ETV Bharat / sports

గెట్​రెడీ క్రికెట్​ ఫ్యాన్స్- WPL ఓపెనింగ్ సెర్మనీకి స్టార్ హీరో- ఈసారి మరింత గ్రాండ్​గా

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 10:43 PM IST

Updated : Feb 23, 2024, 11:59 AM IST

WPL 2024 Opening Ceremony: 2024 మహిళల ప్రీమియర్ లీగ్ (Women's Premier League) టోర్నీ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఫిబ్రవరి 23న ప్రారంభం కానున్న ఈ టోర్నీ మార్చి 17 ఫైనల్ మ్యాచ్​తో ముగుస్తుంది.

wpl 2024 opening ceremony
wpl 2024 opening ceremony

WPL 2024 Opening Ceremony: ఐపీఎల్​ (Indian Premier League) కంటే ముందే క్రికెట్​ లవర్స్​కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ (Women's Premier League) సిద్ధమైంది. 2024 మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఐదు ఫ్రాంచైజీలతో 2023లో ప్రారంభమైన ఈ లీగ్​ సూపర్ సక్సెస్​ అయిన నేపథ్యంలో ఈసారి మరింత జోష్​తో రానుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి- ​ దిల్లీ మధ్య మ్యాచ్​తో రెండో ఎడిషన్ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. కాగా, డబ్ల్యూపీఎల్​లో సింగిల్ హెడర్లు మాత్రమే ఉంటాయి. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్​లో ఉన్న జట్టు నేరుగా ఫైనల్​కు వెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్​లో నెగ్గిన జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది

ఇక ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్​కు ముందు ఓపెనింగ్ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్​ను గ్రాండ్​గా చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్​తోపాటు టైగర్ జాకీఫ్రాఫ్, వరణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్​, పలువురు సింగర్లు హాజరై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఓపెనింగ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ ఎడిషన్​లో టోర్నీలో మ్యాచ్​లకు బెంగుళూరు, దిల్లీ నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సీజన్​లో ప్లేఆఫ్స్​ సహా మొత్తం 22 మ్యాచ్​లు జరగనున్నాయి. మొదట 11 మ్యాచ్​లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన 9 లీగ్ మ్యాచ్​లతోపాటు రెండు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్​లకు దిల్లీ అరుణ్ జైట్లి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

కాగా, రెండోసారి కూడా టైటిల్ నెగ్గాలన్న కసితో ముంబయి బరిలోకి దిగగా, తొలి ఎడిషన్​లో మిస్సైన కప్​ను ఈసారైన ఒడిసిపట్టాలని దిల్లీ భావిస్తోంది. మిగిలిన జట్లు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టైటిల్​పై కన్నేశాయి. అన్ని మ్యాచ్ కూడా సాయంత్రం 7.30గంటలకు ప్రారంభం అవుతాయి. డబ్ల్యూపీఎల్ అన్ని మ్యాచ్​లను బ్రాడ్​కాస్టింగ్ ఛానెల్ స్పోర్ట్స్​ 18లో, అలాగే జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్​లో చూడవచ్చు.

ఆయా జట్లు, కెప్టెన్లు

  • ముంబయి ఇండియన్స్- హర్మన్ ప్రీత్ కౌర్
  • దిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్
  • గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన
  • యూపీ వారియర్స్​- అలిస్సా హిలీ

WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?

ఆసీస్​ కెప్టెన్​ చేసిన పనికి భారత జట్టు​ ఫైర్​ - హర్మన్​కు అంత కోపం వచ్చిందా!

WPL 2024 Opening Ceremony: ఐపీఎల్​ (Indian Premier League) కంటే ముందే క్రికెట్​ లవర్స్​కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ (Women's Premier League) సిద్ధమైంది. 2024 మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఐదు ఫ్రాంచైజీలతో 2023లో ప్రారంభమైన ఈ లీగ్​ సూపర్ సక్సెస్​ అయిన నేపథ్యంలో ఈసారి మరింత జోష్​తో రానుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి- ​ దిల్లీ మధ్య మ్యాచ్​తో రెండో ఎడిషన్ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. కాగా, డబ్ల్యూపీఎల్​లో సింగిల్ హెడర్లు మాత్రమే ఉంటాయి. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్​లో ఉన్న జట్టు నేరుగా ఫైనల్​కు వెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్​లో నెగ్గిన జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది

ఇక ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్​కు ముందు ఓపెనింగ్ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్​ను గ్రాండ్​గా చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్​తోపాటు టైగర్ జాకీఫ్రాఫ్, వరణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్​, పలువురు సింగర్లు హాజరై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఓపెనింగ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ ఎడిషన్​లో టోర్నీలో మ్యాచ్​లకు బెంగుళూరు, దిల్లీ నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సీజన్​లో ప్లేఆఫ్స్​ సహా మొత్తం 22 మ్యాచ్​లు జరగనున్నాయి. మొదట 11 మ్యాచ్​లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన 9 లీగ్ మ్యాచ్​లతోపాటు రెండు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్​లకు దిల్లీ అరుణ్ జైట్లి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

కాగా, రెండోసారి కూడా టైటిల్ నెగ్గాలన్న కసితో ముంబయి బరిలోకి దిగగా, తొలి ఎడిషన్​లో మిస్సైన కప్​ను ఈసారైన ఒడిసిపట్టాలని దిల్లీ భావిస్తోంది. మిగిలిన జట్లు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టైటిల్​పై కన్నేశాయి. అన్ని మ్యాచ్ కూడా సాయంత్రం 7.30గంటలకు ప్రారంభం అవుతాయి. డబ్ల్యూపీఎల్ అన్ని మ్యాచ్​లను బ్రాడ్​కాస్టింగ్ ఛానెల్ స్పోర్ట్స్​ 18లో, అలాగే జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్​లో చూడవచ్చు.

ఆయా జట్లు, కెప్టెన్లు

  • ముంబయి ఇండియన్స్- హర్మన్ ప్రీత్ కౌర్
  • దిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్
  • గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన
  • యూపీ వారియర్స్​- అలిస్సా హిలీ

WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?

ఆసీస్​ కెప్టెన్​ చేసిన పనికి భారత జట్టు​ ఫైర్​ - హర్మన్​కు అంత కోపం వచ్చిందా!

Last Updated : Feb 23, 2024, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.