ETV Bharat / politics

వీడిన 'పదవుల' చిక్కుముడి! - రెండు మూడు రోజుల్లో నూతన సారథి పేరు ప్రకటన!! - New TPCC President Selection

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 7:04 AM IST

Updated : Aug 24, 2024, 10:26 AM IST

TPCC New President Selection : పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. శుక్రవారం దిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమాలోచనలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్ర బృందం వేర్వేరు అభిప్రాయాలు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

New TPCC President Selection
New TPCC President Selection (ETV Bharat)

Congress Exercise for New TPCC Leader : ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, పార్టీ సారథిగా పదవీ కాలం సైతం ముగియడంతో కాంగ్రెస్​కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర బృందంతో అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమాలోచనలు జరిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో ఉమ్మడి సమావేశంతో పాటు విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. విస్తృత చర్చలు జరిగినా అధిష్ఠానం తుది నిర్ణయానికి రాకపోయినప్పటికీ, క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయం తర్వాత మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం. 2, 3 రోజుల్లోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. జులై నెలలోనే కసరత్తు జరిగినా ఆషాఢమాసం కారణంగా ఆగింది. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరు 7న కొలువుదీరిన మంత్రివర్గంలో 12 మందికే పదవులివ్వగా మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ మేరకు పదవులను ఆశించేవారి నుంచి ఒత్తిడి పెరగడంతో సామాజికవర్గాల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఒకేసారి పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

మహేశ్​ కుమార్​ గౌడ్​ వైపే మొగ్గు? : పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజికవర్గం నుంచి ప్రస్తుత కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్‌ పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీరిలో లక్ష్మణ్​ కుమార్​, బలరాం నాయక్​, మహేశ్​ గౌడ్​లలో ఒకరికి మెరుగైన అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాయకులు కోర్‌ కమిటీ సభ్యులుగా చెప్పే అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగినప్పటికీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఆరు మంత్రి పదవుల్లో నాలుగే భర్తీ : మరోవైపు 6 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 4 భర్తీ చేసి, మిగిలిన రెండూ అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. ఈ నాలుగింటికి ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, వాకిటి శ్రీహరి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల అయిలయ్యల పేర్లు వినిపిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకునే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు హామీ ఇచ్చారంటూ వారి పేర్లూ ప్రచారంలో ఉన్నాయి. బీసీల్లో బలమైన సామాజికవర్గంగా గుర్తింపు పొందిన ముదిరాజ్‌ల నుంచి వాకిటి శ్రీహరికి కచ్చితంగా చోటు లభిస్తుందని అంటున్నారు. బీసీల్లో మరో బలమైన యాదవ సామాజికవర్గానికి, ఎస్టీల నుంచి లంబాడాల్లో ఒకరికి, ఎస్సీల నుంచి మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గంలో వీరికేనా ఛాన్స్​? - 11మందిలో ఆరుగురికే అవకాశం - telangana cabinet Expansion problem

కాంగ్రెస్​లో పదవుల జాతర - టీపీసీసీ, క్యాబినెట్, నామినేటెడ్ పదవుల జాబితా - రేసులో ఉన్న నాయకులు వీరే - Congress Focus on TPCC Selection

Congress Exercise for New TPCC Leader : ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, పార్టీ సారథిగా పదవీ కాలం సైతం ముగియడంతో కాంగ్రెస్​కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర బృందంతో అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమాలోచనలు జరిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో ఉమ్మడి సమావేశంతో పాటు విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. విస్తృత చర్చలు జరిగినా అధిష్ఠానం తుది నిర్ణయానికి రాకపోయినప్పటికీ, క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయం తర్వాత మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం. 2, 3 రోజుల్లోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. జులై నెలలోనే కసరత్తు జరిగినా ఆషాఢమాసం కారణంగా ఆగింది. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరు 7న కొలువుదీరిన మంత్రివర్గంలో 12 మందికే పదవులివ్వగా మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ మేరకు పదవులను ఆశించేవారి నుంచి ఒత్తిడి పెరగడంతో సామాజికవర్గాల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఒకేసారి పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

మహేశ్​ కుమార్​ గౌడ్​ వైపే మొగ్గు? : పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజికవర్గం నుంచి ప్రస్తుత కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్‌ పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీరిలో లక్ష్మణ్​ కుమార్​, బలరాం నాయక్​, మహేశ్​ గౌడ్​లలో ఒకరికి మెరుగైన అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాయకులు కోర్‌ కమిటీ సభ్యులుగా చెప్పే అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగినప్పటికీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఆరు మంత్రి పదవుల్లో నాలుగే భర్తీ : మరోవైపు 6 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 4 భర్తీ చేసి, మిగిలిన రెండూ అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. ఈ నాలుగింటికి ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, వాకిటి శ్రీహరి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల అయిలయ్యల పేర్లు వినిపిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకునే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు హామీ ఇచ్చారంటూ వారి పేర్లూ ప్రచారంలో ఉన్నాయి. బీసీల్లో బలమైన సామాజికవర్గంగా గుర్తింపు పొందిన ముదిరాజ్‌ల నుంచి వాకిటి శ్రీహరికి కచ్చితంగా చోటు లభిస్తుందని అంటున్నారు. బీసీల్లో మరో బలమైన యాదవ సామాజికవర్గానికి, ఎస్టీల నుంచి లంబాడాల్లో ఒకరికి, ఎస్సీల నుంచి మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గంలో వీరికేనా ఛాన్స్​? - 11మందిలో ఆరుగురికే అవకాశం - telangana cabinet Expansion problem

కాంగ్రెస్​లో పదవుల జాతర - టీపీసీసీ, క్యాబినెట్, నామినేటెడ్ పదవుల జాబితా - రేసులో ఉన్న నాయకులు వీరే - Congress Focus on TPCC Selection

Last Updated : Aug 24, 2024, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.