ETV Bharat / sports

2025 ఆసియా కప్​ ఫార్మాట్ ఛేంజ్- ఈసారి T20 మజా - Asia Cup 2025

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 4:58 PM IST

Mens Asia Cup 2025: 2025 ఆసియా కప్ టోర్నమెంట్​ షెడ్యూల్​కు ఏసీసీ ప్లాన్ చేస్తుంది. ఈ ఎడిషన్​ టీ20 ఫార్మాట్​లో జరగనున్నట్లు తెలుస్తోంది.

Arjun Babuta Paris Olympics
Arjun Babuta Paris Olympics (Source: Associated Press)

Mens Asia Cup 2025: 2025 ఆసియా కప్ టోర్నమెంట్​కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఆయితే ఈసారి టోర్నీని టీ20 ఫార్మాట్​లో నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రిపేర్ చేసే ఆలోచనలో ఉందట. గతంలోనూ 2016, 2022లో రెండుసార్లు టీ20 ఫార్మాట్​లోనే జరిగింది. దీంతో ఈసారి కూడా పొట్టి ఫార్మాట్​లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోందట. అయితే గతేడాది 2023 మాత్రం వన్డే ఫార్మాట్​లో జరిగింది. ఆ ఎడిషన్​లో భారత్ విజేతగా నిలిచింది.

ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. భారత్ సహా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధిస్తాయి. ఇక ఆరో జట్టు క్వాలిఫయర్ రౌండ్​ ద్వారా ఎంపికవుతుంది. ఇందులో నేపాల్, హాంకాంక్, యూఏఈ మధ్యలో క్వాలిఫయర్ ఉండనుంది. ఇక ఏసీసీ, వచ్చే ఎడిషన్​ కోసం స్పాన్సర్లు, బ్రాడ్​కాస్టర్ పార్ట్​నర్లను ఇప్పటికే ఆహ్వానించిదట. కాగా, మ్యాచ్​ల నిర్వహణ కోసం స్టేడియాలపై ఓ క్లారిటీ ఇస్తే, ఏసీసీ ఆసియా కప్ షెడ్యూల్ ప్లాన్ చేయనుంది.

ఆ నెలలోనే!
అయితే వచ్చే ఏడాది టీమ్ఇండియా వరుస సిరీస్​లతో బిజీగా ఉండనుంది. జనవరి- ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్, ఫిబ్రవరి- మార్చిలో ఛాంపియన్స్​ ట్రోఫీ ఆ తర్వాత ఏప్రి- మేలో ఐపీఎల్ ఉండనుంది. ఇక టీమ్ఇండియా జూన్- ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తర్వాత సెప్టెంబర్​లో బంగ్లాదేశ్ సిరీస్ ఉంది. అందుకే 2025 ఆసియా కప్​ను అక్టోబర్ నెలలో నిర్వహించాలని ఏసీసీ ప్లాన్ చేస్తుంది. కాగా, 2027 ఆసియా కప్ ​​ మాత్రం మళ్లీ వన్డే ఫార్మాట్​లోకే మారిపోనుంది. ఈ ఎడిషన్​కు బంగ్లాందేశ్ ఆతిథ్యమివ్వనుంది.

కాగా, టీమ్ఇండియా ఇప్పటివరకు 8సార్లు ఆసియా కప్ టోర్నమెంట్​లో ఛాంపియన్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ నెగ్గిన జట్టుగా కొనసాగుతోంది. భారత్ తర్వాత శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండుసార్లు నెగ్గాయి. ఇక బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియా కప్ విజేతగా నిలవలేదు.

యశస్వి అరుదైన ఘనత- తొలి బ్యాటర్​గా రికార్డ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ - ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు - Cricket In Olympics

Mens Asia Cup 2025: 2025 ఆసియా కప్ టోర్నమెంట్​కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఆయితే ఈసారి టోర్నీని టీ20 ఫార్మాట్​లో నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రిపేర్ చేసే ఆలోచనలో ఉందట. గతంలోనూ 2016, 2022లో రెండుసార్లు టీ20 ఫార్మాట్​లోనే జరిగింది. దీంతో ఈసారి కూడా పొట్టి ఫార్మాట్​లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోందట. అయితే గతేడాది 2023 మాత్రం వన్డే ఫార్మాట్​లో జరిగింది. ఆ ఎడిషన్​లో భారత్ విజేతగా నిలిచింది.

ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. భారత్ సహా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధిస్తాయి. ఇక ఆరో జట్టు క్వాలిఫయర్ రౌండ్​ ద్వారా ఎంపికవుతుంది. ఇందులో నేపాల్, హాంకాంక్, యూఏఈ మధ్యలో క్వాలిఫయర్ ఉండనుంది. ఇక ఏసీసీ, వచ్చే ఎడిషన్​ కోసం స్పాన్సర్లు, బ్రాడ్​కాస్టర్ పార్ట్​నర్లను ఇప్పటికే ఆహ్వానించిదట. కాగా, మ్యాచ్​ల నిర్వహణ కోసం స్టేడియాలపై ఓ క్లారిటీ ఇస్తే, ఏసీసీ ఆసియా కప్ షెడ్యూల్ ప్లాన్ చేయనుంది.

ఆ నెలలోనే!
అయితే వచ్చే ఏడాది టీమ్ఇండియా వరుస సిరీస్​లతో బిజీగా ఉండనుంది. జనవరి- ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్, ఫిబ్రవరి- మార్చిలో ఛాంపియన్స్​ ట్రోఫీ ఆ తర్వాత ఏప్రి- మేలో ఐపీఎల్ ఉండనుంది. ఇక టీమ్ఇండియా జూన్- ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తర్వాత సెప్టెంబర్​లో బంగ్లాదేశ్ సిరీస్ ఉంది. అందుకే 2025 ఆసియా కప్​ను అక్టోబర్ నెలలో నిర్వహించాలని ఏసీసీ ప్లాన్ చేస్తుంది. కాగా, 2027 ఆసియా కప్ ​​ మాత్రం మళ్లీ వన్డే ఫార్మాట్​లోకే మారిపోనుంది. ఈ ఎడిషన్​కు బంగ్లాందేశ్ ఆతిథ్యమివ్వనుంది.

కాగా, టీమ్ఇండియా ఇప్పటివరకు 8సార్లు ఆసియా కప్ టోర్నమెంట్​లో ఛాంపియన్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ నెగ్గిన జట్టుగా కొనసాగుతోంది. భారత్ తర్వాత శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండుసార్లు నెగ్గాయి. ఇక బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియా కప్ విజేతగా నిలవలేదు.

యశస్వి అరుదైన ఘనత- తొలి బ్యాటర్​గా రికార్డ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ - ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు - Cricket In Olympics

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.