ETV Bharat / sports

వినేశ్ ఫోగాట్​పై అనర్హత వేటు - ఒలింపిక్స్​కు ఐఓఏ ఛాలెంజ్ - Vinesh Phogat Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 7, 2024, 12:26 PM IST

Vinesh Phogat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో ఫైనల్స్​కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్​ వినేశ్​ ఫోగట్​కు ఊహించని షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందే ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.

Vinesh Phogat
Vinesh Phogat (Associated Press)

Vinesh Phogat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో ఫైనల్స్​కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​కు ఊహించని షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందే ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.

"రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల ఆమెపై ఈ వేటు పడింది. దయచేసి వినేశ్​ ప్రైవసీకి భంగం కలగించకుండా ప్రవర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తను పంచుకోవడం అత్యంత బాధాకరంగా ఉంది" అంటూ భారత ఒలింపిక్‌ సంఘం తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.

గోల్డ్ మెడల్ ఎవరికంటే?
ఈ పోటీల్లో వినేశ్​పై అనర్హత వేటు పడినందున ఆమెకు ఎటువంటి పతకం ఇవ్వరని సమాచారం. అయితే ఆమెతో పాటు ఫైనల్​లో ఉన్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెబ్రాండ్​కు మాత్రం ఆఖరి పోరులో పాల్గొనకుండానే బంగారు పతకాన్ని అందజేస్తారు. సిల్వర్‌ మెడల్‌ను మాత్రం ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేస్తారు. ఇక కాంస్య పతక పోటీలు లాంఛనంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

ఒలింపిక్స్​కు ఐఓఏ ఛాలెంజ్
అయితే వినేశ్‌ ఫొగాట్‌ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఐఓఏ వారిపై సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది. ఒలింపిక్‌ అసోసియేషన్‌ నిబంధనల మేరకు, పోటీ జరిగే రోజున బరువుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించడం కామనే. అయితే, మంగళవారం రాత్రి సెమీస్‌ పోరులో తలపడినప్పుడు లేని ఫొగాట్‌ బరువు బుధవారం ఉదయానికల్లా పెరగడంపైనా కూడా ఐవోఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్‌ కమిటీ పునఃసమీక్ష లేకుంటే మాత్రం ఫొగాట్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది. అప్పుడు అమె స్వదేశానికి తిరిగిరాకతప్పదని క్రీడా వర్గాల మాట.

మోదీ భరోసా
పారిస్ ఒలింపిక్స్​లో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై విధించిన అనర్హత వేటు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓ ట్వీట్​ ద్వారా ఆమెను ఓదార్చారు.

"వినేశ్‌ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఓ ఇన్​స్పిరేషన్. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీన్నిపై విచారం వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్లను ఎదిరించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం" అని మోదీ వినేశ్​కు భరోసానిచ్చారు.

'నీరజ్​ గోల్డ్ కొడితే రూ.1,00,089 ప్రైజ్‌ మనీ' - వైరల్​గా మారిన పంత్ పోస్ట్​! - Neeraj Chopra Gold Medal

వారెవా వినేశ్‌! చరిత్ర సృష్టించావ్​ - అప్పుడు రోడ్డుపై ఇప్పుడు పోడియంపై - Paris Olympics 2024 Vinesh Phogat

Vinesh Phogat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో ఫైనల్స్​కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​కు ఊహించని షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందే ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.

"రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల ఆమెపై ఈ వేటు పడింది. దయచేసి వినేశ్​ ప్రైవసీకి భంగం కలగించకుండా ప్రవర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తను పంచుకోవడం అత్యంత బాధాకరంగా ఉంది" అంటూ భారత ఒలింపిక్‌ సంఘం తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.

గోల్డ్ మెడల్ ఎవరికంటే?
ఈ పోటీల్లో వినేశ్​పై అనర్హత వేటు పడినందున ఆమెకు ఎటువంటి పతకం ఇవ్వరని సమాచారం. అయితే ఆమెతో పాటు ఫైనల్​లో ఉన్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెబ్రాండ్​కు మాత్రం ఆఖరి పోరులో పాల్గొనకుండానే బంగారు పతకాన్ని అందజేస్తారు. సిల్వర్‌ మెడల్‌ను మాత్రం ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేస్తారు. ఇక కాంస్య పతక పోటీలు లాంఛనంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

ఒలింపిక్స్​కు ఐఓఏ ఛాలెంజ్
అయితే వినేశ్‌ ఫొగాట్‌ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఐఓఏ వారిపై సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది. ఒలింపిక్‌ అసోసియేషన్‌ నిబంధనల మేరకు, పోటీ జరిగే రోజున బరువుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించడం కామనే. అయితే, మంగళవారం రాత్రి సెమీస్‌ పోరులో తలపడినప్పుడు లేని ఫొగాట్‌ బరువు బుధవారం ఉదయానికల్లా పెరగడంపైనా కూడా ఐవోఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్‌ కమిటీ పునఃసమీక్ష లేకుంటే మాత్రం ఫొగాట్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది. అప్పుడు అమె స్వదేశానికి తిరిగిరాకతప్పదని క్రీడా వర్గాల మాట.

మోదీ భరోసా
పారిస్ ఒలింపిక్స్​లో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై విధించిన అనర్హత వేటు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓ ట్వీట్​ ద్వారా ఆమెను ఓదార్చారు.

"వినేశ్‌ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఓ ఇన్​స్పిరేషన్. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీన్నిపై విచారం వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్లను ఎదిరించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం" అని మోదీ వినేశ్​కు భరోసానిచ్చారు.

'నీరజ్​ గోల్డ్ కొడితే రూ.1,00,089 ప్రైజ్‌ మనీ' - వైరల్​గా మారిన పంత్ పోస్ట్​! - Neeraj Chopra Gold Medal

వారెవా వినేశ్‌! చరిత్ర సృష్టించావ్​ - అప్పుడు రోడ్డుపై ఇప్పుడు పోడియంపై - Paris Olympics 2024 Vinesh Phogat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.