ETV Bharat / sports

శ్రీలంక టూర్​కు కెప్టెన్ రోహిత్- గంభీర్ ప్లాన్ అదే!- విరాట్, బుమ్రా సంగతేంటి? - Rohit Sharma Srilanka tour

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 4:23 PM IST

Rohit Sharma Srilanka tour: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ్రీలంక పర్యటనలో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. దీంతో లంకతో వన్డే సిరీస్​కు హిట్​మ్యాన్​ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma Srilanka tour
Rohit Sharma Srilanka tour (Source: Associated Press)

Rohit Sharma Srilanka tour: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో ఆడనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్​కప్ తర్వాత పనిభారం కారణంగా రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోపు టీమ్ఇండియా 6వన్డే మ్యాచ్​లు మాత్రమే ఆడనుంది. అందుకే రోహిత్ లంక సిరీస్​లో ఆడాలని హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. అయితే లంకతో వన్డే సిరీస్ ఆడేందుకు హిట్​మ్యాన్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్ అతడే! అయితే రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికా ట్రిప్​లో ఉన్నాడు. ఈ నెలాఖరుకల్లా శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత్ రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ ఆడినట్లైతే టీమ్ఇండియాను అతడే నడిపించడం ఖాయం. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్​కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ ఆడకపోతే, కేఎల్ రాహుల్ టీమ్ఇండియాకు కెప్టెన్​గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది. కాగా, ఇక ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే సిరీస్​కు దూరంగా ఉంటాడని సమాచారం. ఈ విషయాన్ని హార్దిక్ ఇప్పటికే బీసీసీఐకి చెప్పాడట.

ఆ ఇద్దరికి రెస్ట్! కాగా, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఈ పర్యటనకు దూరంగానే ఉండే ఛాన్స్ ఉంది. విరాట్ ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్​లో ఉంటున్నాడు. మరోవైపు బుమ్రా కూడా కుంటుంబంతో సమయం గడుపుతున్నాడు. వీరు సెప్టెంబర్​లో బంగ్లాదేశ్​తో జరిగే టెస్టు సిరీస్​తోనే మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇస్తారు.

సూర్యవైపే మొగ్గు! అయితే టీమ్ఇండియా టీ20 కెప్టెన్ రేస్​లో సుర్యకుమార్ కూడా ఉన్నట్ల తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్​కు పాండ్యను కాకుండా సూర్యకుమార్​కే జట్టు పగ్గాలు అప్పజెప్పడానికి సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుందని టాక్. హార్దిక్ పాండ్య ఫిట్ నెస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్​గా పాండ్యకు అపార అనుభవం ఉంది. కాబట్టి టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీలంక సిరీస్​​కు టీమ్ఇండియా జట్లను త్వరలో ప్రకటించనుంది. కాగా భారత్ జులై ఆఖరి వారంలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో లంకతో టీమ్ఇండియా 3 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది.

భారత్ x శ్రీలంక - టీ20, వన్డే సిరీస్‌ షెడ్యూల్ ఇదే

శ్రీలంక మాజీ క్రికెటర్‌ మృతి - భార్యాపిల్లల ఎదుటే దారుణ హత్య

Rohit Sharma Srilanka tour: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో ఆడనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్​కప్ తర్వాత పనిభారం కారణంగా రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోపు టీమ్ఇండియా 6వన్డే మ్యాచ్​లు మాత్రమే ఆడనుంది. అందుకే రోహిత్ లంక సిరీస్​లో ఆడాలని హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. అయితే లంకతో వన్డే సిరీస్ ఆడేందుకు హిట్​మ్యాన్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్ అతడే! అయితే రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికా ట్రిప్​లో ఉన్నాడు. ఈ నెలాఖరుకల్లా శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత్ రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ ఆడినట్లైతే టీమ్ఇండియాను అతడే నడిపించడం ఖాయం. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్​కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ ఆడకపోతే, కేఎల్ రాహుల్ టీమ్ఇండియాకు కెప్టెన్​గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది. కాగా, ఇక ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే సిరీస్​కు దూరంగా ఉంటాడని సమాచారం. ఈ విషయాన్ని హార్దిక్ ఇప్పటికే బీసీసీఐకి చెప్పాడట.

ఆ ఇద్దరికి రెస్ట్! కాగా, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఈ పర్యటనకు దూరంగానే ఉండే ఛాన్స్ ఉంది. విరాట్ ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్​లో ఉంటున్నాడు. మరోవైపు బుమ్రా కూడా కుంటుంబంతో సమయం గడుపుతున్నాడు. వీరు సెప్టెంబర్​లో బంగ్లాదేశ్​తో జరిగే టెస్టు సిరీస్​తోనే మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇస్తారు.

సూర్యవైపే మొగ్గు! అయితే టీమ్ఇండియా టీ20 కెప్టెన్ రేస్​లో సుర్యకుమార్ కూడా ఉన్నట్ల తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్​కు పాండ్యను కాకుండా సూర్యకుమార్​కే జట్టు పగ్గాలు అప్పజెప్పడానికి సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుందని టాక్. హార్దిక్ పాండ్య ఫిట్ నెస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్​గా పాండ్యకు అపార అనుభవం ఉంది. కాబట్టి టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీలంక సిరీస్​​కు టీమ్ఇండియా జట్లను త్వరలో ప్రకటించనుంది. కాగా భారత్ జులై ఆఖరి వారంలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో లంకతో టీమ్ఇండియా 3 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది.

భారత్ x శ్రీలంక - టీ20, వన్డే సిరీస్‌ షెడ్యూల్ ఇదే

శ్రీలంక మాజీ క్రికెటర్‌ మృతి - భార్యాపిల్లల ఎదుటే దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.