ETV Bharat / politics

కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులే మాతో టచ్‌లో ఉన్నారు : పీసీసీ చీఫ్​ మహేశ్‌కుమార్‌

తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికలు ఆగలేదు - అధికారంలో కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్ల జైలు కూడా తక్కువే : మహేశ్‌కుమార్‌

TPCC Chief Mahesh Kumar Comments On Party Defections
TPCC Chief Mahesh Kumar Comments On Party Defections (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

TPCC Chief Mahesh Kumar Comments On Party Defections : తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికలు ఆగలేదని, కేటీఆర్​కు అత్యంత సన్నిహితులు తమతో టచ్​లో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు​ చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు పార్టీ చేరికలపై స్పందించారు. పాత.. కొత్త నాయకత్వం సమన్వయం చేసుకుని పనిచేయాలన్న మహేశ్​కుమార్​ గౌడ్​, కొంతమంది ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని అన్నారు.

మరోవైపు బీఆర్ఎస్​ పార్టీ తీరు, గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్ల జైలు కూడా తక్కువేనని హాట్ కామెంట్స్​ చేశారు. నిరసనల పేరిట మాజీమంత్రి హరీశ్‌రావు, కేటీఆర్​లు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. అన్ని పార్టీల ఎన్నికల అజెండాల్లోనూ మూసీ ప్రక్షాళ ఉందని, మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క పేదవాడి ఇళ్లు కూడా కూల్చలేదని ఆయన వివరించారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు.

తాను ఎన్నికై 50 రోజులు అయిన సందర్భంగా : దేశ రాజధాని దిల్లీ పర్యటనలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్‌ అగ్రనేతలతో టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్ భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసిన మహేశ్​ కుమార్‌ గౌడ్‌, తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని రెండేళ్లు పూర్తి కావడంతో, ఖర్గేకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సమయంలో.. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కూడా మర్యాద పూర్వకంగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ కలిశారు. కాసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీపరంగా తాను ఎన్నికయిన 50 రోజులపాటు జరిగిన పలు ముఖ్యమైన అంశాలను కూడా రాహుల్‌కు వివరించారని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

ఎక్కువశాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్‌ఎస్ నేతలే : పీసీసీ చీఫ్​ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ - TPCC Chief Mahesh Kumar Pressmeet

నేను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని- బీసీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ - TPCC Chief Mahesh Kumar Goud On BCs

TPCC Chief Mahesh Kumar Comments On Party Defections : తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికలు ఆగలేదని, కేటీఆర్​కు అత్యంత సన్నిహితులు తమతో టచ్​లో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు​ చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు పార్టీ చేరికలపై స్పందించారు. పాత.. కొత్త నాయకత్వం సమన్వయం చేసుకుని పనిచేయాలన్న మహేశ్​కుమార్​ గౌడ్​, కొంతమంది ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని అన్నారు.

మరోవైపు బీఆర్ఎస్​ పార్టీ తీరు, గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్ల జైలు కూడా తక్కువేనని హాట్ కామెంట్స్​ చేశారు. నిరసనల పేరిట మాజీమంత్రి హరీశ్‌రావు, కేటీఆర్​లు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. అన్ని పార్టీల ఎన్నికల అజెండాల్లోనూ మూసీ ప్రక్షాళ ఉందని, మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క పేదవాడి ఇళ్లు కూడా కూల్చలేదని ఆయన వివరించారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు.

తాను ఎన్నికై 50 రోజులు అయిన సందర్భంగా : దేశ రాజధాని దిల్లీ పర్యటనలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్‌ అగ్రనేతలతో టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్ భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసిన మహేశ్​ కుమార్‌ గౌడ్‌, తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని రెండేళ్లు పూర్తి కావడంతో, ఖర్గేకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సమయంలో.. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కూడా మర్యాద పూర్వకంగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ కలిశారు. కాసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీపరంగా తాను ఎన్నికయిన 50 రోజులపాటు జరిగిన పలు ముఖ్యమైన అంశాలను కూడా రాహుల్‌కు వివరించారని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

ఎక్కువశాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్‌ఎస్ నేతలే : పీసీసీ చీఫ్​ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ - TPCC Chief Mahesh Kumar Pressmeet

నేను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని- బీసీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ - TPCC Chief Mahesh Kumar Goud On BCs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.