ETV Bharat / politics

వైఎస్‌ జగన్‌ పాసుపోర్టు కష్టాలు- లండన్‌ ప్రయాణం ఎలా? - High Court on Jagan Petition

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 3:29 PM IST

Updated : Sep 6, 2024, 3:39 PM IST

High Court Hearing on YS Jagan Petition to Visit London: లండన్ వెళ్లేందుకు ఎన్​ఓసీ ఇవ్వమని ఆదేశించాలంటూ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జగన్ లండన్ టూర్‌కు సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

High_Court_on_Jagan_Petition
High_Court_on_Jagan_Petition (ETV Bharat)

High Court Hearing on YS Jagan Petition to Visit London: లండన్ వెళ్లేందుకు ఎన్​ఓసీ ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. జగన్ లండన్ టూర్​కు సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్​లో ఉందని పాస్ పోర్ట్ కార్యాలయం గతంలో లేఖ రాసిందని సదరు కోర్టు నుంచి ఎన్​ఓసీ తీసుకోవాలని చెప్పినట్లు పిటీషన్​లో పేర్కొన్నారు. దీంతో ఎన్​ఓసీ కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ జగన్ పిటీషన్ దాఖలు చేశారు.

పిటీషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లండన్ టూర్ వెళ్లేందుకు పిటీషనర్​కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజా ప్రతినిధుల కోర్టు అనేక షరతులను విధించినట్టు పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయటం సరికాదని కోర్టులో జగన్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. తదుపరి విచారణ సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 3 నుంచి 25వ తేదీ వరకు వైఎస్ జగన్ లండన్​కు వెళ్లాల్సి ఉంది.

వైఎస్‌జగన్‌ పాసుపోర్టు కష్టాలు-లండన్‌ప్రయాణం ఎలా?

High Court Hearing on YS Jagan Petition to Visit London: లండన్ వెళ్లేందుకు ఎన్​ఓసీ ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. జగన్ లండన్ టూర్​కు సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్​లో ఉందని పాస్ పోర్ట్ కార్యాలయం గతంలో లేఖ రాసిందని సదరు కోర్టు నుంచి ఎన్​ఓసీ తీసుకోవాలని చెప్పినట్లు పిటీషన్​లో పేర్కొన్నారు. దీంతో ఎన్​ఓసీ కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ జగన్ పిటీషన్ దాఖలు చేశారు.

పిటీషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లండన్ టూర్ వెళ్లేందుకు పిటీషనర్​కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజా ప్రతినిధుల కోర్టు అనేక షరతులను విధించినట్టు పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయటం సరికాదని కోర్టులో జగన్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. తదుపరి విచారణ సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 3 నుంచి 25వ తేదీ వరకు వైఎస్ జగన్ లండన్​కు వెళ్లాల్సి ఉంది.

వరద సహాయక చర్యలు ముమ్మరం - గండ్లు పూడ్చేందుకు బుడమేరు చేరుకున్న ఆర్మీ - CBN Tele Conference in Officials

విద్యాసాగర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు: నటి కాదంబరీ - Bollywood Actress kadambari Issue

Last Updated : Sep 6, 2024, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.