది పొడవునా ఇక్కడి నేలలో తేమ ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండే కేన్‌మొక్కలు విస్తరించి ఉన్న ప్రాంతంలోకి మనుషులే కాదు ఇతర జంతువులు వెళ్లడం కష్టం. అందువల్లే ఇక్కడ అరుదైన తెల్లమద్ది వృక్షాలు ఉన్నాయి.

కేన్‌చెట్ల మధ్య ఉన్న ఇతర వృక్షాలపై వేలసంఖ్యలో గబ్బిలాలు నివసిస్తూ ఉంటాయి. వాటితోపాటు మొత్తం 120 జాతుల పక్షులు ఇక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు గుర్తుగా అరుదైన జీవవైవిధ్య ప్రాంతంగా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ, అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా కేన్‌వృక్షాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా జీవవైవిధ్యం సైతం ప్రమాదంలో పడుతోంది.

Endangered Cane Trees in Mulugu : సాప తీగ బరిగగా పిలుచుకునే కేన్‌ మొక్కలు జీవవైవిధ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఇవి పెరిగే పాలంపేట శివారు ప్రాంతాన్ని 1974లో అటవీశాఖ జీవవైవిద్య, పరిరక్షణ ప్రాంతంగా గుర్తించింది. ఈ మొక్కలపై పరిశోధనలు చేయడానికి అనేక ప్రాంతాల నుంచి వృక్ష శాస్త్ర నిపుణులు, విద్యార్థులు పాలంపేటకు వచ్చేవారు. అలా ఒకసారి పరిశోధనలకు వచ్చిన ఓ శాస్త్రవేత్తల బృందం కేరళ తర్వాత పాలంపేటలో మాత్రమే ఈ మొక్కలు ఉన్నాయని గుర్తించారు. దాదాపు 60ఎకరాల్లో ఉన్న ఈ మొక్కలు ఔషధ గుణాలు కలిగినవని తేల్చారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉండే కొన్ని కుటుంబాలు ఈ వెదురుతోనే చేతికర్రలు, ఊయల వంటి తయారు చేసి ఉపాధి పొందేవారు. కొన్నేళ్లుగా వారు వలస వెళ్లడంతో వీటిని పట్టించుకునే వారు కరవయ్యారు.

Bhoothpur Village Story : భూత్పూర్​ వాసుల క'న్నీటి' గోస.. ఎవరికీ పట్టడం లేదా..?

కేన్‌ మొక్కలను సంరక్షించాలన్న పాలంపేట స్థానికుల డిమాండ్‌తో 2014లో అటవీ, రెవెన్యూ శాఖలు సర్వే చేపట్టాయి. ఆ ప్రాంతం చుట్టూ కందకం తవ్వించారు. అయితే, వీటి సంరక్షణ‌పై కొద్దిరోజులు మాత్రమే దృష్టి సారించారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో మళ్లీ ఆ స్థలాలు పంటల సాగుకోసం ఆక్రమణలకు గురయ్యాయి. అలా తొలుత 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేన్‌ మొక్కలు ప్రస్తుతం ఐదారు ఎకరాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఉన్న కొద్ది పాటి మొక్కలను కూడా కొంత మంది కలప స్మగ్లర్లు కొద్దికొద్దిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల వీటికి కావాలని నిప్పు పెట్టడంతో పెద్ద సంఖ్యలో మొక్కలు కాలి బూడిదయ్యాయి.

3అంగుళాల పొడవైన అరుదైన ద్రాక్ష-దేశవిదేశాల్లో ఫుల్​ డిమాండ్​- రైతుకు రూ.లక్షల్లో ఆదాయం

Officers Negligence on Cane Trees Conservations : అధికారుల ఉదాసీనత అరుదైన కేన్ మొక్కల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తోంది. దీని వల్ల జీవవైవిధ్యం నాశనమవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేన్ మొక్కలను సంరక్షించాలని ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం కావాడాలని ప్రదర్శనలు చేసినా ఫలితం కనిపించట్లేదని వాపోతున్నారు. ఆక్రమణలకు అడ్డుకట్టవేసి కేన్ మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏళ్లుగా అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా అది కార్యరూపంలోకి రావడంలేదని అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి కేన్ మొక్కలను సంరక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం, దాంతో స్థానికంగా భూముల ధరలు పెరగడం వల్ల కూడా కేన్‌ మొక్కలను నాశనం చేయడానికి మరో కారణంగా కన్పిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేసి మొక్కలను సంరక్షించాలని అలాగే అరుదైన కేన్‌ మెుక్కలను మరిన్ని ఎకరాల్లో పెంచే చర్యలు చేపటాలని కోరుతున్నారు. కేవలం బోర్డులు పెట్టి మమ అనిపించకుండా, అధికారులు చిత్తశుద్ధితో ఈ అరుదైన జాతి మొక్కలను సంరక్షించి చర్యలు చేపట్టాలని అంటున్నారు. ఇక్కడే ఓ పార్క్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశలు ఉంటాయని అంటున్నారు. తద్వారా రామప్ప ఆలయ సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఘనమైన వారసత్వ సంపదగా నిలిచే రామప్ప పక్కనే ఉన్న ఈ అరుదైన వృక్ష, జీవ సంపదను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పూనుకోవాల్సింది అధికార యంత్రాంగమే.

Padakandla Srinivas: వ్యర్థాలకో అర్థం.. మోదీ మెచ్చిన వైనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.