ETV Bharat / sports

'టీ20 ఫైనల్​లోనూ భారత్- ఆస్ట్రేలియా జట్లే తలపడాలి'! - T20 World cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 8:50 PM IST

T20 World cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా- భారత్ ఢీ కొంటాయా? రెండు ఐసీసీ ట్రోఫీలు కోల్పోయినా ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

T20 World cup 2024
T20 World cup 2024 (Source: Associated Press)

T20 World cup 2024: 2024 టీ20 వరల్డ్‌ కప్‌లో 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా? ఐసీసీ ఈవెంట్​ ఆస్ట్రేలియా- భారత్ మళ్లీ ఫైనల్లో ఢీకొంటాయా? ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ మాత్రం అదే జరగాలని కోరుకుంటున్నాడు. రెండు టీమ్‌లు సూపర్‌- 8 స్టేజ్‌ని దాటి మళ్లీ ఐసీసీ ట్రీఫీ కోసం తలపడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ), 2023 వన్డే వరల్డ్‌కప్‌ రెండు ఐసీసీ ఈవెంట్స్‌ ఫైనల్స్‌లో భారత్‌ ఓడిపోయింది. రెండుసార్లు ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడం గమనార్హం. తాజాగా బ్రాడ్ హాగ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ఈ సెషన్​లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. 'సూపర్ 8లో ఆస్ట్రేలియా, భారత్​, బంగ్లాదేశ్ (ఇంకా అర్హత సాధించలేదు), ఆఫ్గానిస్థాన్‌ తలపడుతాయి. ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసీస్‌, భారత్‌ సెమీ-ఫైనల్‌కు వెళ్లాలని ఆశిస్తున్నాను. గ్రాండ్‌ ఫైనల్లో మళ్లీ ఆస్ట్రేలియా- భారత్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది జరగాలని నేను కచ్చితంగా కోరుకుంటున్నాను' అన్నాడు.

భారత్‌- ఆసీస్‌ ఫైనల్‌ ఎలా చేరుతాయి?
సూపర్‌- 8కి చేరిన టీమ్‌లు గ్రూప్ 1, గ్రూప్‌ 2గా విడిపోతాయి. రెండు గ్రూపుల్లో టాప్‌ 2 పొజిషన్స్‌లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కి చేరుతాయి. సెమీఫైనల్‌ 1లో గ్రూప్‌ 1లో మొదటి జట్టు, గ్రూప్‌ 2లో రెండో స్థానంలో ఉన్న జట్టు ఆడుతాయి. సెమీఫైనల్‌ 2లో గ్రూప్‌ 2లోని మొదటి జట్టు, గ్రూప్‌ 1లోని రెండో జట్టు ఆడుతాయి. గ్రూప్‌ 1లో భారత్, ఆసీస్‌, ఆఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. నాలుగో టీమ్‌ ఇంకా డిక్లేర్ కావాల్సి ఉంది.

సూపర్- 8 ఫైట్​: జూన్ 24న సెయింట్ లూసియాలో జరిగే సూపర్ 8 స్టేజ్‌లో భారత్‌- ఆసీస్‌ ఢీ కొట్టనున్నాయి. గ్రూప్ 1లో మొదటి రెండు స్థానాల్లో ఆసీస్‌, భారత్ ఉంటే, రెండూ సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌ చేరుతాయి.

సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్! 'సూపర్ 8లో భారత్​తో జరిగే తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ ఫేవరెట్‌. ఎందుకంటే వారు వెస్టిండీస్‌లో ఆడారు. అక్కడ పిచ్‌ స్లోగా ఉంది. అదే భారత్‌ సీమ్‌ మూమెంట్‌ ఉన్న న్యూయార్క్‌లో మ్యాచ్‌లు ఆడింది. అక్కడ బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడ్డారు. అలానే చాలా ఫ్లాట్ వికెట్లపై ఆడిన ఐపీఎల్‌ అనుభవంతో వస్తున్నారు. సూపర్‌ 8లో ఆసీస్‌కి పరిస్థతులు అనుకూలంగా ఉన్నాయి’ అని బ్రాడ్‌ హాగ్‌ తెలిపాడు. ఫైనల్లో మాత్రం రెండు టీమ్‌లకు సమాన అవకాశాలు ఉంటాయని, అప్పటికి భారత్ కూడా వెస్టిండీస్‌ కండిషన్స్‌కి అలవాటు పడుతుందని చెప్పాడు.

