ETV Bharat / politics

ఈసారి రేవంత్ లెక్క తప్పింది - మరి ఎక్కడ తేడా కొట్టింది? - ఓడిన స్థానాలపై కాంగ్రెస్ అంతర్మథనం - CONGRESS ANALYSIS ON LOST SEATS IN LOK SABHA

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 7:03 AM IST

Telangana Congress Political Analysis on Result : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో స్వయంకృతాపరాధం, బీజేపీకి బీఆర్ఎస్ సహరించడం వల్లే 8స్థానాలకు పరిమితమయ్యామనే భావన రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. మెదక్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ అభ్యర్ధుల ఎంపికలో తప్పిదం వల్ల, రెండంకెల సీట్లు సాధించలేకపోయాయని నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, కొందరు మంత్రులు అధిష్ఠానంపై తెచ్చిన ఒత్తిడి ప్రతికూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు. కమలం పార్టీ ఎత్తుగడలను సీఎం రేవంత్‌రెడ్డి దీటుగా తిప్పికొట్టడం వల్లే, ఈ 8 స్థానాలైనా గెలిచామని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

Telangana Congress Political Analysis on Result
Congress Analysis of Lost Seats in Parliament Elections (ETV Bharat)
లెక్క తప్పింది, ఎక్కడ తేడా కొట్టింది? - ఓటమి స్థానాలపై కాంగ్రెస్ అంతర్మథనం (ETV Bharat)

Congress Analysis of Lost Seats in Parliament Elections : రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో పోరాడింది. ఫలితాల్లో మాత్రం 8స్థానాలకే పరిమితమైంది. 14 స్థానాలు దక్కలేదనే అంతర్మథనం కాంగ్రెస్‌లో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందా? కొందరు మంత్రులు పూర్తి స్థాయిలో పని చేయలేదా? భారతీయ జనతా పార్టీకి బీఆర్​ఎస్ లోపాయికారీగా సహకరించిందా? అని ఆ పార్టీ నేతలు కారణాలను విశ్లేషిస్తున్నారు.

అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం : లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదనే భావన రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. బలమైన నాయకులు లేక, ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. కరీంనగర్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌ నియోజకవర్గాల అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది.

బీఆర్​ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను, సికింద్రాబాద్‌ బరిలో దించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ కోరడం, ఇందుకు దానం ససేమిరా అనడంతో ప్రచారంలో కాలయాపన జరిగింది. పోటీ చేయాలా? వద్దా? అనే డైలమాలో ఉన్న దానం నాగేందర్‌ ప్రచారంలో వెనుకబడ్డారని భావిస్తున్నారు.

Telangana Congress Strategy on Parliament Election : మల్కాజిగిరి అభ్యర్ధిగా వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ సునీతా మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ బరిలోకి దించింది. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, హస్తం పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. బీజేపీ నుంచి రాష్ట్ర స్థాయిలో పేరున్న ఈటల రాజేందర్‌ ప్రత్యర్థిగా ఉండటంతో బలంగా ఎదర్కొనలేకపోయామని కాంగ్రెస్‌ భావిస్తోంది. సునీతా మహేందర్‌రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయించి ఉంటే, అక్కడ సునాయాసంగా గెలిచి ఉండేవాళ్లమని విశ్లేషిస్తున్నారు.

చేవెళ్లలో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో నిలిచి, కమలం అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో హోరాహోరీ తలబడ్డారు. చివరి నిమిషంలో బీఆర్​ఎస్ నుంచి వచ్చిన రంజిత్‌రెడ్డి, గెలుపు వాకిట తడబడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ పట్టుబట్టి, మెదక్‌ టిక్కెట్‌ నీలం మధుకు ఇప్పించారు. త్రికోణ పోరులో మెదక్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ చేజార్చుకోవాల్సి వచ్చింది.

సీఎం 12సార్లు ప్రచారానికి వెళ్లినా, ఫలించని ఫలితం : మహబూబ్‌నగర్‌ అభ్యర్ధి చల్లా వంశీచంద్‌రెడ్డి స్థానికంగా ఉండరని బీజేపీ చేసిన ప్రచారం ప్రతికూలంగా మారింది. డీకే అరుణ జిల్లాలో పేరున్న నాయకులు కావడంతో, హోరాహోరీ తలపడినా ఓటమి తప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డి 12సార్లు ప్రచారానికి వెళ్లినా, మహబూబ్‌నగర్‌లో విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది.

కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎంపికలో స్థానిక మంత్రి ఒత్తిడితో, ప్రవీణ్‌రెడ్డికి కాకుండా వెలిచాల రాజేందర్‌రావుకు టికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలం సిట్టింగ్‌ అభ్యర్థి బండి సంజయ్‌ రాష్ట్రస్థాయి నాయకుడు కావడం, తమ అభ్యర్ధి బలంగా పోటీనివ్వకపోవడంతో ఓటమిపాలైనట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బరిలోకి దించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన జీవన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం ప్రతికూలంగా మారిందనే భావన నెలకొంది. సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఎత్తుగడలు, బీజేపీ వేవ్‌ పని చేశాయని విశ్లేషిస్తున్నారు.

