ETV Bharat / politics

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌కు తీరని నష్టం : కేటీఆర్‌ - KTR Reacted to Sunkishala Issue

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 12:02 PM IST

Updated : Aug 9, 2024, 12:53 PM IST

KTR Comments On Congress Party : కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని బీఆర్ఎస్ సీనియర్​ నేత కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు చేశామన్న ఆయన, సుంకిశాల ప్రాజెక్టుపై రేవంత్​ సర్కార్​ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

KTR Comments On Congress Party
KTR Reacted to Sunkishala Project Issue (ETV Bharat)

KTR Reacted to Sunkishala Project Issue : సుంకిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.

సుంకిశాల ప్రాజెక్టు డ్యామేజ్‌పై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం, పర్యవేక్షణ లోపం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని కేటీఆర్ వాపోయారు. సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్న ఆయన, నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజ్‌ ఉన్నా హైదరాబాద్‌కు నీటి కష్టాలు రావని స్పష్టం చేశారు.

"హైదరాబాద్​లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వ హయాంలో సుంకిశాల ప్రాజెక్ట్​కు పునరుజ్జీవం చేశాం. మరుగునపడ్డ ప్రాజెక్ట్​ను మళ్లీ తెరముందుకు తీసుకురావడం జరిగింది. ఏఎమ్​ఆర్​పీ ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్​లో 510 అడుగులపైన నీరు ఉంటేనే లిఫ్టింగ్​కు సాధ్యం. కానీ మేము తీసుకున్న సుంకిశాల ప్రాజెక్ట్​ నిర్ణయంతో సాగర్​లో డెడ్​స్టోరేజ్​లో నీళ్లు ఉన్నా లిఫ్ట్​చేయవచ్చు."-కేటీఆర్​, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాలను పట్టించుకోలేదు : కృష్ణా నదికి మూడు, నాలుగు ఏళ్లు వరద రాకపోయినా హైదరాబాద్​కు నీరు తీసుకొచ్చేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని మాజీ మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ మెయిన్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ నిర్ణయమని, అందులో 42 కిలోమీటర్లు పూర్తి చేశామని వివరించారు. సీతారామ ప్రాజెక్టును వాయువేగంతో పూర్తి చేసింది తమ ప్రభుత్వమని, కానీ ఇవాళ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సుంకిశాల పనులు వేగంగా చేసినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని కేటీఆర్​ ధ్వజమెత్తారు. పురపాలకశాఖలో పాలన పడకేసిందని, వేసవిలో ఇబ్బందితో విమర్శలు వచ్చిన తర్వాత జలమండలి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని వివరించారు. పురపాలకశాఖ తన వద్ద పెట్టుకున్న ముఖ్యమంత్రిదే సుంకిశాల ఘటనకు ప్రధాన బాధ్యతన్నారు. ఘటన జరిగినపుడు హైదరాబాద్​లో ఉన్న సీఎం, 24 గంటల తర్వాత బలాదూర్ అంటూ అమెరికా వెళ్లారన్నారు.

మంచి అయితే వారి ఖాతా, చెడు అయితే మా ఖాతా : ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్ట్​లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై పర్యవేక్షణా వైఫల్యం, జవాబుదారీతనం లేదన్న ఆయన, మళ్లీ తమపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. మంచి అయితే వారి ఖాతా, చెడు అయితే మా ఖాతానా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కుంగుబాటు జరిగితే ఎన్డీఎస్ఏ, ఇతర సంస్థలు హడావుడిగా వచ్చాయన్న కేటీఆర్, ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కున్నాయని మేము అనవచ్చా అని నిట్టూర్చారు.

బీఆర్​ఎస్​పై నిందలు వేసి తప్పించుకోవాలని చూడడం భావ్యం కాదన్న కేటీఆర్, శాఖాపరమైన విచారణ కాదు, న్యాయ విచారణ జరగాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలోచన లోపభూయిష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాదని, దివాళా కోరుతనం తప్ప ఇంకోటి లేదని మండిపడ్డారు. సుంకిశాలను పార్టీ బృందం త్వరలోనే సందర్శిస్తుందని, విశ్రాంత ఇంజనీర్లను కూడా తీసుకెళ్తామని తెలిపారు.

