ETV Bharat / sports

'అదే నా లక్ష్యం' - బ్యాడ్మింటన్​లో అదరగొడుతున్న 'జూనియర్' పీవీ సింధు' - Badminton Player Tanvi Patri

author img

By ETV Bharat Sports Team

Published : Aug 31, 2024, 11:50 AM IST

Junior PV Sindhu Badminton Player Tanvi Patri : దేశానికి రెండు ఒలింపిక్ బంగారు పతకాలు అందించాలన్నదే తన లక్ష్యమని అంటోంది జూనియర్ పీవీ సింధుగా ప్రశంసలు అందుకుంటున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన్వి పత్రి. ఇటీవలే ఆసియా అండర్‌-15 ఛాంపియన్​గా నిలిచిన ఈ అమ్మాయిని ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో తన్వి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

source ETV Bharat
Badminton Player Tanvi Patri (source ETV Bharat)
బ్యాడ్మింటన్ ప్లేయర్ తన్వి పత్రి (ETV Bharat)

Junior PV Sindhu Badminton Player Tanvi Patri : కోర్టులో వేగంగా కదిలే నైపుణ్యం, స్మాష్​లతో సత్తాచాటే లక్షణం, అలవోకగా పాయింట్లు సాధించే ప్రతిభ, చిన్న వయసులోనే పెద్ద విజయాలు. మరో పీవీ సింధులా ఎదుగుతుందనే అభిప్రాయాలు. ఇదంతా 13 ఏళ్ల తన్వి పత్రి గురించే. తాజాగా ఆసియా అండర్‌-15 ఛాంపియన్​గా నిలిచిన ఈ ఒడిశా అమ్మాయి, భారత బ్యాడ్మింటన్‌ భవిష్యత్‌ తారగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో తన్వి పత్రిని ఈటీవీ భారత్ పలకరించింది. ఈ క్రమంలో తన్వి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటంటే?

తండ్రిని చూసే ఆటపై ఆసక్తి - తన్వి తల్లిదండ్రులు రవి నారాయణన్, శైలాబాల చైనాలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. తండ్రి రవి నారాయణన్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా తన్వి చూసి ఆట పట్ల ఆకర్షితురాలైంది. 5 ఏళ్ల నుంచే చైనాలోని జియాంగ్‌ యాంగ్‌ శిక్షణలో తన్వి బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 2017 నుంచి 2020 వరకు అక్కడ 9 టైటిళ్లు గెలిచుకుంది. అయితే, కొవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా తన్వి కుటుంబం భారత్​కు తిరిగొచ్చేసింది. 2022లో బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ)లో తన్వి చేరింది. అక్కడి నుంచి క్రమంగా మరింత మెరుగవుతూ వచ్చింది. 13 ఏళ్లకే అందరితో జూనియర్ పీవీ సింధు అని తన్వి ప్రశంసలు అందుకుంది.

'ఒలింపిక్స్​లో దేశానికి రెండు పతకాలు అందిస్తా'
"నా తండ్రి స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ ఆడడం ప్రారంభించి చైనాలో 9 పతకాలు సాధించాను. ఒక్క టోర్నీలో మాత్రమే సెమీ ఫైనల్​లో ఓడిపోయాను. ఆ ఓటమిని ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ ఆ తర్వాత మరింత కష్టపడి టోర్నీలు ఆడాను. ఇటీవల జరిగిన ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్​లో అండర్‌-15 టైటిల్‌ గెలిచుకున్నాను. భవిష్యత్తులో భారత్​కు ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలు అందించాలన్నదే నా కల. " అని ఈటీవీ భారత్​తో ఇంటర్వ్యూలో తన్వి చెప్పుకొచ్చింది.

తన్వి సాధించిన పతకాలు ఇవే! - ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో జరిగిన పలు పోటీల్లో తన్వి పతకాలు సాధించింది. ఇటీవలే ఒడిశాలోని భువనేశ్వర్​లో జరిగిన అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీల్లో తన్వి అండర్‌-15, 17 విజేతగా నిలిచింది. ఓఎస్ బీఏ ఆల్ ఒడిశా మినీలో జూనియర్ ర్యాకింగ్​లో మూడు టైటిళ్లు, అండర్- 19 బాలికల సింగిల్స్ టైటిల్​ను గెలుచుకుంది. అలాగే హైదరాబాద్​లో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లోనూ అండర్ -15, అండర్ -17 బాలికల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. పుణె డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన పోటీలో తన్వి సెమీ ఫైనల్​లోకి దూసుకెళ్లింది.