Telangana Lok Sabha Result 2024 : హిందుత్వం, అయోధ్యలో రామమందిరం వంటి అంశాల వల్ల బీజేపీ లబ్ధి పొంది, 8స్థానాల్లో గెలిచిందని, బీఆర్​ఎస్ కూడా లోపాయికారీగా సహకరించిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రిజర్వేషన్లు రద్దుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలు, పార్టీకి లబ్ధి చేకూర్చాయని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి ఎదురుదాడి చేయడం వల్లే ఎనిమిది స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్​ జయకేతనం - 8 స్థానాల్లో విజయదుందుభి - TELANGANA LOK SABHA ELECTION RESULTS 2024

కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 సీట్లు - 'ఎంఐఎం'దే హైదరాబాద్ - తెలంగాణలో గెలిచిన ఎంపీ అభ్యర్థులు వీరే - MP Elections Results

లెక్క తప్పింది, ఎక్కడ తేడా కొట్టింది? - ఓటమి స్థానాలపై కాంగ్రెస్ అంతర్మథనం (ETV Bharat)

Congress Analysis of Lost Seats in Parliament Elections : రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో పోరాడింది. ఫలితాల్లో మాత్రం 8స్థానాలకే పరిమితమైంది. 14 స్థానాలు దక్కలేదనే అంతర్మథనం కాంగ్రెస్‌లో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందా? కొందరు మంత్రులు పూర్తి స్థాయిలో పని చేయలేదా? భారతీయ జనతా పార్టీకి బీఆర్​ఎస్ లోపాయికారీగా సహకరించిందా? అని ఆ పార్టీ నేతలు కారణాలను విశ్లేషిస్తున్నారు.

అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం : లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదనే భావన రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. బలమైన నాయకులు లేక, ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. కరీంనగర్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌ నియోజకవర్గాల అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది.

బీఆర్​ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను, సికింద్రాబాద్‌ బరిలో దించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ కోరడం, ఇందుకు దానం ససేమిరా అనడంతో ప్రచారంలో కాలయాపన జరిగింది. పోటీ చేయాలా? వద్దా? అనే డైలమాలో ఉన్న దానం నాగేందర్‌ ప్రచారంలో వెనుకబడ్డారని భావిస్తున్నారు.

Telangana Congress Strategy on Parliament Election : మల్కాజిగిరి అభ్యర్ధిగా వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ సునీతా మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ బరిలోకి దించింది. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, హస్తం పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. బీజేపీ నుంచి రాష్ట్ర స్థాయిలో పేరున్న ఈటల రాజేందర్‌ ప్రత్యర్థిగా ఉండటంతో బలంగా ఎదర్కొనలేకపోయామని కాంగ్రెస్‌ భావిస్తోంది. సునీతా మహేందర్‌రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయించి ఉంటే, అక్కడ సునాయాసంగా గెలిచి ఉండేవాళ్లమని విశ్లేషిస్తున్నారు.

చేవెళ్లలో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో నిలిచి, కమలం అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో హోరాహోరీ తలబడ్డారు. చివరి నిమిషంలో బీఆర్​ఎస్ నుంచి వచ్చిన రంజిత్‌రెడ్డి, గెలుపు వాకిట తడబడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ పట్టుబట్టి, మెదక్‌ టిక్కెట్‌ నీలం మధుకు ఇప్పించారు. త్రికోణ పోరులో మెదక్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ చేజార్చుకోవాల్సి వచ్చింది.

సీఎం 12సార్లు ప్రచారానికి వెళ్లినా, ఫలించని ఫలితం : మహబూబ్‌నగర్‌ అభ్యర్ధి చల్లా వంశీచంద్‌రెడ్డి స్థానికంగా ఉండరని బీజేపీ చేసిన ప్రచారం ప్రతికూలంగా మారింది. డీకే అరుణ జిల్లాలో పేరున్న నాయకులు కావడంతో, హోరాహోరీ తలపడినా ఓటమి తప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డి 12సార్లు ప్రచారానికి వెళ్లినా, మహబూబ్‌నగర్‌లో విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది.

కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎంపికలో స్థానిక మంత్రి ఒత్తిడితో, ప్రవీణ్‌రెడ్డికి కాకుండా వెలిచాల రాజేందర్‌రావుకు టికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలం సిట్టింగ్‌ అభ్యర్థి బండి సంజయ్‌ రాష్ట్రస్థాయి నాయకుడు కావడం, తమ అభ్యర్ధి బలంగా పోటీనివ్వకపోవడంతో ఓటమిపాలైనట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బరిలోకి దించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన జీవన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం ప్రతికూలంగా మారిందనే భావన నెలకొంది. సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఎత్తుగడలు, బీజేపీ వేవ్‌ పని చేశాయని విశ్లేషిస్తున్నారు.

Telangana Lok Sabha Result 2024 : హిందుత్వం, అయోధ్యలో రామమందిరం వంటి అంశాల వల్ల బీజేపీ లబ్ధి పొంది, 8స్థానాల్లో గెలిచిందని, బీఆర్​ఎస్ కూడా లోపాయికారీగా సహకరించిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రిజర్వేషన్లు రద్దుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలు, పార్టీకి లబ్ధి చేకూర్చాయని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి ఎదురుదాడి చేయడం వల్లే ఎనిమిది స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్​ జయకేతనం - 8 స్థానాల్లో విజయదుందుభి - TELANGANA LOK SABHA ELECTION RESULTS 2024

కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 సీట్లు - 'ఎంఐఎం'దే హైదరాబాద్ - తెలంగాణలో గెలిచిన ఎంపీ అభ్యర్థులు వీరే - MP Elections Results

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.