ETV Bharat / politics

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీ ఏమైనట్టు : కేటీఆర్ - KTR On Congress BC Declaration

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 3:00 PM IST

KTR On BC Congress Declaration Latest : బీసీల విషయంలో కాంగ్రెస్ మాటలకే పరిమితం కారాదని, డిక్లరేషన్‌ను ఇప్పటి వరకు అమలు చేయలేదని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్‌, పూలే ఆశయాలను చేతల్లో చూపిన వ్యక్తి కేసీఆర్‌ అని కొనియాడారు.

KTR on Congress BC Declaration
Jyothi Rao phule Celebrations At Telangana Bhavan
బీసీ డిక్లరేషన్​ను ఇప్పటివరకు అమలు చేయలేదు కేటీఆర్

KTR On BC Congress Declaration Latest : బీసీల విషయంలో కాంగ్రెస్​ మాటలకే పరిమితం కారాదని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్​ ప్రకటించిన బీసీ డిక్లరేషన్​లో ఏ ఒక్క హమీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో బీసీ ఉప ప్రణాళిక, రూ.20వేల కోట్లు పెట్టలేదని మండిపడ్డారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్​లో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Jyothi Rao Phule Celebrations in Telangana Bhavan : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్​ అని కేటీఆర్ అన్నారు. ఎస్టీ, ఎస్సీ స్థానాలు పోగా 12 లోక్​సభ స్థానాల్లో ఆరు సీట్లను బీసీలకు కేటాయించామాని తెలిపారు. బీఆర్ఎస్​ మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చిత్తశుద్ధి చాటుకుందని తెలిపారు. కులవృత్తుల్లో ఉన్న నైపుణ్యాన్ని కూడా వాడుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది కేసీఆర్ ఆలోచన అని చెప్పారు.

పూలే 200 జయంతి వరకు రాష్ట్రంలో సమున్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే దీక్ష కూడా చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో 1008 గురుకులాలు స్థాపించి ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వివక్షపై విద్యతోనే విజయం సాధించవచ్చని తన ఇంటి నుంచే శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు.

సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ - ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు : కేటీఆర్ - KTR Satires on CM Revanth PM Modi

"సమాజంలోని అన్ని వర్గాల వారికి ఫలాలు అందాలని ప్రయత్నించిన ప్రభుత్వం బీఆర్ఎస్​. కులవృత్తుల్లో ఉన్న నైపుణ్యాన్ని కూడా వాడుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది కేసీఆర్ ఆలోచన. నేతన్నల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారు." - కేటీఆర్, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు​

Jyothi Rao phule Celebrations At MLA Harish Rao Residence : అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పూలే జయంతి సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారు. పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

'మహిళల సమాన అవకాశాల కోసం పూలే కృషి ఎనలేనిది'

ఫూలే విగ్రహ ఏర్పాటుపై అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలి : కవిత

బీసీ డిక్లరేషన్​ను ఇప్పటివరకు అమలు చేయలేదు కేటీఆర్

KTR On BC Congress Declaration Latest : బీసీల విషయంలో కాంగ్రెస్​ మాటలకే పరిమితం కారాదని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్​ ప్రకటించిన బీసీ డిక్లరేషన్​లో ఏ ఒక్క హమీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో బీసీ ఉప ప్రణాళిక, రూ.20వేల కోట్లు పెట్టలేదని మండిపడ్డారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్​లో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Jyothi Rao Phule Celebrations in Telangana Bhavan : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్​ అని కేటీఆర్ అన్నారు. ఎస్టీ, ఎస్సీ స్థానాలు పోగా 12 లోక్​సభ స్థానాల్లో ఆరు సీట్లను బీసీలకు కేటాయించామాని తెలిపారు. బీఆర్ఎస్​ మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చిత్తశుద్ధి చాటుకుందని తెలిపారు. కులవృత్తుల్లో ఉన్న నైపుణ్యాన్ని కూడా వాడుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది కేసీఆర్ ఆలోచన అని చెప్పారు.

పూలే 200 జయంతి వరకు రాష్ట్రంలో సమున్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే దీక్ష కూడా చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో 1008 గురుకులాలు స్థాపించి ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వివక్షపై విద్యతోనే విజయం సాధించవచ్చని తన ఇంటి నుంచే శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు.

సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ - ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు : కేటీఆర్ - KTR Satires on CM Revanth PM Modi

"సమాజంలోని అన్ని వర్గాల వారికి ఫలాలు అందాలని ప్రయత్నించిన ప్రభుత్వం బీఆర్ఎస్​. కులవృత్తుల్లో ఉన్న నైపుణ్యాన్ని కూడా వాడుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది కేసీఆర్ ఆలోచన. నేతన్నల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారు." - కేటీఆర్, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు​

Jyothi Rao phule Celebrations At MLA Harish Rao Residence : అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పూలే జయంతి సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారు. పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

'మహిళల సమాన అవకాశాల కోసం పూలే కృషి ఎనలేనిది'

ఫూలే విగ్రహ ఏర్పాటుపై అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలి : కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.