ETV Bharat / sports

మరోసారి వరుణుడి 'బ్రేక్​' - 2 గంటలకు చెకింగ్ తర్వాతనే మ్యాచ్! - INDIA VS BANGLADESH 2ND TEST

author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

India Vs Bangladesh 2nd Test Day 3 : వర్షం కారణంగా భారత్ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు మరోసారి బ్రేక్ పడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఓ సారి పరీక్షించగా, అక్కడక్కడ మైదానం సిద్ధంగా లేకపోవడం వల్ల ఈ ఆటను మళ్లీ వాయిదా వేశారు. అయితే ఇప్పుడు రెండు గంటలకు మరోసారి ఇన్​స్పెక్షన్ జరగనున్నట్లు తెలుస్తోంది.

India Vs Bangladesh 2nd Test Day 3
India Vs Bangladesh 2nd Test Day 3 (IANS)

India Vs Bangladesh 2nd Test Day 3 : వర్షం కారణంగా భారత్ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు మరోసారి బ్రేక్ పడింది. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట కొనసాగగా, రెండో రోజు మాత్రం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైంది. ఇక మూడో రోజు కూడా అనుకూల పరిస్థితులు కనిపిచట్లేదని తెలుస్తోంది. ఉదయం నుంచి వర్షం లేకపోయినా కూడా మైదానం చిత్తడిగా ఉండటం వల్ల మ్యాచ్‌ నిర్వహణకు అనుకూలంగా లేదని అంపైర్ల భావన.

ఆదివారం ఉదయం 10 గంటలకు ఓ సారి పరీక్షించగా, అక్కడక్కడ మైదానం సిద్ధంగా లేకపోవడం వల్ల ఈ ఆటను మళ్లీ వాయిదా వేశారు. ఇప్పుడు 12 గంటలకు మరోసారి పిచ్‌, మైదానాన్ని పరిశీలించి ఆ తర్వాత ఆట నిర్వహణ గురించి ఓ నిర్ణయానికొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలించగా, అప్పుడు కూడా మైదానం తడిగా ఉండటం వల్ల మ్యాచ్‌ను మరికొంత సమయం వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి పరిశీలించి ఆట ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు.

టెస్ట్ రద్దైతే భారత్​కు ఇబ్బందా?
ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 107/3 స్కోరుతో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్​ను టీమ్ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్​కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి. మరి టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్​లు ఎలా ఉన్నాయి? తర్వాత భారత్ ఎన్ని మ్యాచ్​లు నెగ్గాలి? ఇప్పుడు చూద్దాం.

2023- 25 డబ్ల్యూటీసీ సైకిల్​లో భారత్ ఇప్పటివరకు 10 మ్యాచ్​ల్లో ఏడింట్లో నెగ్గి, 2 టెస్టుల్లో ఓడింది. మరోకటి డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 71.67 శాతం (86 పాయింట్లు) తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 12మ్యాచ్​ల్లో 8 విజయాలు నమోదు చేసి 62.50 శాతం (90 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుత బంగ్లా సిరీస్​ తర్వాత 2025 డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అందులో 3 మ్యాచ్​లు న్యూజిలాండ్​తో, 5 మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే బంగ్లా సిరీస్​ను భారత్ 2-0తో కైవసం చేసుకున్నట్లైతే, మిగిలిన 8 టెస్టు​ల్లో భారత్ కనీసం 3 మ్యాచ్​లు నెగ్గినా ఫైనల్​కు అర్హత సాధిస్తుంది.

అదే భారత్ - బంగ్లా టెస్టు డ్రా గా ముగిస్తే, 1-0తో సిరీస్ నెగ్గుతుంది. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్​కు చేరాలంటే టీమ్ఇండియా తన తర్వాతి 8 టెస్టుల్లో 5 మ్యాచ్​లు నెగ్గాల్సి ఉంటుంది. స్వదేశంలో కివీస్​తో 3, ఆస్ట్రేలియాపై కనీసం 2 మ్యాచ్​ల్లో విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక (50 పాయింట్ల శాతం), న్యూజిలాండ్ (42.86 శాతం) తమ తదుపరి మ్యాచ్​ల ఫలితాలపై కూడా భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రత్యర్థి బ్యాటర్​ ఎత్తుపై పంత్​ సెటైర్లు - కామెంట్రీలో గవాస్కర్ నవ్వులు! - Rishabh Pant Mocks Mominul Haques

