ETV Bharat / state

హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తాం: ఈటల రాజేందర్ - BJP MP Etela Rajender Comments

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 6:03 PM IST

BJP MP Etela Rajender Comments On Congress : ఇచ్చిన హామీలు అమలుచేసేలా కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తామని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. యావత్‌ తెలంగాణ ప్రజలు మూడోసారి మోదీ ప్రధాని కావాలని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన 8 మంది బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

BJP MP Etela Rajender Comments
BJP MP Etela Rajender Comments On Congress (ETV Bharat)

BJP MP Etela Rajender Comments On CM Revanth : ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెకిలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. చంద్రబాబు, నితీష్ కుమార్​ను కలుస్తామని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా మోదీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి ఓటేశారని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నెహ్రూ తరువాత మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.

BJP 8 Seats wins Telangana Elections 2024 : ఖమ్మం, మహబూబ్ బాద్ తప్పితే అన్ని స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందన్నారు. ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చి స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారన్న ఈటల భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటి చెప్పారని తెలిపారు. మల్కాజిగిరి తన సీటు, మహబూబ్‌నగర్ తన సొంత నియోజకవర్గమని వీర్రవీగిన రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి బుద్ది చెప్పారని పేర్కొన్నారు.

బీజేపీ హయంలో పేదవాడికి సొంత ఇళ్లు : రాష్ట్రంలో విజయం సాధించిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అపార అనుభవం కల్గిన వ్యక్తులగా పేర్కొన్న ఈటల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే వెంటపడి పని చేయిస్తామన్నారు. తెలంగాణలో పేదవాడికి సొంత ఇళ్లు కట్టించడం మా బాధ్యత అన్నారు.

"హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తాం. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉండాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయమని జనం చాటిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో పేదవాడికి సొంత ఇళ్లు కట్టించడం మా బాధ్యత." -ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీ

హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తాం : ఈటల రాజేందర్ (ETV Bharat)

అక్కడ గెలిస్తే ఫేటే మారిపోతుంది - మరి ఈటల భవిష్యత్ కూడా బంగారమేనా? - Etela Rajender Won Malkajgiri MP SEAT

అసెంబ్లీ పోరులో ఓడించినా - లోక్​సభ వార్​లో గెలిపించారు - తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు - BJP wins telangana elections 2024

BJP MP Etela Rajender Comments On CM Revanth : ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెకిలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. చంద్రబాబు, నితీష్ కుమార్​ను కలుస్తామని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా మోదీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి ఓటేశారని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నెహ్రూ తరువాత మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.

BJP 8 Seats wins Telangana Elections 2024 : ఖమ్మం, మహబూబ్ బాద్ తప్పితే అన్ని స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందన్నారు. ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చి స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారన్న ఈటల భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటి చెప్పారని తెలిపారు. మల్కాజిగిరి తన సీటు, మహబూబ్‌నగర్ తన సొంత నియోజకవర్గమని వీర్రవీగిన రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి బుద్ది చెప్పారని పేర్కొన్నారు.

బీజేపీ హయంలో పేదవాడికి సొంత ఇళ్లు : రాష్ట్రంలో విజయం సాధించిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అపార అనుభవం కల్గిన వ్యక్తులగా పేర్కొన్న ఈటల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే వెంటపడి పని చేయిస్తామన్నారు. తెలంగాణలో పేదవాడికి సొంత ఇళ్లు కట్టించడం మా బాధ్యత అన్నారు.

"హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తాం. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉండాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయమని జనం చాటిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో పేదవాడికి సొంత ఇళ్లు కట్టించడం మా బాధ్యత." -ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీ

హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తాం : ఈటల రాజేందర్ (ETV Bharat)

అక్కడ గెలిస్తే ఫేటే మారిపోతుంది - మరి ఈటల భవిష్యత్ కూడా బంగారమేనా? - Etela Rajender Won Malkajgiri MP SEAT

అసెంబ్లీ పోరులో ఓడించినా - లోక్​సభ వార్​లో గెలిపించారు - తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు - BJP wins telangana elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.