ETV Bharat / sports

టాప్​లోకి దూసుకొచ్చిన సఫారీలు- అయినా ఫైనల్ చేరేందుకు భారత్​కు దారి ఉంది! - WTC 2025 POINTS TABLE

అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన సౌతాఫ్రికా- రసవత్తరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు!

WTC 2025
WTC 2025 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 10, 2024, 7:03 AM IST

WTC India Scenario 2025 : టీమ్ఇండియాకు వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్ 2025 ఫైనల్ మార్గాలు మరింత సంక్లిష్టంగా మారాయి. తొలుత వరుసగా ఆరు విజయాలతో ఆగ్రస్థానంలో కొనసాగిన భారత్, గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓటములతో ఇప్పుడు మూడో ప్లేస్​కు పడిపోయింది. ప్రస్తుతం భారత్ 57.29తో మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (60.71 శాతం) రెండో పొజిషన్​లో ఉంది. మరోవైపు శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ కొట్టిన సౌతాఫ్రికా (63.33 శాతం) టాప్​ ప్లేస్​లోకి దూసుకొచ్చింది. దీంతో టీమ్ఇండియా ఫైనల్ చేరాలంటే తాజా సమీకరణాలు ఇలా ఉన్నాయి.

4- 1, 3-1 ఏదైనా ఓకే
ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమ్‌ఇండియా నేరుగా ఫైనల్‌ చేరాలంటే ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు టెస్టుల్లోనూ నెగ్గాలి. అందులో ఏ ఒక్క మ్యాచ్​లోనూ ఓడిపోకూడదు. అయితే ఒక మ్యాచ్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో అన్ని గెలవాలి లేదా ఒకటి డ్రా చేసుకుని, మిగతా రెండింట్లో నెగ్గాలి. భారత్‌ 4- 1తో సిరీస్‌ గెలిస్తే 64.05 పాయింట్ల శాతంతో, 3-1తో నెగ్గితే 60.52 పాయింట్ల శాతంతో ఆసీస్‌ను దాటి టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది.

2 -2 అయినా ఆశలు సజీవమే!
ఒకవేళ ఈ బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌ 2- 2తో డ్రా అయినా టీమ్ఇండియాకు అవకాశముంటుంది. కానీ, అలా జరిగితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను శ్రీలంక 2- 0తో క్లీన్​స్వీప్ చేయాలి. లేగా ఆ రెండు మ్యాచ్‌లనూ లంక డ్రాగా ముగించినా ఫర్వాలేదు. అప్పుడు ఆసీస్, భారత్‌ 55.26 పాయింట్ల శాతంతో సమానంగా ఉంటాయి. అయితే ఎక్కువ సిరీస్​ల్లో విజయం సాధించిన కారణంగా టీమ్ఇండియాకు ఫైనల్ రూట్ క్లీయర్ అవుతుంది.

దాదాపు ఫైనల్ చేరినట్లే!
2025 డబ్ల్యూటీసీలో తొలి ఐదు టెస్టుల్లో కేవలం ఒక్క విజయంతో రేసులో వెనకబడ్డ సౌతాఫ్రికా, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఐదో విజయం నమోదు చేసి ఏకంగా అగ్ర స్థానానికి చేరుకుంది. ఫైనల్‌ చేరేందుకు సౌతాఫ్రికాకు ఒక్క గెలుపు సరిపోతుంది. ఈ నెలలో సొంతగడ్డపై పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్​లో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్​లో విజయం సాధించినా సరిపోతుంది. ఒకవేళ పాక్ 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంటే మాత్రం, సఫారీ జట్టు రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. కానీ, ఇప్పుడు ఆ జట్టు ఉన్న ఫామ్‌లో, అది కూడా స్వదేశంలో జరుగుతున్న సిరీస్​లో ఒక్క టెస్టులో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు!

