ETV Bharat / state

నాంపల్లి కోర్టులో బెయిల్‌ పూచీకత్తు పత్రాలు సమర్పించిన అల్లు అర్జున్ - ALLU ARJUN ATTENDS NAMPALLY COURT

నాంపల్లి కోర్టుకు హాజరైన సినీ హీరో అల్లు అర్జున్ - కోర్టులో జడ్జి ముందు బెయిల్‌ పూచీకత్తు పత్రాలు సమర్పించిన పుష్ప హీరో -

Actor Allu Arjun Attend Nampally Court
Actor Allu Arjun Attend Nampally Court (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 3:38 PM IST

Updated : Jan 4, 2025, 4:16 PM IST

Actor Allu Arjun Attend Nampally Court : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ, బెయిల్ పూచీకత్తుకు సంబంధించిన పత్రాలను అందించారు. పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు నిన్న అల్లు అర్జున్​కు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇవాళ(శనివారం) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పూచీకత్తులను సమర్పించి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ : బెయిల్ కోసం రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని అల్లు అర్జున్​కు సూచించింది.

డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్​ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేయడంతో మరుసటి రోజు విడుదలయ్యారు. రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్​పై శనివారం కోర్టు తీర్పు ఇస్తూ షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది. రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని సూచించింది.

ఇదీ జరిగింది : పుష్ప-2 సినిమా బెనిఫిట్​ షో సందర్భంగా కొద్ది రోజుల క్రితం హీరో అల్లు అర్జున్​ సంధ్య థియేటర్​కు వెళ్లారు. ఈ క్రమంలోనే అర్జున్​ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే దిల్​సుఖ్​నగర్​ ప్రాంతానికి చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా కిందపడిపోయారు. జనాల కాళ్లమధ్య నలిగిపోయారు. దుర్ఘటనలో రేవతి మృతిచెందారు. కాగా ఆమె కుమారుడు కిమ్స్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. మృతురాలు రేవతి కుటుంబ సభ్యులకు ఇప్పటికే పుష్ప హీరో అల్లు అర్జున్​ కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మరోవైపు పుష్ప-2 చిత్ర నిర్మాతలు కూడా సాయమందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా శ్రేతేజ్​ కుటుంబానికి సహాయం చేశారు.

అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చిన నాంపల్లి కోర్టు

గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు : అల్లుఅర్జున్ వివాదంపై పవన్

Actor Allu Arjun Attend Nampally Court : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ, బెయిల్ పూచీకత్తుకు సంబంధించిన పత్రాలను అందించారు. పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు నిన్న అల్లు అర్జున్​కు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇవాళ(శనివారం) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పూచీకత్తులను సమర్పించి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ : బెయిల్ కోసం రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని అల్లు అర్జున్​కు సూచించింది.

డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్​ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేయడంతో మరుసటి రోజు విడుదలయ్యారు. రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్​పై శనివారం కోర్టు తీర్పు ఇస్తూ షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది. రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని సూచించింది.

ఇదీ జరిగింది : పుష్ప-2 సినిమా బెనిఫిట్​ షో సందర్భంగా కొద్ది రోజుల క్రితం హీరో అల్లు అర్జున్​ సంధ్య థియేటర్​కు వెళ్లారు. ఈ క్రమంలోనే అర్జున్​ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే దిల్​సుఖ్​నగర్​ ప్రాంతానికి చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా కిందపడిపోయారు. జనాల కాళ్లమధ్య నలిగిపోయారు. దుర్ఘటనలో రేవతి మృతిచెందారు. కాగా ఆమె కుమారుడు కిమ్స్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. మృతురాలు రేవతి కుటుంబ సభ్యులకు ఇప్పటికే పుష్ప హీరో అల్లు అర్జున్​ కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మరోవైపు పుష్ప-2 చిత్ర నిర్మాతలు కూడా సాయమందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా శ్రేతేజ్​ కుటుంబానికి సహాయం చేశారు.

అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చిన నాంపల్లి కోర్టు

గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు : అల్లుఅర్జున్ వివాదంపై పవన్

Last Updated : Jan 4, 2025, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.