ETV Bharat / state

అబ్బురపరుస్తున్న రాష్ట్రపతి భవన్‌ - ఇకపై సంవత్సరం పొడవునా సందర్శనకు అనుమతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 11:43 AM IST

Bollaram Rashtrapati Bhavan Hyderabad : రాష్ట్రపతి విడిది చేసే భవనాన్ని చూడాలని అందరికీ ఉంటుంది. దేశవారసత్వ సంపదకి చిహ్నంలా నిలిచే అపురూపమైన కట్టడాలు, కంటికి ఇంపుగొలిపే అందమైన పచ్చిక బయళ్లు, రాతి శిలలపై చెక్కిన చిత్రాలు, మహానీయుల జీవిత విశేషాలు చెప్పే ఆర్ట్ గ్యాలరీ ఇలా ఎన్నెన్నో విశేషాలకు వేదికైంది బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం. ఒకప్పుడు ఏడాదిలో కొద్ది రోజులే సందర్శకులకు అనుమతి ఉంటే నేడు ఎప్పుడైనా చూసి అవకాశం కల్పించారు.

President Residence In Bollaram
Rashtrapati Nilayam In Hyderabad
అబ్బురపరుస్తున్న రాష్ట్రపతి భవన్‌ - ఇకపై సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు

Bollaram Rashtrapati Bhavan Hyderabad : దేశ పాలన ఉత్తర భారతానికే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో దక్షిణాన హైదరాబాద్‌లోని బొల్లారంలో 1860లో బ్రిటీష్‌ అధికారులు రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో వైశ్రాయ్‌ అతిథి గృహంగా పిలిచేవారు. 1950లో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొంది. అప్పటినుంచి రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు. 160 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ భవన్‌ను కేంద్రం నిజాం నుంచి 60 లక్షలకు కొనుగోలు చేసింది.

President Residence In Bollaram : వారసత్వ సంపదను కళ్ళకు కట్టే విశాలమైన భవంతులు నాటి చారిత్రక ఆనవాళ్ల రాష్ట్రపతి భవన్‌లో దర్శనమిస్తాయి. ఎక్కడ చూసినా అందమైన పచ్చిక బయలు కళ్లకు కనువిందు చేస్తాయి. నిజాంపై భారత సైన్యం విజయం సాధించాక ఆభవనంలో నిజాం జెండాను దించి మువ్వన్నెల పతాకాన్ని ఎగరవేసినందుకు గుర్తుగా 125 అడుగుల ఎత్తుతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. పూర్వకాలంలో భద్రతా కారణాలవల్ల ఆ భవనానికి అవసరమైన సామాగ్రి, ఆహార పదార్థాలు వంటివి బయట నుంచి నేరుగా తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక సొరంగ మార్గం అందరినీ ఆకట్టుకుంటుంది.

" రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు అవకాశం కల్పించాం. సోమవారం సెలవు దినం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. 12 వ తరగతి లోపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు 8 ఏళ్ల లోపు వయసున్న మిగతా చిన్నారులకు ప్రవేశం ఉచితం." -మేనేజర్, లక్ష్మి ప్రియ, రాష్ట్రపతి నిలయం

ఇకపై సంవత్సరం పొడవునా రాష్ట్రపతి భవనం సందర్శించొచ్చు..

Bollaram Rashtrapati Nilayam Timings : ఈ నిలయంలో టాకింగ్ ట్రీకి ప్రత్యేకత ఉంది. 160 ఏళ్ల వయసున్న మర్రిచెట్టు ముందు నిలబడి మాట్లాడితే అది మనతో మాట్లాడుతున్నట్టుగానే శబ్దాలు వస్తాయి. అప్పట్లో ఆ నిలయం అవసరాలను తీర్చేందుకు తవ్విన పురాతన మెట్ల బావి ఇప్పటికీ సజీవంగానే ఉంది. చారిత్రక విశేషాలను, మహనీయుల జీవిత ఘట్టాలను తెలియజేసేలా ఆర్ట్ గ్యాలరీను ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యక్తులను, స్థలాలను జ్ఞప్తికి తెచ్చేలా రాతిపై బొమ్మలనూ చిత్రించారు.

President Residence In Hyderabad : ఏటా రాష్ట్రపతి దిల్లీలోనే కాకుండా హైదరాబాద్‌లోని ఆ నిలయంలో కొద్ది రోజుల పాటు బస చేయటం ఆనవాయితీ. ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్న ఆ రాష్ట్రపతి నిలయాన్ని సాధారణ పౌరులకీ చూసే అవకాశం కల్పించారు అధికారులు. గతంలో ఏడాదిలో 15 రోజులే సందర్శకులను అనుమతించేవారు ప్రస్తుతం ఏడాది పొడవునా చూడటానికి రావచ్చు. సోమవారం సెలవు దినం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. 12 వ తరగతి లోపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు 8 ఏళ్ల లోపు వయసున్న మిగతా చిన్నారులకు ప్రవేశం ఉచితమని అధికారులు తెలియజేశారు.