15ఏళ్ల 'విరాట్' ఫ్యాన్ 58కి.మీ సైకిల్​ జర్నీ- 8గంటల్లోనే స్టేడియానికి రీచ్​ అయ్యి! - Virat Kohli Child Fan

India Vs Bangladesh 2nd Test Day 3 : వర్షం కారణంగా భారత్ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు మరోసారి బ్రేక్ పడింది. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట కొనసాగగా, రెండో రోజు మాత్రం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైంది. ఇక మూడో రోజు కూడా అనుకూల పరిస్థితులు కనిపిచట్లేదని తెలుస్తోంది. ఉదయం నుంచి వర్షం లేకపోయినా కూడా మైదానం చిత్తడిగా ఉండటం వల్ల మ్యాచ్‌ నిర్వహణకు అనుకూలంగా లేదని అంపైర్ల భావన.

ఆదివారం ఉదయం 10 గంటలకు ఓ సారి పరీక్షించగా, అక్కడక్కడ మైదానం సిద్ధంగా లేకపోవడం వల్ల ఈ ఆటను మళ్లీ వాయిదా వేశారు. ఇప్పుడు 12 గంటలకు మరోసారి పిచ్‌, మైదానాన్ని పరిశీలించి ఆ తర్వాత ఆట నిర్వహణ గురించి ఓ నిర్ణయానికొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలించగా, అప్పుడు కూడా మైదానం తడిగా ఉండటం వల్ల మ్యాచ్‌ను మరికొంత సమయం వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి పరిశీలించి ఆట ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు.

టెస్ట్ రద్దైతే భారత్​కు ఇబ్బందా?
ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 107/3 స్కోరుతో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్​ను టీమ్ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్​కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి. మరి టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్​లు ఎలా ఉన్నాయి? తర్వాత భారత్ ఎన్ని మ్యాచ్​లు నెగ్గాలి? ఇప్పుడు చూద్దాం.

2023- 25 డబ్ల్యూటీసీ సైకిల్​లో భారత్ ఇప్పటివరకు 10 మ్యాచ్​ల్లో ఏడింట్లో నెగ్గి, 2 టెస్టుల్లో ఓడింది. మరోకటి డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 71.67 శాతం (86 పాయింట్లు) తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 12మ్యాచ్​ల్లో 8 విజయాలు నమోదు చేసి 62.50 శాతం (90 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుత బంగ్లా సిరీస్​ తర్వాత 2025 డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అందులో 3 మ్యాచ్​లు న్యూజిలాండ్​తో, 5 మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే బంగ్లా సిరీస్​ను భారత్ 2-0తో కైవసం చేసుకున్నట్లైతే, మిగిలిన 8 టెస్టు​ల్లో భారత్ కనీసం 3 మ్యాచ్​లు నెగ్గినా ఫైనల్​కు అర్హత సాధిస్తుంది.

అదే భారత్ - బంగ్లా టెస్టు డ్రా గా ముగిస్తే, 1-0తో సిరీస్ నెగ్గుతుంది. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్​కు చేరాలంటే టీమ్ఇండియా తన తర్వాతి 8 టెస్టుల్లో 5 మ్యాచ్​లు నెగ్గాల్సి ఉంటుంది. స్వదేశంలో కివీస్​తో 3, ఆస్ట్రేలియాపై కనీసం 2 మ్యాచ్​ల్లో విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక (50 పాయింట్ల శాతం), న్యూజిలాండ్ (42.86 శాతం) తమ తదుపరి మ్యాచ్​ల ఫలితాలపై కూడా భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రత్యర్థి బ్యాటర్​ ఎత్తుపై పంత్​ సెటైర్లు - కామెంట్రీలో గవాస్కర్ నవ్వులు! - Rishabh Pant Mocks Mominul Haques

15ఏళ్ల 'విరాట్' ఫ్యాన్ 58కి.మీ సైకిల్​ జర్నీ- 8గంటల్లోనే స్టేడియానికి రీచ్​ అయ్యి! - Virat Kohli Child Fan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.