ETV Bharat / sports

రెండో రోజూ భారత్​దే జోరు- టీమ్ఇండియా లీడ్ ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 5:21 PM IST

Updated : Jan 26, 2024, 5:43 PM IST

Ind vs Eng 1st Test: ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో భారత్ రెండో రోజూ జోరు ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 175 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ind vs eng
ind vs eng

Ind vs Eng 1st Test: భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 421/7 (110 ఓవర్ల)తో నిలిచి, 175 పరుగల లీడ్​లో కొనసాగుతోంది. రవీంద్ర జడేజా (81 పరుగులు), అక్షర్ పటేల్ (35 పరుగులు) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ (86 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, శ్రీకర్ భరత్ (41 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (35) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2, జో రూట్ 2, జాక్ లీచ్, రెహన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఓవర్​నైట్ స్కోర్ 119-2తో గేమ్ ప్రారంభించిన టీమ్ఇండియా రెండో రోజు ఐదు వికెట్లు కోల్పోయి 302 పరుగులు జోడించింది. ఇక తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్​నైట్ వ్యక్తిగత స్కోర్ 76తో​ రెండో రోజు ఆట ప్రారంభించిన జైశ్వాల్ తొలి ఓవర్​ 4 బంతికే ఔటయ్యాడు. కాసేపటికే శుభ్​మన్ గిల్ (23) కూడా పెవిలియన్​కు చేరాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్- రాహుల్ 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అయ్యర్ క్యాచౌట్​గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో రాహుల్​ కెరీర్​లో 14వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న రాహుల్​ను టామ్ హార్ట్లీ వెనక్కిపంపాడు.

జడేజా అదుర్స్: ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్​తో కలిసి 68 పరుగులు పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు. భరత్ 41 పరుగులతో రాణించాడు. అతడిని జో రూట్ ఎల్​బీడబ్ల్యూ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ (1) రనౌట్​ అయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న జడేజా, అక్షర్ పటేల్​తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. 155 బంతుల్లో 81 పరుగులు చేసిన జడేజా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. మరోవైపు అక్షర్ (35) చక్కని సహకారం అందిస్తున్నాడు. రెండో రోజు చివరి మూడు బంతులను అక్షర్ 4,6,4గా మలిచి అద్భుతంగా ముగించాడు.

ఉప్పల్​లో తిప్పేస్తున్న భారత స్పిన్నర్లు- రోహిత్, సిరాజ్ సూపర్ క్యాచ్​

అశ్విన్ - జడేజా : టెస్టుల్లో ఆల్​ టైమ్ రికార్డ్​

Ind vs Eng 1st Test: భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 421/7 (110 ఓవర్ల)తో నిలిచి, 175 పరుగల లీడ్​లో కొనసాగుతోంది. రవీంద్ర జడేజా (81 పరుగులు), అక్షర్ పటేల్ (35 పరుగులు) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ (86 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, శ్రీకర్ భరత్ (41 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (35) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2, జో రూట్ 2, జాక్ లీచ్, రెహన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఓవర్​నైట్ స్కోర్ 119-2తో గేమ్ ప్రారంభించిన టీమ్ఇండియా రెండో రోజు ఐదు వికెట్లు కోల్పోయి 302 పరుగులు జోడించింది. ఇక తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్​నైట్ వ్యక్తిగత స్కోర్ 76తో​ రెండో రోజు ఆట ప్రారంభించిన జైశ్వాల్ తొలి ఓవర్​ 4 బంతికే ఔటయ్యాడు. కాసేపటికే శుభ్​మన్ గిల్ (23) కూడా పెవిలియన్​కు చేరాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్- రాహుల్ 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అయ్యర్ క్యాచౌట్​గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో రాహుల్​ కెరీర్​లో 14వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న రాహుల్​ను టామ్ హార్ట్లీ వెనక్కిపంపాడు.

జడేజా అదుర్స్: ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్​తో కలిసి 68 పరుగులు పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు. భరత్ 41 పరుగులతో రాణించాడు. అతడిని జో రూట్ ఎల్​బీడబ్ల్యూ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ (1) రనౌట్​ అయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న జడేజా, అక్షర్ పటేల్​తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. 155 బంతుల్లో 81 పరుగులు చేసిన జడేజా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. మరోవైపు అక్షర్ (35) చక్కని సహకారం అందిస్తున్నాడు. రెండో రోజు చివరి మూడు బంతులను అక్షర్ 4,6,4గా మలిచి అద్భుతంగా ముగించాడు.

ఉప్పల్​లో తిప్పేస్తున్న భారత స్పిన్నర్లు- రోహిత్, సిరాజ్ సూపర్ క్యాచ్​

అశ్విన్ - జడేజా : టెస్టుల్లో ఆల్​ టైమ్ రికార్డ్​

Last Updated : Jan 26, 2024, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.