ETV Bharat / state

గ్లాస్​ పరిశ్రమలో గ్యాస్​ కంప్రెషర్​ పేలుడు - అయిదుగురు దుర్మరణం - blast in south glass factory

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 6:23 PM IST

Updated : Jun 28, 2024, 9:57 PM IST

Blast in South Glass Factory : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్‌ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి అయిదుగురు మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేశ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Blast in South Glass FactoryY
Blast in South Glass Factory ShadnagarR (ETV Bharat)

Blast in South Glass Factory in Shadnagar : గ్యాస్​ కంప్రెషర్​ పేలి ఆరుగురు దుర్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో చోటుచేసుకుంది. షాద్​నగర్​లోని సౌత్​ గ్లాస్​ పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో అయిదుగురు మృతిచెందగా, 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంప్రకాశ్ (45), రథికాంత్ (25), అయోధ్య బస్తీ ప్రాంతానికి చెందిన నికేత్ (22), రాంసేత్ (22)గా గుర్తించారు.

కంప్రెషర్​ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో పరిశ్రమలో భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడిన ఒకరికి శంషాబాద్ నిమ్స్​లో, మిగతా 9 మందికి షాద్​నగర్ వైవా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కంప్రెషర్ సేఫ్టీ వాల్ పనిచేయకపోవడం వల్ల పేలుడు జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోయనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.

"సౌత్ గ్లాస్ కంపెనీలో జరిగిన గ్యాస్ కంప్రెషర్ బ్లాస్ట్​లో అయిదుగురు మరణించారు. గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం. కంపెనీకి చెందిన ఇద్దరు యాజమానులను అందుబాటులోకి తీసుకున్నాము. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము". - రాజేశ్, శంషాబాద్ డీసీపీ

స్పందించిన ముఖ్యమంత్రి.. మరోవైపు షాద్​నగర్ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. క్షతగాత్రులను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించాలని కలెక్టర్​కు ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, పరిశ్రమల శాఖలు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థలిలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

కేసీఆర్ సంతాపం.. షాద్​నగర్ ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు, కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, విపత్తు నిర్వహణ ప్రణాళికలు సమీక్షించాలని పేర్కొన్నారు.

సౌత్ గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు ఘటనపై రంగారెడ్డి జిల్లా కార్మిక సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. సంబంధింత కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మెదక్​ జిల్లాలో రహదారులు రక్తసిక్తం - వేర్వేరు ఘటనల్లో ఆరుగురి దుర్మరణం - Medak Road Accident Today

వర్షంలో తడుస్తూ అమ్మాయి రీల్స్- సడెన్​గా భారీ శబ్ధంతో పిడుగు- ఆ తర్వాత ఏమైదంటే? - Lightning struck while making reels

Blast in South Glass Factory in Shadnagar : గ్యాస్​ కంప్రెషర్​ పేలి ఆరుగురు దుర్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో చోటుచేసుకుంది. షాద్​నగర్​లోని సౌత్​ గ్లాస్​ పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో అయిదుగురు మృతిచెందగా, 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంప్రకాశ్ (45), రథికాంత్ (25), అయోధ్య బస్తీ ప్రాంతానికి చెందిన నికేత్ (22), రాంసేత్ (22)గా గుర్తించారు.

కంప్రెషర్​ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో పరిశ్రమలో భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడిన ఒకరికి శంషాబాద్ నిమ్స్​లో, మిగతా 9 మందికి షాద్​నగర్ వైవా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కంప్రెషర్ సేఫ్టీ వాల్ పనిచేయకపోవడం వల్ల పేలుడు జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోయనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.

"సౌత్ గ్లాస్ కంపెనీలో జరిగిన గ్యాస్ కంప్రెషర్ బ్లాస్ట్​లో అయిదుగురు మరణించారు. గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం. కంపెనీకి చెందిన ఇద్దరు యాజమానులను అందుబాటులోకి తీసుకున్నాము. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము". - రాజేశ్, శంషాబాద్ డీసీపీ

స్పందించిన ముఖ్యమంత్రి.. మరోవైపు షాద్​నగర్ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. క్షతగాత్రులను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించాలని కలెక్టర్​కు ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, పరిశ్రమల శాఖలు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థలిలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

కేసీఆర్ సంతాపం.. షాద్​నగర్ ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు, కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, విపత్తు నిర్వహణ ప్రణాళికలు సమీక్షించాలని పేర్కొన్నారు.

సౌత్ గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు ఘటనపై రంగారెడ్డి జిల్లా కార్మిక సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. సంబంధింత కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మెదక్​ జిల్లాలో రహదారులు రక్తసిక్తం - వేర్వేరు ఘటనల్లో ఆరుగురి దుర్మరణం - Medak Road Accident Today

వర్షంలో తడుస్తూ అమ్మాయి రీల్స్- సడెన్​గా భారీ శబ్ధంతో పిడుగు- ఆ తర్వాత ఏమైదంటే? - Lightning struck while making reels

Last Updated : Jun 28, 2024, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.