ETV Bharat / sports

BCCI కీలక నిర్ణయం తీసుకుందా? 2025 IPLలో మ్యాచ్​ల పెంపు లేనట్లేనా? - IPL 2025

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

IPL 2025 Match Count : ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్! వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్​లో మ్యాచ్​ల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

IPL 2025
IPL 2025 (Source : Getty Images)

IPL 2025 Match Count : భారత్‌లో ఐపీఎల్‌‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈ డొమెస్టిక్ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే 2025 ఐపీఎల్​ గురించి ఈ మధ్య రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా వేలంపై బీసీసీఐ రూల్స్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా 2025 ఐపీఎల్​ టోర్నమెంట్​లో ఎన్ని మ్యాచ్​లు ఉంటాయనే దానిపై అప్డేట్ వచ్చింది.

ఈ సారి కూడా 74 మ్యాచ్ లే!
2023 - 27 ఐపీఎల్ సీజన్ వరకు బీసీసీఐ మీడియా హక్కులను విక్రయించింది. ఈ క్రమంలో 2023, 2024లో ఒక్కొ సీజన్​లో 74 మ్యాచ్​లు, 2025, 2026లో 84 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు గతంలో వెల్లడించింది. 2027లో ఏకంగా 94 మ్యాచ్​ ఆడించనున్నట్లు తెలిపింది. కానీ, వచ్చే ఏడాది అంటే 2025 ఐపీఎల్ లో 84 మ్యాచ్‌ లకు బదులు 74 మ్యాచ్‌లే ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఎందుకంటే?
అయితే వచ్చే ఏడాది జూన్​లో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీలో భారత్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చేందుకే ఐపీఎల్ 2025 సీజన్​లో మ్యాచ్​లు పెంచకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2023, 2024 ఐపీఎల్ మాదిరిగా ఈసారి కూడా 74 మ్యాచ్‌లు ఉంటాయని సమాచారం. ఈ అప్డేట్ ఐపీఎల్ అభిమానులను నిరాశపరిచినా, ఆటగాళ్లకు మాత్రం ఊరటనిచ్చే విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్ ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు కొంత సమయం దొరుకుతుంది.

జైషా కీలక వ్యాఖ్యలు!
గతంలో 2025 ఐపీఎల్ సీజన్ మ్యాచ్ లపై బీసీసీఐ సెక్రటరీ జైషా మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఐపీఎల్ 2025 సీజన్​లో 84 మ్యాచ్‌లు నిర్వహించాలని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఎక్కువ మ్యాచ్​ల కారణంగా ఆటగాళ్లపై భారం పడుతుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో 84 మ్యాచ్‌లు నిర్వహించాలని కాంట్రాక్ట్‌లో భాగమే. అయితే 74 లేదా 84 మ్యాచ్‌లు నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయిస్తుంది' అని జైషా వ్యాఖ్యానించారు.

కేకేఆర్​కు కొత్త మెంటార్​ - గంభీర్ స్థానంలో ఎవరొచ్చారంటే? - IPL 2025 KKR MENTOR

నో RTM కార్డ్- 5గురు ప్లేయర్ల రిటెన్షన్- మెగా వేలం కొత్త రూల్స్ ఇవే! - IPL 2025 Auction Rules

IPL 2025 Match Count : భారత్‌లో ఐపీఎల్‌‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈ డొమెస్టిక్ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే 2025 ఐపీఎల్​ గురించి ఈ మధ్య రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా వేలంపై బీసీసీఐ రూల్స్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా 2025 ఐపీఎల్​ టోర్నమెంట్​లో ఎన్ని మ్యాచ్​లు ఉంటాయనే దానిపై అప్డేట్ వచ్చింది.

ఈ సారి కూడా 74 మ్యాచ్ లే!
2023 - 27 ఐపీఎల్ సీజన్ వరకు బీసీసీఐ మీడియా హక్కులను విక్రయించింది. ఈ క్రమంలో 2023, 2024లో ఒక్కొ సీజన్​లో 74 మ్యాచ్​లు, 2025, 2026లో 84 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు గతంలో వెల్లడించింది. 2027లో ఏకంగా 94 మ్యాచ్​ ఆడించనున్నట్లు తెలిపింది. కానీ, వచ్చే ఏడాది అంటే 2025 ఐపీఎల్ లో 84 మ్యాచ్‌ లకు బదులు 74 మ్యాచ్‌లే ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఎందుకంటే?
అయితే వచ్చే ఏడాది జూన్​లో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీలో భారత్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చేందుకే ఐపీఎల్ 2025 సీజన్​లో మ్యాచ్​లు పెంచకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2023, 2024 ఐపీఎల్ మాదిరిగా ఈసారి కూడా 74 మ్యాచ్‌లు ఉంటాయని సమాచారం. ఈ అప్డేట్ ఐపీఎల్ అభిమానులను నిరాశపరిచినా, ఆటగాళ్లకు మాత్రం ఊరటనిచ్చే విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్ ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు కొంత సమయం దొరుకుతుంది.

జైషా కీలక వ్యాఖ్యలు!
గతంలో 2025 ఐపీఎల్ సీజన్ మ్యాచ్ లపై బీసీసీఐ సెక్రటరీ జైషా మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఐపీఎల్ 2025 సీజన్​లో 84 మ్యాచ్‌లు నిర్వహించాలని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఎక్కువ మ్యాచ్​ల కారణంగా ఆటగాళ్లపై భారం పడుతుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో 84 మ్యాచ్‌లు నిర్వహించాలని కాంట్రాక్ట్‌లో భాగమే. అయితే 74 లేదా 84 మ్యాచ్‌లు నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయిస్తుంది' అని జైషా వ్యాఖ్యానించారు.

కేకేఆర్​కు కొత్త మెంటార్​ - గంభీర్ స్థానంలో ఎవరొచ్చారంటే? - IPL 2025 KKR MENTOR

నో RTM కార్డ్- 5గురు ప్లేయర్ల రిటెన్షన్- మెగా వేలం కొత్త రూల్స్ ఇవే! - IPL 2025 Auction Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.