నాగార్జునసాగర్‌ వద్ద కూలిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్‌ - వీడియో వైరల్ - Sunkishala Retaining Wall Collapsed

హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు ఆటంకం లేదు - సుంకిశాల ప్రాజెక్ట్​ ఘటనపై జలమండలి - Sunkishala Project Wall Collapse

KTR Reacted to Sunkishala Project Issue : సుంకిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.

సుంకిశాల ప్రాజెక్టు డ్యామేజ్‌పై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం, పర్యవేక్షణ లోపం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని కేటీఆర్ వాపోయారు. సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్న ఆయన, నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజ్‌ ఉన్నా హైదరాబాద్‌కు నీటి కష్టాలు రావని స్పష్టం చేశారు.

"హైదరాబాద్​లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వ హయాంలో సుంకిశాల ప్రాజెక్ట్​కు పునరుజ్జీవం చేశాం. మరుగునపడ్డ ప్రాజెక్ట్​ను మళ్లీ తెరముందుకు తీసుకురావడం జరిగింది. ఏఎమ్​ఆర్​పీ ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్​లో 510 అడుగులపైన నీరు ఉంటేనే లిఫ్టింగ్​కు సాధ్యం. కానీ మేము తీసుకున్న సుంకిశాల ప్రాజెక్ట్​ నిర్ణయంతో సాగర్​లో డెడ్​స్టోరేజ్​లో నీళ్లు ఉన్నా లిఫ్ట్​చేయవచ్చు."-కేటీఆర్​, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాలను పట్టించుకోలేదు : కృష్ణా నదికి మూడు, నాలుగు ఏళ్లు వరద రాకపోయినా హైదరాబాద్​కు నీరు తీసుకొచ్చేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని మాజీ మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ మెయిన్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ నిర్ణయమని, అందులో 42 కిలోమీటర్లు పూర్తి చేశామని వివరించారు. సీతారామ ప్రాజెక్టును వాయువేగంతో పూర్తి చేసింది తమ ప్రభుత్వమని, కానీ ఇవాళ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సుంకిశాల పనులు వేగంగా చేసినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని కేటీఆర్​ ధ్వజమెత్తారు. పురపాలకశాఖలో పాలన పడకేసిందని, వేసవిలో ఇబ్బందితో విమర్శలు వచ్చిన తర్వాత జలమండలి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని వివరించారు. పురపాలకశాఖ తన వద్ద పెట్టుకున్న ముఖ్యమంత్రిదే సుంకిశాల ఘటనకు ప్రధాన బాధ్యతన్నారు. ఘటన జరిగినపుడు హైదరాబాద్​లో ఉన్న సీఎం, 24 గంటల తర్వాత బలాదూర్ అంటూ అమెరికా వెళ్లారన్నారు.

మంచి అయితే వారి ఖాతా, చెడు అయితే మా ఖాతా : ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్ట్​లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై పర్యవేక్షణా వైఫల్యం, జవాబుదారీతనం లేదన్న ఆయన, మళ్లీ తమపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. మంచి అయితే వారి ఖాతా, చెడు అయితే మా ఖాతానా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కుంగుబాటు జరిగితే ఎన్డీఎస్ఏ, ఇతర సంస్థలు హడావుడిగా వచ్చాయన్న కేటీఆర్, ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కున్నాయని మేము అనవచ్చా అని నిట్టూర్చారు.

బీఆర్​ఎస్​పై నిందలు వేసి తప్పించుకోవాలని చూడడం భావ్యం కాదన్న కేటీఆర్, శాఖాపరమైన విచారణ కాదు, న్యాయ విచారణ జరగాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలోచన లోపభూయిష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాదని, దివాళా కోరుతనం తప్ప ఇంకోటి లేదని మండిపడ్డారు. సుంకిశాలను పార్టీ బృందం త్వరలోనే సందర్శిస్తుందని, విశ్రాంత ఇంజనీర్లను కూడా తీసుకెళ్తామని తెలిపారు.

నాగార్జునసాగర్‌ వద్ద కూలిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్‌ - వీడియో వైరల్ - Sunkishala Retaining Wall Collapsed

హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు ఆటంకం లేదు - సుంకిశాల ప్రాజెక్ట్​ ఘటనపై జలమండలి - Sunkishala Project Wall Collapse

Last Updated : Aug 9, 2024, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.