ETV Bharat / state

విదేశీ మద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - బాటిల్​కు రూ.10 అదనం

ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ - భారత్​లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్​ ఎమ్మార్పీ ధరపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ప్రివిలేజ్​ ఫీజు కింద బాటిల్​కు చిల్లర కాకుండా రూ.10.

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Andhrapradesh Liquor Prices
Andhrapradesh Liquor Prices (ETV Bharat)

Andhrapradesh Liquor Prices 2024 : ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్​లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ తరుణంలో భారత్​లో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్​ఎల్​) బాటిల్​ ఎమ్మార్పీ ధరపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ మద్యం బాటిల్​ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్​ ఫీజును విధిస్తూ సవరణ చేసింది. దీన్ని ఆ రాష్ట్ర గవర్నర్​ ఆమోదించారు. ఆయన ఆమోదం మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ను ఎక్సైజ్​ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్​ కుమార్​ మీనా విడుదల చేశారు. అదననపు ప్రివిలేజ్​ ఫీజు కింద ఎమ్మార్పీ ధరల్లో చిల్లర కాకుండా రూ.10 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది.

ఎలా లెక్కిస్తారు : ఈ లెక్కన చూసుకుంటే బాటిల్​ ఎమ్మార్పీ ధర 150.50 ఉంటే దాన్ని రూ.160కి పెంచుతారు. పెంచిన ఈ రూ.10 ప్రివిలేజ్​ ఫీజు. క్వార్టర్​ బాటిల్​ ధర రూ.90.50గా ఉంటే ఏపీఎఫ్​ కలిపి దాని ధర రూ.100 అవుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్​ బాటిల్​ ధర రూ.99కే నిర్ధారించారు. అందుకే రూ.100 ధరలో రూ.1ని మినహాయించి విక్రయిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మద్యం దుకాణాలకు దరఖాస్తులు 90 వేల పైనే : ఆంధ్రప్రదేశ్​లో నూతన మద్యం పాలసీ విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు అత్యధికంగా వచ్చాయి. నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఈ నెల 11తో ముగిశాయి. 90 వేల పైనే మద్యం దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1800 కోట్లు సమకూరినట్లు సమాచారం. దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 14న అయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ వేయనున్నారు. ఈ నెల 16 నుంచి నూతన మద్యం విధానం తీసుకొచ్చి ప్రైవేటు షాపులు నడపనున్నారు.

Andhrapradesh Liquor Prices 2024 : ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్​లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ తరుణంలో భారత్​లో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్​ఎల్​) బాటిల్​ ఎమ్మార్పీ ధరపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ మద్యం బాటిల్​ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్​ ఫీజును విధిస్తూ సవరణ చేసింది. దీన్ని ఆ రాష్ట్ర గవర్నర్​ ఆమోదించారు. ఆయన ఆమోదం మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ను ఎక్సైజ్​ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్​ కుమార్​ మీనా విడుదల చేశారు. అదననపు ప్రివిలేజ్​ ఫీజు కింద ఎమ్మార్పీ ధరల్లో చిల్లర కాకుండా రూ.10 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది.

ఎలా లెక్కిస్తారు : ఈ లెక్కన చూసుకుంటే బాటిల్​ ఎమ్మార్పీ ధర 150.50 ఉంటే దాన్ని రూ.160కి పెంచుతారు. పెంచిన ఈ రూ.10 ప్రివిలేజ్​ ఫీజు. క్వార్టర్​ బాటిల్​ ధర రూ.90.50గా ఉంటే ఏపీఎఫ్​ కలిపి దాని ధర రూ.100 అవుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్​ బాటిల్​ ధర రూ.99కే నిర్ధారించారు. అందుకే రూ.100 ధరలో రూ.1ని మినహాయించి విక్రయిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మద్యం దుకాణాలకు దరఖాస్తులు 90 వేల పైనే : ఆంధ్రప్రదేశ్​లో నూతన మద్యం పాలసీ విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు అత్యధికంగా వచ్చాయి. నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఈ నెల 11తో ముగిశాయి. 90 వేల పైనే మద్యం దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1800 కోట్లు సమకూరినట్లు సమాచారం. దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 14న అయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ వేయనున్నారు. ఈ నెల 16 నుంచి నూతన మద్యం విధానం తీసుకొచ్చి ప్రైవేటు షాపులు నడపనున్నారు.

వామ్మో! ఏందిరా సామీ - 11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం తాగేశారా!

ఏపీలో 3,396 మద్యం దుకాణాలకు 90 వేలకు పైనే దరఖాస్తులు - ఆదాయం ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.