ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీకి ఇది ప్రాక్టీస్ కాదు- మేం ప్రతీది సీరియస్​గా తీసుకుంటాం: రోహిత్ - India Srilanka Series 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 12:21 PM IST

Rohit Sharma Srilanka Series: శ్రీలంకతో జరిగే వన్డేలు ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ మ్యాచ్​లు కాదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచులు ఇంటర్నేషనల్ గేమ్స్ అని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే?

Rohit Sharma Srilanka Series
Rohit Sharma Srilanka Series (Source: Associated Press)

Rohit Sharma Srilanka Series: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే శ్రీలంకతో వన్డే సిరీస్​కు హిట్​మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీని టీమ్ఇండియా హెచ్ కోచ్ గంభీర్ తీసుకొచ్చాడని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ మ్యాచ్​లు వీరిద్దరికి ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్​గా పనికొస్తాయని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ప్రచారంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఇంతకీ హిట్​మ్యాన్ ఏమన్నాడంటే?

'క్రికెట్ నాణ్యతపై రాజీపడబోం'
శ్రీలంకతో వన్డే సిరీస్​ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్​ ట్రోఫీకి ప్రాక్టీస్ గా పరిగణించట్లేదని రోహిత్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నాణ్యతపై రాజీపడబోమని మీడియా సమావేశంలో తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు క్రికెట్ నాణ్యత దెబ్బతినకూడదని చెప్పాడు. గత కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నామని, ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ గెలవాలనుకుంటామని పేర్కొన్నాడు.

ప్రాక్టీస్ మ్యాచ్​లు కాదు- ఇంటర్నేషనల్ గేమ్స్
'ప్రపంచకప్‌ ముందు మ్యాచ్​లు ఆడితే వరల్డ్​కప్​నకు సన్నాహాలు? వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వస్తోంది. ఇప్పుడు ఆడితే దీనికి సన్నద్దమవడం? ఇలాంటి ప్రశ్నలు తరచుగా వినిపిస్తుంటాయి. శ్రీలంకతో జరిగేవి ప్రాక్టీస్ మ్యాచులు కాదు. ఇంటర్నేషన్ గేమ్స్. మేము జట్టుగా ఏమి సాధించాలనుకుంటున్నామో అది మా మనసులో ఉంచుకుంటాం. మేమంతా శ్రీలంక వచ్చి మంచి క్రికెట్ ఆడి సిరీస్ గెలవాలనుకుంటున్నాం' అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

గంభీర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటా
శివమ్‌ దూబె లేదా రియాన్‌ పరాగ్‌, రిషభ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఎవరిని ఎంచుకుంటారని విలేకర్లు ప్రశ్నించగా రోహిత్ ఆసక్తికర వివరణ ఇచ్చాడు. అందరూ మ్యాచ్ విన్నర్లేనని, కోచ్ గంభీర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పక్కన పెట్టాలనేది గంభీర్​తో మాట్లాడి మ్యాచ్‌ సమయానికి వారికి తెలియజేస్తానని చెప్పాడు. ’

నేడే మొదటి వన్డే
కాగా, మూడు వన్డేల సిరీస్​లో భాగంగా శుక్రవారం శ్రీలంక జట్టుతో టీమ్ ఇండియా తలపడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్​ను క్వీన్ స్వీప్ చేసిన భారత్, వన్డేల్లోనూ రాణించాలని శ్రమిస్తోంది. అలాగే వన్డేల్లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు భావిస్తోంది.

భారత్ x శ్రీలంక: జోరుమీదున్న టీమ్ఇండియా- రోహిత్, విరాట్ ఈజ్ బ్యాక్ - Ind vs SL Series 2024

భయం లేదు, ఇలానే ముందుకెళ్తాం! : సూర్యకుమార్ యాదవ్

Rohit Sharma Srilanka Series: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే శ్రీలంకతో వన్డే సిరీస్​కు హిట్​మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీని టీమ్ఇండియా హెచ్ కోచ్ గంభీర్ తీసుకొచ్చాడని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ మ్యాచ్​లు వీరిద్దరికి ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్​గా పనికొస్తాయని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ప్రచారంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఇంతకీ హిట్​మ్యాన్ ఏమన్నాడంటే?

'క్రికెట్ నాణ్యతపై రాజీపడబోం'
శ్రీలంకతో వన్డే సిరీస్​ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్​ ట్రోఫీకి ప్రాక్టీస్ గా పరిగణించట్లేదని రోహిత్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నాణ్యతపై రాజీపడబోమని మీడియా సమావేశంలో తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు క్రికెట్ నాణ్యత దెబ్బతినకూడదని చెప్పాడు. గత కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నామని, ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ గెలవాలనుకుంటామని పేర్కొన్నాడు.

ప్రాక్టీస్ మ్యాచ్​లు కాదు- ఇంటర్నేషనల్ గేమ్స్
'ప్రపంచకప్‌ ముందు మ్యాచ్​లు ఆడితే వరల్డ్​కప్​నకు సన్నాహాలు? వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వస్తోంది. ఇప్పుడు ఆడితే దీనికి సన్నద్దమవడం? ఇలాంటి ప్రశ్నలు తరచుగా వినిపిస్తుంటాయి. శ్రీలంకతో జరిగేవి ప్రాక్టీస్ మ్యాచులు కాదు. ఇంటర్నేషన్ గేమ్స్. మేము జట్టుగా ఏమి సాధించాలనుకుంటున్నామో అది మా మనసులో ఉంచుకుంటాం. మేమంతా శ్రీలంక వచ్చి మంచి క్రికెట్ ఆడి సిరీస్ గెలవాలనుకుంటున్నాం' అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

గంభీర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటా
శివమ్‌ దూబె లేదా రియాన్‌ పరాగ్‌, రిషభ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఎవరిని ఎంచుకుంటారని విలేకర్లు ప్రశ్నించగా రోహిత్ ఆసక్తికర వివరణ ఇచ్చాడు. అందరూ మ్యాచ్ విన్నర్లేనని, కోచ్ గంభీర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పక్కన పెట్టాలనేది గంభీర్​తో మాట్లాడి మ్యాచ్‌ సమయానికి వారికి తెలియజేస్తానని చెప్పాడు. ’

నేడే మొదటి వన్డే
కాగా, మూడు వన్డేల సిరీస్​లో భాగంగా శుక్రవారం శ్రీలంక జట్టుతో టీమ్ ఇండియా తలపడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్​ను క్వీన్ స్వీప్ చేసిన భారత్, వన్డేల్లోనూ రాణించాలని శ్రమిస్తోంది. అలాగే వన్డేల్లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు భావిస్తోంది.

భారత్ x శ్రీలంక: జోరుమీదున్న టీమ్ఇండియా- రోహిత్, విరాట్ ఈజ్ బ్యాక్ - Ind vs SL Series 2024

భయం లేదు, ఇలానే ముందుకెళ్తాం! : సూర్యకుమార్ యాదవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.