ETV Bharat / state

వారణాసి వెళ్లి తిరిగి రాలేదు - అసలు ట్విస్ట్​ తెలిసి షాక్​

చీటీల పేరుతో 3 వందల మందికి కుచ్చుటోపి - గత నెల 29న వారణాసి వెళ్లిన వ్యాపారి

Huge Chits Scam In Gooty
Huge Chits Scam In Gooty (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Huge Chits Scam In Gooty : 20 ఏళ్లుగా అదే ఊరిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వ్యాపారం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అదే సమయంలో చీటీల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు అనుకున్న సమయానికే డబ్బులు ఇచ్చాడు. అంతేకాదు కొంతమందికి ఇంటికి మరీ తెచ్చి డబ్బులిచ్చేవాడు. కానీ ఏమైందో తెలియదు కొంతమందికి డబ్బులు అడిగిన వారికి ప్రాంసరీ నోట్లు ఇచ్చాడు. సరేలే ఇస్తాడులే అని కొన్ని రోజులు చూశారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు.

చీటీల పేరుతో రెండు కోట్లకుపైగా టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. తాము మోసపోయినట్లు ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ అనంతపురం జిల్లా గుత్తి పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని గుత్తి పట్టణంలోని బండగెరికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా గుత్తి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలోనే హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ చీటీలు కట్టించుకునేవాడు. ఇన్నాళ్లు నమ్మకంగా ఉండడంతో చాలా మంది దగ్గర చీటీల పేరుతో డబ్బులు వసూలు చేసి లక్షల్లో టర్నోవర్ చేసేవాడు.

గత పది రోజుల నుంచి బాలకృష్ణ కనిపించకపోవడంతో బాధితులు అయోమయంలో పడ్డారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత పదేళ్లు బాలకృష్ణ వద్ద చీటీలను వేస్తున్నామని పోలీసులకు తెలిపారు. చీటీ డబ్బులు అడిగిన వారికి ప్రాంసరీ నోట్లను రాసిచ్చాడని, అదే గత నెల 29న వారణాసి వెళ్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులతో బయలుదేరిన వ్యక్తి తిరిగి ఇప్పటి వరకు రాలేక రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు.

Person Cheats People of Worth of Rs 7 Crores in Anantapur: అనంతలో చిట్టీల పేరుతో మోసం.. రూ.7 కోట్లకు కుచ్చుటోపి

"గత పది సంవత్సరాలుగా చీటి కడుతున్నాం. చీటి డబ్బులు మా ఇళ్లుకు వచ్చి ఇచ్చేవాడు. ఒక్కొక్కరికి లక్ష నుంచి మూడు లక్షల వరకూ ఇవ్వాల్సి ఉంది. 3 వందల మందికి డబ్బులు ఇవ్వాలి. పోలీసులు విచారణ చేసి మాకు న్యాయం చేయాలి" : - బాధితులు

ఇప్పటి వరకూ రెండు కోట్ల రూపాయలకు పైగా చీటీల పేరుతో ఉడాయించినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Chit Victims Protest In Vijayawada: చీటీల పేరుతో రూ. 5 కోట్లకు టోకరా.. ఆందోళనకు దిగిన మధురానగర్ వాసులు!

Huge Chits Scam In Gooty : 20 ఏళ్లుగా అదే ఊరిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వ్యాపారం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అదే సమయంలో చీటీల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు అనుకున్న సమయానికే డబ్బులు ఇచ్చాడు. అంతేకాదు కొంతమందికి ఇంటికి మరీ తెచ్చి డబ్బులిచ్చేవాడు. కానీ ఏమైందో తెలియదు కొంతమందికి డబ్బులు అడిగిన వారికి ప్రాంసరీ నోట్లు ఇచ్చాడు. సరేలే ఇస్తాడులే అని కొన్ని రోజులు చూశారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు.

చీటీల పేరుతో రెండు కోట్లకుపైగా టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. తాము మోసపోయినట్లు ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ అనంతపురం జిల్లా గుత్తి పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని గుత్తి పట్టణంలోని బండగెరికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా గుత్తి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలోనే హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ చీటీలు కట్టించుకునేవాడు. ఇన్నాళ్లు నమ్మకంగా ఉండడంతో చాలా మంది దగ్గర చీటీల పేరుతో డబ్బులు వసూలు చేసి లక్షల్లో టర్నోవర్ చేసేవాడు.

గత పది రోజుల నుంచి బాలకృష్ణ కనిపించకపోవడంతో బాధితులు అయోమయంలో పడ్డారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత పదేళ్లు బాలకృష్ణ వద్ద చీటీలను వేస్తున్నామని పోలీసులకు తెలిపారు. చీటీ డబ్బులు అడిగిన వారికి ప్రాంసరీ నోట్లను రాసిచ్చాడని, అదే గత నెల 29న వారణాసి వెళ్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులతో బయలుదేరిన వ్యక్తి తిరిగి ఇప్పటి వరకు రాలేక రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు.

Person Cheats People of Worth of Rs 7 Crores in Anantapur: అనంతలో చిట్టీల పేరుతో మోసం.. రూ.7 కోట్లకు కుచ్చుటోపి

"గత పది సంవత్సరాలుగా చీటి కడుతున్నాం. చీటి డబ్బులు మా ఇళ్లుకు వచ్చి ఇచ్చేవాడు. ఒక్కొక్కరికి లక్ష నుంచి మూడు లక్షల వరకూ ఇవ్వాల్సి ఉంది. 3 వందల మందికి డబ్బులు ఇవ్వాలి. పోలీసులు విచారణ చేసి మాకు న్యాయం చేయాలి" : - బాధితులు

ఇప్పటి వరకూ రెండు కోట్ల రూపాయలకు పైగా చీటీల పేరుతో ఉడాయించినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Chit Victims Protest In Vijayawada: చీటీల పేరుతో రూ. 5 కోట్లకు టోకరా.. ఆందోళనకు దిగిన మధురానగర్ వాసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.