WTC 2025: అగ్ర స్థానం గల్లంతు- మూడో ప్లేస్​కు పడిపోయిన భారత్

రోహిత్, రాహుల్ ఓపెనింగ్ ఎవరు?- క్లారిటీ ఇచ్చేసిన హిట్​మ్యాన్

WTC India Scenario 2025 : టీమ్ఇండియాకు వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్ 2025 ఫైనల్ మార్గాలు మరింత సంక్లిష్టంగా మారాయి. తొలుత వరుసగా ఆరు విజయాలతో ఆగ్రస్థానంలో కొనసాగిన భారత్, గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓటములతో ఇప్పుడు మూడో ప్లేస్​కు పడిపోయింది. ప్రస్తుతం భారత్ 57.29తో మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (60.71 శాతం) రెండో పొజిషన్​లో ఉంది. మరోవైపు శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ కొట్టిన సౌతాఫ్రికా (63.33 శాతం) టాప్​ ప్లేస్​లోకి దూసుకొచ్చింది. దీంతో టీమ్ఇండియా ఫైనల్ చేరాలంటే తాజా సమీకరణాలు ఇలా ఉన్నాయి.

4- 1, 3-1 ఏదైనా ఓకే
ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమ్‌ఇండియా నేరుగా ఫైనల్‌ చేరాలంటే ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు టెస్టుల్లోనూ నెగ్గాలి. అందులో ఏ ఒక్క మ్యాచ్​లోనూ ఓడిపోకూడదు. అయితే ఒక మ్యాచ్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో అన్ని గెలవాలి లేదా ఒకటి డ్రా చేసుకుని, మిగతా రెండింట్లో నెగ్గాలి. భారత్‌ 4- 1తో సిరీస్‌ గెలిస్తే 64.05 పాయింట్ల శాతంతో, 3-1తో నెగ్గితే 60.52 పాయింట్ల శాతంతో ఆసీస్‌ను దాటి టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది.

2 -2 అయినా ఆశలు సజీవమే!
ఒకవేళ ఈ బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌ 2- 2తో డ్రా అయినా టీమ్ఇండియాకు అవకాశముంటుంది. కానీ, అలా జరిగితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను శ్రీలంక 2- 0తో క్లీన్​స్వీప్ చేయాలి. లేగా ఆ రెండు మ్యాచ్‌లనూ లంక డ్రాగా ముగించినా ఫర్వాలేదు. అప్పుడు ఆసీస్, భారత్‌ 55.26 పాయింట్ల శాతంతో సమానంగా ఉంటాయి. అయితే ఎక్కువ సిరీస్​ల్లో విజయం సాధించిన కారణంగా టీమ్ఇండియాకు ఫైనల్ రూట్ క్లీయర్ అవుతుంది.

దాదాపు ఫైనల్ చేరినట్లే!
2025 డబ్ల్యూటీసీలో తొలి ఐదు టెస్టుల్లో కేవలం ఒక్క విజయంతో రేసులో వెనకబడ్డ సౌతాఫ్రికా, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఐదో విజయం నమోదు చేసి ఏకంగా అగ్ర స్థానానికి చేరుకుంది. ఫైనల్‌ చేరేందుకు సౌతాఫ్రికాకు ఒక్క గెలుపు సరిపోతుంది. ఈ నెలలో సొంతగడ్డపై పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్​లో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్​లో విజయం సాధించినా సరిపోతుంది. ఒకవేళ పాక్ 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంటే మాత్రం, సఫారీ జట్టు రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. కానీ, ఇప్పుడు ఆ జట్టు ఉన్న ఫామ్‌లో, అది కూడా స్వదేశంలో జరుగుతున్న సిరీస్​లో ఒక్క టెస్టులో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు!

WTC 2025: అగ్ర స్థానం గల్లంతు- మూడో ప్లేస్​కు పడిపోయిన భారత్

రోహిత్, రాహుల్ ఓపెనింగ్ ఎవరు?- క్లారిటీ ఇచ్చేసిన హిట్​మ్యాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.