ETV Bharat / politics

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం - 'పేదలపైకి బుల్డోజర్లు - రైతులపైకి బ్యాంకు అధికారులు' - KTR TWEETS TODAY LATEST NEWS

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

KTR Latest Tweet Today : రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనపై కేటీఆర్​ పలు ప్రశ్నలు సంధించారు. కుల వృత్తులపై ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తుందని ఆక్షేపించారు. ఇందిరమ్మ రాజ్యం లో పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు, రైతుల ఇళ్ల మీదకు బ్యాంకు అధికారులు వస్తున్నారని విమర్శించారు.

KTR Fire on TG Govt
KTR Tweet On Farmers (ETV Bharat)

KTR Slams The Congress Govt : రెండు లక్షల రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితులున్నాయన్నారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ల మీదకు వచ్చి తలుపు తడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

రుణమాఫీపై ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి ఇలాంటి ఘటనలే చెంప పెట్టు లాంటివని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం లో పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు, రైతుల ఇళ్ల మీదకు బ్యాంకు అధికారులు వస్తున్నారని ఆక్షేపించారు. పేదలను, రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా అని నిలదీశారు. రాష్ట్రంలో కేసీఆర్ విలువ ఏంటని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. మారుమూల గ్రామానికి వెళ్తే ఒక రైతన్న అయ్యో కేసీఆర్​ను వద్దనుకుని తప్పు చేశామని బాధపడుతున్నారని అన్నారు.

మరోవైపు కుల వృత్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కత్తికట్టినట్టు వ్యవహరిస్తోందని బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​లో ట్వీట్​ చేశారు. మత్తడి దూకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆయన మండిపడ్డారు. చేప పిల్లల పంపిణీ పథకాన్ని చెడగొట్టడానికే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇప్పటిదాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదని ఆక్షేపించారు.

టెండర్ల దశ దాటనే లేదని, అసలు ఉంటుందో లేదో ఎవరికీ తెలియదన్నారు. చేపల వేటనే నమ్ముకున్న బహుజన కులాల బతుకు దెరువును దెబ్బకొట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం తమ వృత్తికి ఊపిరి పోసి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని, ఇన్ లాండ్ ఫిష్ ఉత్పత్తిలో తెలంగాణ అద్భుతాలు చేసిందని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచెయ్యాలనే రాజకీయ కక్షతో మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

'రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తుంటే - సీఎం, మంత్రుల దిల్లీ రాజకీయ యాత్రలా?' - KTR Letter to CM on Viral Fevers

పురపాలక మంత్రిగా కేటీఆర్‌ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదు : రఘునందన్‌రావు - RAGHUNANDAN RAO ON HYDRA OPERATION

KTR Slams The Congress Govt : రెండు లక్షల రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితులున్నాయన్నారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ల మీదకు వచ్చి తలుపు తడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

రుణమాఫీపై ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి ఇలాంటి ఘటనలే చెంప పెట్టు లాంటివని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం లో పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు, రైతుల ఇళ్ల మీదకు బ్యాంకు అధికారులు వస్తున్నారని ఆక్షేపించారు. పేదలను, రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా అని నిలదీశారు. రాష్ట్రంలో కేసీఆర్ విలువ ఏంటని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. మారుమూల గ్రామానికి వెళ్తే ఒక రైతన్న అయ్యో కేసీఆర్​ను వద్దనుకుని తప్పు చేశామని బాధపడుతున్నారని అన్నారు.

మరోవైపు కుల వృత్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కత్తికట్టినట్టు వ్యవహరిస్తోందని బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​లో ట్వీట్​ చేశారు. మత్తడి దూకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆయన మండిపడ్డారు. చేప పిల్లల పంపిణీ పథకాన్ని చెడగొట్టడానికే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇప్పటిదాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదని ఆక్షేపించారు.

టెండర్ల దశ దాటనే లేదని, అసలు ఉంటుందో లేదో ఎవరికీ తెలియదన్నారు. చేపల వేటనే నమ్ముకున్న బహుజన కులాల బతుకు దెరువును దెబ్బకొట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం తమ వృత్తికి ఊపిరి పోసి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని, ఇన్ లాండ్ ఫిష్ ఉత్పత్తిలో తెలంగాణ అద్భుతాలు చేసిందని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచెయ్యాలనే రాజకీయ కక్షతో మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

'రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తుంటే - సీఎం, మంత్రుల దిల్లీ రాజకీయ యాత్రలా?' - KTR Letter to CM on Viral Fevers

పురపాలక మంత్రిగా కేటీఆర్‌ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదు : రఘునందన్‌రావు - RAGHUNANDAN RAO ON HYDRA OPERATION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.