ETV Bharat / sports

'డివిలియర్స్ కంటే డేంజర్​గా'- కమ్​బ్యాక్​లో సూర్య మెరుపులు - Suryakumar Yadav Comeback

Suryakumar Yadav Comeback: స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీలో ఆర్సీబీ మెరుపు ఇన్నింగ్స్​తో అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ వాంఖడేలో బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు ప్రస్తుత ఐపీఎల్​లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అదరగొడుతున్నాడు. పర్ఫెక్ట్ యార్కర్లతో బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు.

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 8:18 PM IST

Suryakumar Yadav Comeback
Suryakumar Yadav Comeback

Suryakumar Yadav Comeback: 360 డిగ్రీల ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుని రీసెంట్​గా ముంబయి జట్టుతో కలిశాడు. ఇక దిల్లీతో మ్యాచ్​లో బరిలోకి దిగి డకౌటయ్యాడు. దీంతో సూర్య ఇప్పట్లో ఫామ్​లోకి రాడేమో అని అభిమానులు, ముంబయి ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ, ఎలాంటి దిగులు చెందవద్దని నేనున్నానంటూ రెండో మ్యాచ్​లోనే మళ్లీ పాత ఫామ్ అందుకున్నాడు. ఏకంగా ​గురువారం ఆర్సీబీపై విధ్వంసం సృష్టించాడు.

కొన్ని నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సూర్య ఆర్సీబీపై ఇన్నింగ్స్​తో ఔరా అనిపించాడు. 19 బంతుల్లోనే 52 పరుగుల చేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. సూర్య దెబ్బకు ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టాయి. ఈ క్రమంలో సూర్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 'టీ20ల్లో ఇలాంటి ఇన్నింగ్స్​ అంటే గతంలో డివిలియర్స్ గుర్తొచ్చేవాడు. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని సూర్య భర్తీ చేస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్యనే డేంజరస్ ప్లేయర్​ అనిపిస్తున్నాడు' అని మాజీ క్రికెటర్ హర్భజన్ సైతం సూర్యను ప్రశంసించాడు.

మరోవైపు, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో ఫైఫర్ (5 వికెట్లు) తీయడం బుమ్రాకిది రెండోసారి. ఈ క్రమంలో బెంగళూరుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా అవతరించాడు. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచి పర్పుల్ క్యాప్ సైతం దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్​లో ఇరు జట్లు కలిసి 395 పరుగులు నమోదు చేశాయి. ఇంతటి హై స్కోరింగ్ మ్యాచ్​లో కూడా బుమ్రా కట్టుదిడ్డంగా బంతులేశాడు. 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో సత్తా చాటాడు. కోహ్లీ సహా ఐదుగురిని పెవిలియన్​ చేర్చాడు. మిగతా బౌలర్లందరూ తేలిపోతే బుమ్రా ఒక్కడు ఇలా పొదుపుగా బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్‌కే పరిమితం కాదు. ప్రతీ మ్యాచ్‌లో జరిగేది ఇదే. సన్‌రైజర్స్ జట్టు ముంబయిపై 277 పరుగులతో ఐపీఎల్ రికార్డు స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌లో కూడా మిగతా బౌలర్లందరూ 12-17 మధ్య ఎకానమీ నమోదు చేస్తే బుమ్రా ఓవర్‌కు 9 పరుగుల చొప్పునే ఇచ్చాడు.

అతడి స్థాయికి ఆ ఎకానమీ ఎక్కువే. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో కలిపితే బుమ్రా ఎకానమీ 5.95 మాత్రమే. అతను 11.9 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లున్నారు కానీ వాళ్లెవరూ ఎకానమీలో అతడికి దగ్గర్లో లేరు. ఎలాంటి విధ్వంసకర బ్యాటర్లయినా ముంబయితో మ్యాచ్‌ అంటే బుమ్రాను గౌరవించాల్సిందే. అతడి బంతులను ఆచితూచి ఆడాల్సిందే. ఐపీఎల్ మొత్తంలో కూడా అతడి ఎకానమీ 7.33 మాత్రమే.