అండర్-19 జట్టులోకి ద్రవిడ్ కుమారుడు - ఆస్ట్రేలియాతో సిరీస్​ - Rahul Dravid Son U19 team

డాక్టర్ల తప్పిదంతో చేయి కోల్పోయి, యాక్సిడెంట్​లో అన్నయ్య దూరం - సిల్వర్​ మెడలిస్ట్​ మనీశ్ సక్సెస్​ స్టోరీ - PARALYMPICS MANISH NARWAL JOURNEY

బ్యాడ్మింటన్ ప్లేయర్ తన్వి పత్రి (ETV Bharat)

Junior PV Sindhu Badminton Player Tanvi Patri : కోర్టులో వేగంగా కదిలే నైపుణ్యం, స్మాష్​లతో సత్తాచాటే లక్షణం, అలవోకగా పాయింట్లు సాధించే ప్రతిభ, చిన్న వయసులోనే పెద్ద విజయాలు. మరో పీవీ సింధులా ఎదుగుతుందనే అభిప్రాయాలు. ఇదంతా 13 ఏళ్ల తన్వి పత్రి గురించే. తాజాగా ఆసియా అండర్‌-15 ఛాంపియన్​గా నిలిచిన ఈ ఒడిశా అమ్మాయి, భారత బ్యాడ్మింటన్‌ భవిష్యత్‌ తారగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో తన్వి పత్రిని ఈటీవీ భారత్ పలకరించింది. ఈ క్రమంలో తన్వి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటంటే?

తండ్రిని చూసే ఆటపై ఆసక్తి - తన్వి తల్లిదండ్రులు రవి నారాయణన్, శైలాబాల చైనాలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. తండ్రి రవి నారాయణన్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా తన్వి చూసి ఆట పట్ల ఆకర్షితురాలైంది. 5 ఏళ్ల నుంచే చైనాలోని జియాంగ్‌ యాంగ్‌ శిక్షణలో తన్వి బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 2017 నుంచి 2020 వరకు అక్కడ 9 టైటిళ్లు గెలిచుకుంది. అయితే, కొవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా తన్వి కుటుంబం భారత్​కు తిరిగొచ్చేసింది. 2022లో బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ)లో తన్వి చేరింది. అక్కడి నుంచి క్రమంగా మరింత మెరుగవుతూ వచ్చింది. 13 ఏళ్లకే అందరితో జూనియర్ పీవీ సింధు అని తన్వి ప్రశంసలు అందుకుంది.

'ఒలింపిక్స్​లో దేశానికి రెండు పతకాలు అందిస్తా'
"నా తండ్రి స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ ఆడడం ప్రారంభించి చైనాలో 9 పతకాలు సాధించాను. ఒక్క టోర్నీలో మాత్రమే సెమీ ఫైనల్​లో ఓడిపోయాను. ఆ ఓటమిని ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ ఆ తర్వాత మరింత కష్టపడి టోర్నీలు ఆడాను. ఇటీవల జరిగిన ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్​లో అండర్‌-15 టైటిల్‌ గెలిచుకున్నాను. భవిష్యత్తులో భారత్​కు ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలు అందించాలన్నదే నా కల. " అని ఈటీవీ భారత్​తో ఇంటర్వ్యూలో తన్వి చెప్పుకొచ్చింది.

తన్వి సాధించిన పతకాలు ఇవే! - ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో జరిగిన పలు పోటీల్లో తన్వి పతకాలు సాధించింది. ఇటీవలే ఒడిశాలోని భువనేశ్వర్​లో జరిగిన అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీల్లో తన్వి అండర్‌-15, 17 విజేతగా నిలిచింది. ఓఎస్ బీఏ ఆల్ ఒడిశా మినీలో జూనియర్ ర్యాకింగ్​లో మూడు టైటిళ్లు, అండర్- 19 బాలికల సింగిల్స్ టైటిల్​ను గెలుచుకుంది. అలాగే హైదరాబాద్​లో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లోనూ అండర్ -15, అండర్ -17 బాలికల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. పుణె డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన పోటీలో తన్వి సెమీ ఫైనల్​లోకి దూసుకెళ్లింది.

అండర్-19 జట్టులోకి ద్రవిడ్ కుమారుడు - ఆస్ట్రేలియాతో సిరీస్​ - Rahul Dravid Son U19 team

డాక్టర్ల తప్పిదంతో చేయి కోల్పోయి, యాక్సిడెంట్​లో అన్నయ్య దూరం - సిల్వర్​ మెడలిస్ట్​ మనీశ్ సక్సెస్​ స్టోరీ - PARALYMPICS MANISH NARWAL JOURNEY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.