ETV Bharat / politics

జగన్ చెవిలో రఘురామకృష్ణ గుసగుసలు - ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ - ys jagan raghu rama conversation

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 2:22 PM IST

YS Jagan and Raghu Rama Conversation: ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్, ఉండి ఎమ్మెల్యే రఘురామ మధ్య సంభాషణ జరిగింది. దీంతో జగన్‌, రఘురామ ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే రఘు రామ కృష్ణరాజు జగన్ వద్దకు వెళ్లి పలకరించారు.

YS Jagan and Raghu Rama Conversation
YS Jagan and Raghu Rama Conversation (ETV Bharat)

YS Jagan And Raghu Rama Conversation: ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ జరిగింది. అసెంబ్లీ హాల్​లో జగన్ తన భుజంపై 2 సార్లు చేయి వేసి మాట్లాడారని ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అన్నారు. కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలకరించారని తెలిపారు.

రోజూ అసెంబ్లీకి రావాలని ఆయన్ని కోరానని రఘురామ తెలిపారు. రెగ్యులర్​గా వస్తాను, మీరే చూస్తారుగా అని జగన్ చెప్పారని అన్నారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్​ను రఘురామ కృష్ణ రాజు కోరారు. తప్పని సరిగా అంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ లాబీలోకి నవ్వుకుంటూ వెళ్లారు. ఈ మేరకు జగన్​తో జరిగిన సంభాషణ వివరాలను రఘురామ కృష్ణంరాజు మీడియాతో పంచుకున్నారు.

కాగా తనను హత్య చేయించబోయారంటూ ఇటీవలే జగన్​పై రఘురామ కృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, జగన్‌ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామకృష్ణ అరెస్ట్‌ తదితర పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత కూడా రఘురామ వెనక్కి తగ్గలేదు.

చంద్రబాబు విజనరీ నాయకుడు - ఏపీ అభివృద్ధికి తీవ్రంగా కృషిచేశారు: గవర్నర్ - Governor Speech in AP Assembly

YS Jagan And Raghu Rama Conversation: ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ జరిగింది. అసెంబ్లీ హాల్​లో జగన్ తన భుజంపై 2 సార్లు చేయి వేసి మాట్లాడారని ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అన్నారు. కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలకరించారని తెలిపారు.

రోజూ అసెంబ్లీకి రావాలని ఆయన్ని కోరానని రఘురామ తెలిపారు. రెగ్యులర్​గా వస్తాను, మీరే చూస్తారుగా అని జగన్ చెప్పారని అన్నారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్​ను రఘురామ కృష్ణ రాజు కోరారు. తప్పని సరిగా అంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ లాబీలోకి నవ్వుకుంటూ వెళ్లారు. ఈ మేరకు జగన్​తో జరిగిన సంభాషణ వివరాలను రఘురామ కృష్ణంరాజు మీడియాతో పంచుకున్నారు.

కాగా తనను హత్య చేయించబోయారంటూ ఇటీవలే జగన్​పై రఘురామ కృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, జగన్‌ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామకృష్ణ అరెస్ట్‌ తదితర పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత కూడా రఘురామ వెనక్కి తగ్గలేదు.

చంద్రబాబు విజనరీ నాయకుడు - ఏపీ అభివృద్ధికి తీవ్రంగా కృషిచేశారు: గవర్నర్ - Governor Speech in AP Assembly

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.