ETV Bharat / state

చేప మందు ప్రసాదం పంపిణీ - అన్నదానం చేస్తున్న స్వచ్చంద సంస్థలు - Fish medicine Distribution

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 3:17 PM IST

Fish medicine in Hyderabad : హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో శనివారం చేప మందు పంపిణీ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేసేందుకు సిద్ధమయ్యాయి. చేప మందు కోసం ఇతర రాష్ట్రాల్లో నుంచి అధిక జనాభా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ్టి నుంచే టోకెన్​లను విక్రయిస్తునందున చాలా మంది నాంపల్లికి చేరుకున్నారు.

Annadanam at Fish medicine Distribution
Fish medicine in Hyderabad (ETV Bharat)

Fish medicine in Hyderabad : చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నాయి. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసింది. రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి భోజనం అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. చేప మందు పంపిణీకు టోకెన్​లను ఇవాళ నుంచే విక్రయిస్తుండటంతో ఒక రోజు ముందే చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు.

Fish medicine Distribution Arrangements : మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేప మందు పంపిణీకి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. శనివారం ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. టోకెన్ల కోసం ఇప్పటికే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత ఏడాది కంటే ఈ సారి చేప మందు తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉన్నందున మత్స్యశాఖ నుంచి లక్షా 60 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు సాయికుమార్ తెలిపారు.

చేపప్రసాదం పంపిణీకి వెళ్తున్నారా? - మీ కోసమే తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు - SPECIAL BUSES FOR FISH PRASADAM DISTRIBUTION 2024

Special Buses for Fish Medicine : చేప మందు కోసం వచ్చే వారి కోసం 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్​ఆర్టీసీ తెలిపింది. ప్రధాన రైల్వే స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది.

"దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. పలు స్వచ్చంధ సంస్థలు భోజన ఏర్పాట్లు చేశాయి. రేపటి చేప మందు పంపిణీకు టోకెన్​లను ఈరోజు నుంచే విక్రయిస్తున్నాం. చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు చేరుకుంటున్నారు." - మెట్టు సాయికుమార్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్

చేప మందు ప్రసాదం అన్నదానం చేస్తున్న స్వచ్చంద సంస్థలు (ETV Bharat)

రేపే బత్తిని బ్రదర్స్​ 'చేప ప్రసాదం' పంపిణీ - నాంపల్లి గ్రౌండ్​లో 1200 మందితో పోలీసుల బందోబస్తు - CHEPA MANDU DISTRIBUTION IN HYDERABAD 2024

Fish medicine in Hyderabad : చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నాయి. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసింది. రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి భోజనం అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. చేప మందు పంపిణీకు టోకెన్​లను ఇవాళ నుంచే విక్రయిస్తుండటంతో ఒక రోజు ముందే చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు.

Fish medicine Distribution Arrangements : మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేప మందు పంపిణీకి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. శనివారం ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. టోకెన్ల కోసం ఇప్పటికే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత ఏడాది కంటే ఈ సారి చేప మందు తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉన్నందున మత్స్యశాఖ నుంచి లక్షా 60 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు సాయికుమార్ తెలిపారు.

చేపప్రసాదం పంపిణీకి వెళ్తున్నారా? - మీ కోసమే తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు - SPECIAL BUSES FOR FISH PRASADAM DISTRIBUTION 2024

Special Buses for Fish Medicine : చేప మందు కోసం వచ్చే వారి కోసం 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్​ఆర్టీసీ తెలిపింది. ప్రధాన రైల్వే స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది.

"దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. పలు స్వచ్చంధ సంస్థలు భోజన ఏర్పాట్లు చేశాయి. రేపటి చేప మందు పంపిణీకు టోకెన్​లను ఈరోజు నుంచే విక్రయిస్తున్నాం. చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు చేరుకుంటున్నారు." - మెట్టు సాయికుమార్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్

చేప మందు ప్రసాదం అన్నదానం చేస్తున్న స్వచ్చంద సంస్థలు (ETV Bharat)

రేపే బత్తిని బ్రదర్స్​ 'చేప ప్రసాదం' పంపిణీ - నాంపల్లి గ్రౌండ్​లో 1200 మందితో పోలీసుల బందోబస్తు - CHEPA MANDU DISTRIBUTION IN HYDERABAD 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.