ETV Bharat / politics

పాడి vs గాంధీ : 'నేడు అరెకపూడి నివాసంలో బీఆర్​ఎస్​ విస్తృతస్థాయి సమావేశం' - హాజరుకానున్న కౌశిక్​రెడ్డి - Padi Kaushik Reddy Vs Arekapudi

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 9:04 AM IST

Updated : Sep 13, 2024, 3:52 PM IST

MLA Padi Kaushik Reddy Vs Arekapudi : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ పరస్పర సవాళ్లతో చెలరేగిన ఉద్రిక్తతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సైబరాబాద్ కమిషనరేట్ వద్ద అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అర్ధరాత్రి వదిలిపెట్టారు. రాష్ట్రంలో వాతావరణం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే తాము సంయమనం పాటిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ మేడ్చల్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే గాంధీ నివాసంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.

Padi Kaushik Reddy Vs Arekapudi
Padi Kaushik Reddy Vs Arekapudi (ETV Bharat)

Padi Kaushik Reddy Vs Arekapudi : రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్​లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి, గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్​తో మొదలైన పంచాయితీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొండాపూర్​లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది.

గాంధీని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే గాంధీ, ఆయన అనుచరులపై సుమోటోగా కేసులు నమోదు చేసిన పోలీసులు, సొంత పూచీకత్తుతో గాంధీని విడుదల చేశారు.

కమిషనరేట్ ముందు బైఠాయింపు : హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తాము ఆందోళన చేస్తుంటే, గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హత్యాయత్నం కేసుతో పాటు అదనపు డీసీపీ, ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలంటూ కమిషనరేట్ ముందు బైఠాయించారు. ఎఫ్​ఐఆర్ ప్రతిని నేతలకు ఇచ్చిన పోలీసులు, వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత - స్టేషన్ బెయిల్‌పై విడుదలైన అరెకపూడి - క్షమాపణ చెప్పాలని డిమాండ్ - AREKAPUDI GANDHI VS KAUSHIK REDDY

తర్వాత వారిని పోలీసులు మూడు వాహనాల్లో వేర్వేరుగా తీసుకెళ్లారు. ఒక వాహనంలోని నేతలను కొండపల్లి పోలీస్ స్టేషన్​కు, మరో వాహనంలోని నేతలను కేశంపేట్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. వాహనాలను పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కొత్తపేట వద్ద రోడ్డుపై టైర్లు కాల్చి వేశారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వారిని చెదరగొట్టాల్సి వచ్చింది.

భారీగా చేసిన బీఆర్ఎస్ నేతలు : హరీశ్​రావు సహా ఇతర నేతలను తీసుకెళ్లిన కేశంపేట పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తగా, రాత్రి 11 గంటల తర్వాత నేతలను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి నివాసంతో పాటు సిద్దిపేట, ఖమ్మం ఘటనల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న డీజీపీ హామీ మేరకు స్టేషన్ నుంచి వెళ్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

కౌశిక్​ రెడ్డిపై కేసు : మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవి చందన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత కౌశిక్ రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, గచ్చిబౌలి డీసీపీ కార్యాలయానికి వెళ్లి గాంధీ సహా ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే గాంధీ తనపై దాడికి వచ్చారన్న కౌశిక్ రెడ్డి, శాసన సభ్యులకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు.

నేడు అరెకపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు బయల్దేరతారని, పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటారని పేర్కొంది.

'కౌశిక్‌పై దాడిని లైట్ తీస్కోం - న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తాం' - HARISH RAO ON KAUSHIK GANDHI ISSUE

నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు - రేపు బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో చూపుతాం : కౌశిక్​రెడ్డి - Kaushik Reddy on Gandhi

Padi Kaushik Reddy Vs Arekapudi : రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్​లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి, గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్​తో మొదలైన పంచాయితీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొండాపూర్​లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది.

గాంధీని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే గాంధీ, ఆయన అనుచరులపై సుమోటోగా కేసులు నమోదు చేసిన పోలీసులు, సొంత పూచీకత్తుతో గాంధీని విడుదల చేశారు.

కమిషనరేట్ ముందు బైఠాయింపు : హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తాము ఆందోళన చేస్తుంటే, గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హత్యాయత్నం కేసుతో పాటు అదనపు డీసీపీ, ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలంటూ కమిషనరేట్ ముందు బైఠాయించారు. ఎఫ్​ఐఆర్ ప్రతిని నేతలకు ఇచ్చిన పోలీసులు, వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత - స్టేషన్ బెయిల్‌పై విడుదలైన అరెకపూడి - క్షమాపణ చెప్పాలని డిమాండ్ - AREKAPUDI GANDHI VS KAUSHIK REDDY

తర్వాత వారిని పోలీసులు మూడు వాహనాల్లో వేర్వేరుగా తీసుకెళ్లారు. ఒక వాహనంలోని నేతలను కొండపల్లి పోలీస్ స్టేషన్​కు, మరో వాహనంలోని నేతలను కేశంపేట్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. వాహనాలను పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కొత్తపేట వద్ద రోడ్డుపై టైర్లు కాల్చి వేశారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వారిని చెదరగొట్టాల్సి వచ్చింది.

భారీగా చేసిన బీఆర్ఎస్ నేతలు : హరీశ్​రావు సహా ఇతర నేతలను తీసుకెళ్లిన కేశంపేట పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తగా, రాత్రి 11 గంటల తర్వాత నేతలను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి నివాసంతో పాటు సిద్దిపేట, ఖమ్మం ఘటనల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న డీజీపీ హామీ మేరకు స్టేషన్ నుంచి వెళ్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

కౌశిక్​ రెడ్డిపై కేసు : మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవి చందన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత కౌశిక్ రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, గచ్చిబౌలి డీసీపీ కార్యాలయానికి వెళ్లి గాంధీ సహా ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే గాంధీ తనపై దాడికి వచ్చారన్న కౌశిక్ రెడ్డి, శాసన సభ్యులకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు.

నేడు అరెకపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు బయల్దేరతారని, పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటారని పేర్కొంది.

'కౌశిక్‌పై దాడిని లైట్ తీస్కోం - న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తాం' - HARISH RAO ON KAUSHIK GANDHI ISSUE

నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు - రేపు బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో చూపుతాం : కౌశిక్​రెడ్డి - Kaushik Reddy on Gandhi

Last Updated : Sep 13, 2024, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.