ETV Bharat / politics

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో పేదల కలలు కలలుగానే మిగిలాయి : మంత్రి పొంగులేటి - Ponguleti Comments on Activists

Minister Ponguleti participate in Congress Programme : ఏడాదిలోనే పాలేరులో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. కార్యకర్తల కష్టంతోనే తాను ఉన్నత పదవిలో ఉన్నానని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 1:49 PM IST

Minister Ponguleti participate in Congress Programme
Minister Ponguleti participate in Congress Programme (ETV Bharat)

Minister Ponguleti Srinivasa Reddy Comments on Activists : కార్యకర్తల కష్టంతోనే ఉన్నతమైన పదవిలో ఉన్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల ప్రభుత్వంలో ప్రజల కోరికలు నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్​ కార్యకర్తలు పడిన కష్టానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో పేదల కలలు కలలుగానే మిగిలాయని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని పేర్కొన్నారు. ఏడాదిలోనే పాలేరులో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేయిస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరు ప్రజలకు మూడేళ్లలోనే ఇళ్లు కట్టించడం తన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించి అర్హులైన వారికి కేటాయిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్పష్టంచేశారు.

Minister Ponguleti Srinivasa Reddy Comments on Activists : కార్యకర్తల కష్టంతోనే ఉన్నతమైన పదవిలో ఉన్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల ప్రభుత్వంలో ప్రజల కోరికలు నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్​ కార్యకర్తలు పడిన కష్టానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో పేదల కలలు కలలుగానే మిగిలాయని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని పేర్కొన్నారు. ఏడాదిలోనే పాలేరులో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేయిస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరు ప్రజలకు మూడేళ్లలోనే ఇళ్లు కట్టించడం తన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించి అర్హులైన వారికి కేటాయిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్పష్టంచేశారు.

రాష్ట్రంలో వేలాది మంది ఫోన్‌లు ట్యాప్​ చేశారు - నిందితులు ఎంతటి వారైనా శిక్ష తప్పదు : పొంగులేటి - Lok Sabha Elections 2024

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే 'పవర్ షట్​ డౌన్'​ చేయాలని కుట్ర చేశారు : పొంగులేటి - Minister Ponguleti Chit Chat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.