ETV Bharat / politics

దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో - 8 నెలల్లో ఎందుకింత విధ్వంసం? : కేటీఆర్‌ - KTR TWEET ON TELANGANA CULTIVATION

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 11:16 AM IST

Updated : Aug 12, 2024, 11:43 AM IST

KTR Slams Congress Govt Over Cultivation : దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రం, 8 నెలల్లో ఎందుకింత విధ్వంసంగా మారిందని ఎక్స్​ వేదికగా కాంగ్రెస్​పై కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసా లేదని మండిపడ్డారు. ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని ​ ఆరోపించారు.

KTR Fires on Congress Govt
KTR On Telangana Agriculture Issues (ETV Bharat)

KTR Tweet On Telangana Agriculture Issues : కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం అయితే కాంగ్రెస్ రాగానే వ్యయసాయానికి గడ్డుకాలం వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని, ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతం ఇదేనని పేర్కొన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు.

మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు : మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీ రైతుల సంఖ్య కట్, నేడు సాగుచేసే భూ విస్తీర్ణం కట్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'సీఎం రేవంత్​ అలా అనడం మానేయాలి - తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడొద్దు' - KTR Fires On CM Revanth Reddy

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితని కేటీఆర్ ఆక్షేపించారు. బురద రాజకీయాలు తప్ప, కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు. కొత్త రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఇవన్నీ తెలంగాణలో సాగు విస్తీర్ణం తగ్గటానికి కారణాలని ఎక్స్​ వేదికగా ఆయన చెప్పుకొచ్చారు.

KTR Respond on Sunkishala Project Incident : సుంకిశాల ప్రమాదం జరిగి పది రోజులకు పైగా గడిచినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం పట్టించుకోవడం లేదని కేటీఆర్​ ఆక్షేపించారు. ఇప్పటి వరకు పనులు చేసిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో, సంస్థ పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోందో రాహుల్ గాంధీ చెప్పగలరా అని ఎక్స్ వేదికగా నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌కు తీరని నష్టం : కేటీఆర్‌ - KTR Reacted to Sunkishala Issue

KTR Tweet On Telangana Agriculture Issues : కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం అయితే కాంగ్రెస్ రాగానే వ్యయసాయానికి గడ్డుకాలం వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని, ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతం ఇదేనని పేర్కొన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు.

మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు : మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీ రైతుల సంఖ్య కట్, నేడు సాగుచేసే భూ విస్తీర్ణం కట్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'సీఎం రేవంత్​ అలా అనడం మానేయాలి - తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడొద్దు' - KTR Fires On CM Revanth Reddy

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితని కేటీఆర్ ఆక్షేపించారు. బురద రాజకీయాలు తప్ప, కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు. కొత్త రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఇవన్నీ తెలంగాణలో సాగు విస్తీర్ణం తగ్గటానికి కారణాలని ఎక్స్​ వేదికగా ఆయన చెప్పుకొచ్చారు.

KTR Respond on Sunkishala Project Incident : సుంకిశాల ప్రమాదం జరిగి పది రోజులకు పైగా గడిచినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం పట్టించుకోవడం లేదని కేటీఆర్​ ఆక్షేపించారు. ఇప్పటి వరకు పనులు చేసిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో, సంస్థ పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోందో రాహుల్ గాంధీ చెప్పగలరా అని ఎక్స్ వేదికగా నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌కు తీరని నష్టం : కేటీఆర్‌ - KTR Reacted to Sunkishala Issue

Last Updated : Aug 12, 2024, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.