ఆ రెండూ నా టార్గెట్!- అప్పటిదాకా నో రిటైర్మెంట్!- ​రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Rohit Sharma Retirement

'బాగా ఆడాలనుకున్నప్పుడు అలా చేస్తా' - అదిరే ప్రదర్శనపై బుమ్రా - IPL 2024 RCB VS MI

Suryakumar Yadav Comeback: 360 డిగ్రీల ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుని రీసెంట్​గా ముంబయి జట్టుతో కలిశాడు. ఇక దిల్లీతో మ్యాచ్​లో బరిలోకి దిగి డకౌటయ్యాడు. దీంతో సూర్య ఇప్పట్లో ఫామ్​లోకి రాడేమో అని అభిమానులు, ముంబయి ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ, ఎలాంటి దిగులు చెందవద్దని నేనున్నానంటూ రెండో మ్యాచ్​లోనే మళ్లీ పాత ఫామ్ అందుకున్నాడు. ఏకంగా ​గురువారం ఆర్సీబీపై విధ్వంసం సృష్టించాడు.

కొన్ని నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సూర్య ఆర్సీబీపై ఇన్నింగ్స్​తో ఔరా అనిపించాడు. 19 బంతుల్లోనే 52 పరుగుల చేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. సూర్య దెబ్బకు ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టాయి. ఈ క్రమంలో సూర్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 'టీ20ల్లో ఇలాంటి ఇన్నింగ్స్​ అంటే గతంలో డివిలియర్స్ గుర్తొచ్చేవాడు. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని సూర్య భర్తీ చేస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్యనే డేంజరస్ ప్లేయర్​ అనిపిస్తున్నాడు' అని మాజీ క్రికెటర్ హర్భజన్ సైతం సూర్యను ప్రశంసించాడు.

మరోవైపు, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో ఫైఫర్ (5 వికెట్లు) తీయడం బుమ్రాకిది రెండోసారి. ఈ క్రమంలో బెంగళూరుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా అవతరించాడు. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచి పర్పుల్ క్యాప్ సైతం దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్​లో ఇరు జట్లు కలిసి 395 పరుగులు నమోదు చేశాయి. ఇంతటి హై స్కోరింగ్ మ్యాచ్​లో కూడా బుమ్రా కట్టుదిడ్డంగా బంతులేశాడు. 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో సత్తా చాటాడు. కోహ్లీ సహా ఐదుగురిని పెవిలియన్​ చేర్చాడు. మిగతా బౌలర్లందరూ తేలిపోతే బుమ్రా ఒక్కడు ఇలా పొదుపుగా బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్‌కే పరిమితం కాదు. ప్రతీ మ్యాచ్‌లో జరిగేది ఇదే. సన్‌రైజర్స్ జట్టు ముంబయిపై 277 పరుగులతో ఐపీఎల్ రికార్డు స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌లో కూడా మిగతా బౌలర్లందరూ 12-17 మధ్య ఎకానమీ నమోదు చేస్తే బుమ్రా ఓవర్‌కు 9 పరుగుల చొప్పునే ఇచ్చాడు.

అతడి స్థాయికి ఆ ఎకానమీ ఎక్కువే. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో కలిపితే బుమ్రా ఎకానమీ 5.95 మాత్రమే. అతను 11.9 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లున్నారు కానీ వాళ్లెవరూ ఎకానమీలో అతడికి దగ్గర్లో లేరు. ఎలాంటి విధ్వంసకర బ్యాటర్లయినా ముంబయితో మ్యాచ్‌ అంటే బుమ్రాను గౌరవించాల్సిందే. అతడి బంతులను ఆచితూచి ఆడాల్సిందే. ఐపీఎల్ మొత్తంలో కూడా అతడి ఎకానమీ 7.33 మాత్రమే.

ఆ రెండూ నా టార్గెట్!- అప్పటిదాకా నో రిటైర్మెంట్!- ​రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Rohit Sharma Retirement

'బాగా ఆడాలనుకున్నప్పుడు అలా చేస్తా' - అదిరే ప్రదర్శనపై బుమ్రా - IPL 2024 RCB VS MI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.