ETV Bharat / sports

భారత్ ముంగిట బజ్​బాల్ 'జుజుబీ' - బరిలో దిగితే టీమ్ఇండియాదే అగ్రెసివ్ క్రికెట్ - Ind vs Ban Test 2024

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Ind vs Ban Test 2024 : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత టాపార్డర్ బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100 పరుగులు నమోదు చేసి పలు రికార్డులు నెలకొల్పారు.

Ind vs Ban Test 2024
Ind vs Ban Test 2024 (Source : Associated Press)

Ind vs Ban Test 2024 : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్, జైస్వాల్, గిల్ అద్భుతం చేశారు. 147 ఏళ్ల ప్రపంచ టెస్టు క్రికెట్​లో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా, టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్​ ప్రారంభించింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారత్ ఓపెనర్లు రోహిత్ - జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశారు.

దీంతో టెస్టు క్రికెట్​ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జోడీగా రోహిత్- జైస్వాల్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ - బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉండేది. వీరిద్దరూ 26 బంతుల్లో 50+ స్కోరు చేశారు. తాజాగా ఇన్నింగ్స్​లో రోహిత్- జైస్వాల్ జోడీ ఆ రికార్డు బద్దలుకొట్టింది.

ఫాస్టెస్ట్ 100 కూడా మనదే
అయితే జట్టు స్కోర్ 50 పరుగులు దాటిన తర్వాత ఓపెనర్ రోహిత్ (23) ఔటయ్యాడు. అయినప్పటికీ జైస్వాల్ జోరు తగ్గించలేదు. వన్​డౌన్​లో దిగిన శుభ్​మన్ గిల్​తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ - గిల్ జోడి 10.1 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు దాటించింది. టెస్టుల్లో వేగవంతమైన 100 పరుగులు కూడా ఇదే కావడం విశేషం.

200 కూడా రికార్డే
తొలి ఇన్నింగ్స్​లో మెరుపు ఓపెనింగ్​ను మిడిలార్డర్ బ్యాటర్లు సమర్థంగా వినియోగించుకున్నారు. వేగవంతమైన 50, 100, 150 తర్వాత టెస్టుల్లో ఫాస్టెస్ట్ 200 మార్క్​ అందుకున్న ఘనత కూడా టీమ్ఇండియా తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 24.5 ఓవర్లలో 200 మార్క్ అందుకుంది. దీంతో టెస్టుల్లో అతి తక్కువ ఓవర్లలో ఈ మైలురాయి అందుకున్న జట్టుగా టీమ్ఇండియా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా (28.1 vs పాకిస్థాన్ 2017) రికార్డును బ్రేక్ చేసింది.

Ind vs Ban Test 2024 : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్, జైస్వాల్, గిల్ అద్భుతం చేశారు. 147 ఏళ్ల ప్రపంచ టెస్టు క్రికెట్​లో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా, టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్​ ప్రారంభించింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారత్ ఓపెనర్లు రోహిత్ - జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశారు.

దీంతో టెస్టు క్రికెట్​ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జోడీగా రోహిత్- జైస్వాల్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ - బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉండేది. వీరిద్దరూ 26 బంతుల్లో 50+ స్కోరు చేశారు. తాజాగా ఇన్నింగ్స్​లో రోహిత్- జైస్వాల్ జోడీ ఆ రికార్డు బద్దలుకొట్టింది.

ఫాస్టెస్ట్ 100 కూడా మనదే
అయితే జట్టు స్కోర్ 50 పరుగులు దాటిన తర్వాత ఓపెనర్ రోహిత్ (23) ఔటయ్యాడు. అయినప్పటికీ జైస్వాల్ జోరు తగ్గించలేదు. వన్​డౌన్​లో దిగిన శుభ్​మన్ గిల్​తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ - గిల్ జోడి 10.1 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు దాటించింది. టెస్టుల్లో వేగవంతమైన 100 పరుగులు కూడా ఇదే కావడం విశేషం.

200 కూడా రికార్డే
తొలి ఇన్నింగ్స్​లో మెరుపు ఓపెనింగ్​ను మిడిలార్డర్ బ్యాటర్లు సమర్థంగా వినియోగించుకున్నారు. వేగవంతమైన 50, 100, 150 తర్వాత టెస్టుల్లో ఫాస్టెస్ట్ 200 మార్క్​ అందుకున్న ఘనత కూడా టీమ్ఇండియా తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 24.5 ఓవర్లలో 200 మార్క్ అందుకుంది. దీంతో టెస్టుల్లో అతి తక్కువ ఓవర్లలో ఈ మైలురాయి అందుకున్న జట్టుగా టీమ్ఇండియా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా (28.1 vs పాకిస్థాన్ 2017) రికార్డును బ్రేక్ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.