Rashtrapati Nilayam in Hyderabad : రాష్ట్రపతి నిలయానికి తరలివస్తున్న సందర్శకులు

ఈనెల 11 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శన నిలిపివేత

అబ్బురపరుస్తున్న రాష్ట్రపతి భవన్‌ - ఇకపై సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు

Bollaram Rashtrapati Bhavan Hyderabad : దేశ పాలన ఉత్తర భారతానికే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో దక్షిణాన హైదరాబాద్‌లోని బొల్లారంలో 1860లో బ్రిటీష్‌ అధికారులు రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో వైశ్రాయ్‌ అతిథి గృహంగా పిలిచేవారు. 1950లో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొంది. అప్పటినుంచి రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు. 160 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ భవన్‌ను కేంద్రం నిజాం నుంచి 60 లక్షలకు కొనుగోలు చేసింది.

President Residence In Bollaram : వారసత్వ సంపదను కళ్ళకు కట్టే విశాలమైన భవంతులు నాటి చారిత్రక ఆనవాళ్ల రాష్ట్రపతి భవన్‌లో దర్శనమిస్తాయి. ఎక్కడ చూసినా అందమైన పచ్చిక బయలు కళ్లకు కనువిందు చేస్తాయి. నిజాంపై భారత సైన్యం విజయం సాధించాక ఆభవనంలో నిజాం జెండాను దించి మువ్వన్నెల పతాకాన్ని ఎగరవేసినందుకు గుర్తుగా 125 అడుగుల ఎత్తుతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. పూర్వకాలంలో భద్రతా కారణాలవల్ల ఆ భవనానికి అవసరమైన సామాగ్రి, ఆహార పదార్థాలు వంటివి బయట నుంచి నేరుగా తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక సొరంగ మార్గం అందరినీ ఆకట్టుకుంటుంది.

" రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు అవకాశం కల్పించాం. సోమవారం సెలవు దినం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. 12 వ తరగతి లోపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు 8 ఏళ్ల లోపు వయసున్న మిగతా చిన్నారులకు ప్రవేశం ఉచితం." -మేనేజర్, లక్ష్మి ప్రియ, రాష్ట్రపతి నిలయం

ఇకపై సంవత్సరం పొడవునా రాష్ట్రపతి భవనం సందర్శించొచ్చు..

Bollaram Rashtrapati Nilayam Timings : ఈ నిలయంలో టాకింగ్ ట్రీకి ప్రత్యేకత ఉంది. 160 ఏళ్ల వయసున్న మర్రిచెట్టు ముందు నిలబడి మాట్లాడితే అది మనతో మాట్లాడుతున్నట్టుగానే శబ్దాలు వస్తాయి. అప్పట్లో ఆ నిలయం అవసరాలను తీర్చేందుకు తవ్విన పురాతన మెట్ల బావి ఇప్పటికీ సజీవంగానే ఉంది. చారిత్రక విశేషాలను, మహనీయుల జీవిత ఘట్టాలను తెలియజేసేలా ఆర్ట్ గ్యాలరీను ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యక్తులను, స్థలాలను జ్ఞప్తికి తెచ్చేలా రాతిపై బొమ్మలనూ చిత్రించారు.

President Residence In Hyderabad : ఏటా రాష్ట్రపతి దిల్లీలోనే కాకుండా హైదరాబాద్‌లోని ఆ నిలయంలో కొద్ది రోజుల పాటు బస చేయటం ఆనవాయితీ. ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్న ఆ రాష్ట్రపతి నిలయాన్ని సాధారణ పౌరులకీ చూసే అవకాశం కల్పించారు అధికారులు. గతంలో ఏడాదిలో 15 రోజులే సందర్శకులను అనుమతించేవారు ప్రస్తుతం ఏడాది పొడవునా చూడటానికి రావచ్చు. సోమవారం సెలవు దినం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. 12 వ తరగతి లోపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు 8 ఏళ్ల లోపు వయసున్న మిగతా చిన్నారులకు ప్రవేశం ఉచితమని అధికారులు తెలియజేశారు.

Rashtrapati Nilayam in Hyderabad : రాష్ట్రపతి నిలయానికి తరలివస్తున్న సందర్శకులు

ఈనెల 11 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శన నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.