ఇంట్రెస్టింగ్​గా సూపర్ 8 ఫైట్- 5 జట్లకు లైన్ క్లియర్​- మిగిలిన బెర్త్​లు ఎవరికో? - T20 WORLD CUP 2024

ప్ర‌పంచ‌క‌ప్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి రానున్న ఆ ఇద్ద‌రు ప్లేయర్స్​! - T20 Worldcup 2024

T20 World cup 2024: 2024 టీ20 వరల్డ్‌ కప్‌లో 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా? ఐసీసీ ఈవెంట్​ ఆస్ట్రేలియా- భారత్ మళ్లీ ఫైనల్లో ఢీకొంటాయా? ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ మాత్రం అదే జరగాలని కోరుకుంటున్నాడు. రెండు టీమ్‌లు సూపర్‌- 8 స్టేజ్‌ని దాటి మళ్లీ ఐసీసీ ట్రీఫీ కోసం తలపడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ), 2023 వన్డే వరల్డ్‌కప్‌ రెండు ఐసీసీ ఈవెంట్స్‌ ఫైనల్స్‌లో భారత్‌ ఓడిపోయింది. రెండుసార్లు ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడం గమనార్హం. తాజాగా బ్రాడ్ హాగ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ఈ సెషన్​లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. 'సూపర్ 8లో ఆస్ట్రేలియా, భారత్​, బంగ్లాదేశ్ (ఇంకా అర్హత సాధించలేదు), ఆఫ్గానిస్థాన్‌ తలపడుతాయి. ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసీస్‌, భారత్‌ సెమీ-ఫైనల్‌కు వెళ్లాలని ఆశిస్తున్నాను. గ్రాండ్‌ ఫైనల్లో మళ్లీ ఆస్ట్రేలియా- భారత్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది జరగాలని నేను కచ్చితంగా కోరుకుంటున్నాను' అన్నాడు.

భారత్‌- ఆసీస్‌ ఫైనల్‌ ఎలా చేరుతాయి?
సూపర్‌- 8కి చేరిన టీమ్‌లు గ్రూప్ 1, గ్రూప్‌ 2గా విడిపోతాయి. రెండు గ్రూపుల్లో టాప్‌ 2 పొజిషన్స్‌లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కి చేరుతాయి. సెమీఫైనల్‌ 1లో గ్రూప్‌ 1లో మొదటి జట్టు, గ్రూప్‌ 2లో రెండో స్థానంలో ఉన్న జట్టు ఆడుతాయి. సెమీఫైనల్‌ 2లో గ్రూప్‌ 2లోని మొదటి జట్టు, గ్రూప్‌ 1లోని రెండో జట్టు ఆడుతాయి. గ్రూప్‌ 1లో భారత్, ఆసీస్‌, ఆఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. నాలుగో టీమ్‌ ఇంకా డిక్లేర్ కావాల్సి ఉంది.

సూపర్- 8 ఫైట్​: జూన్ 24న సెయింట్ లూసియాలో జరిగే సూపర్ 8 స్టేజ్‌లో భారత్‌- ఆసీస్‌ ఢీ కొట్టనున్నాయి. గ్రూప్ 1లో మొదటి రెండు స్థానాల్లో ఆసీస్‌, భారత్ ఉంటే, రెండూ సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌ చేరుతాయి.

సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్! 'సూపర్ 8లో భారత్​తో జరిగే తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ ఫేవరెట్‌. ఎందుకంటే వారు వెస్టిండీస్‌లో ఆడారు. అక్కడ పిచ్‌ స్లోగా ఉంది. అదే భారత్‌ సీమ్‌ మూమెంట్‌ ఉన్న న్యూయార్క్‌లో మ్యాచ్‌లు ఆడింది. అక్కడ బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడ్డారు. అలానే చాలా ఫ్లాట్ వికెట్లపై ఆడిన ఐపీఎల్‌ అనుభవంతో వస్తున్నారు. సూపర్‌ 8లో ఆసీస్‌కి పరిస్థతులు అనుకూలంగా ఉన్నాయి’ అని బ్రాడ్‌ హాగ్‌ తెలిపాడు. ఫైనల్లో మాత్రం రెండు టీమ్‌లకు సమాన అవకాశాలు ఉంటాయని, అప్పటికి భారత్ కూడా వెస్టిండీస్‌ కండిషన్స్‌కి అలవాటు పడుతుందని చెప్పాడు.

ఇంట్రెస్టింగ్​గా సూపర్ 8 ఫైట్- 5 జట్లకు లైన్ క్లియర్​- మిగిలిన బెర్త్​లు ఎవరికో? - T20 WORLD CUP 2024

ప్ర‌పంచ‌క‌ప్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి రానున్న ఆ ఇద్ద‌రు ప్లేయర్స్​! - T20 Worldcup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.