ETV Bharat / politics

టాప్​ గేర్​లో దూసుకెళ్తోన్న సీఎం - నేడు 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం - CM Revanth Election campaign in TS

Revanth Campaign in Lok Sabha Elections 2024 : బీఆర్ఎస్ కారు దిల్లీకి పోతే కమలం పువ్వులా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ధర్మపురి, సిరిసిల్ల సభల్లో పాల్గొన్న ఆయన, బీజేపీ -భారత్ రాష్ట్ర సమితి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన మాజీ సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ సర్కార్‌ దిగిపోవాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. కవిత బెయిల్‌ కోసం దిల్లీ సుల్తాన్‌లకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇవాళ కొత్తగూడెం, వనపర్తి జిల్లాల్లో రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 7:00 AM IST

CM Revanth Election campaign in TS
CM Revanth Election campaign in TS (ETV Bharat)
రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్, బీజేపీది ఒకే వైఖరి (ETV Bharat)

CM Revanth Election Campaign in TS 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ మరింత హోరెత్తిస్తోంది. మరో వారం రోజులే గడువుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ధర్మపురి, సిరిసిల్లలో జన జాతర సభలకు హాజరైన ఆయన, బీఆర్ఎస్‌, బీజేపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చిందేం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన భారతీయ జనతా పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. భారత్ రాష్ట్ర సమితి అంటే బిర్లా రంగా సమితిగా అభివర్ణించారు. రిజర్వేషన్ల రద్దుపై ఆ రెండు పార్టీలది ఒకే విధానమని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

కేటీఆర్ ప్రపంచంలో ఉన్నవన్నీ మాట్లాడతారు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ఎక్స్ (ట్విటర్‌)లో మాట్లాడతారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ యత్నిస్తుంటే ట్విటర్‌ టిల్లు ఎందుకు ప్రశ్నించటం లేదు. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్‌, బీజేపీలది ఒకే విధానం. 2022లో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్‌ చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకుందామా? ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో కలవడానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. - రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు : దిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్‌ కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వారిద్దరూ కలిసి పోతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందన్న ముఖ్యమంత్రి, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన పీడను వదిలిస్తానని వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత నేతన్నల బకాయిలు పూర్తిగా చెల్లించడంతో పాటు వారిని ఆదుకుంటామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణనలో జాప్యం : సీఎం రేవంత్ - CM Revanth Jana Jatara Sabha

Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం, వనపర్తి జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ముఖ్యమంత్రి సభ విజయవంతం చేసేందుకు శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడేనికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఎండ వేడిమి నుంచి రక్షించడం కోసం జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో టెంట్లు ఏర్పాట్లు చేశారు.

కొత్తగూడెం సభ అనంతరం మహబూబ్‌నగర్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటన అనంతరం, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్స్‌లోనూ రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.

బీజేపీకి వేసే ప్రతి ఓటు - రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది : రేవంత్ రెడ్డి - lok sabha elections 2024

ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి : సీఎం రేవంత్ - CM Revanth Road Show at Siddipet

రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్, బీజేపీది ఒకే వైఖరి (ETV Bharat)

CM Revanth Election Campaign in TS 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ మరింత హోరెత్తిస్తోంది. మరో వారం రోజులే గడువుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ధర్మపురి, సిరిసిల్లలో జన జాతర సభలకు హాజరైన ఆయన, బీఆర్ఎస్‌, బీజేపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చిందేం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన భారతీయ జనతా పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. భారత్ రాష్ట్ర సమితి అంటే బిర్లా రంగా సమితిగా అభివర్ణించారు. రిజర్వేషన్ల రద్దుపై ఆ రెండు పార్టీలది ఒకే విధానమని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

కేటీఆర్ ప్రపంచంలో ఉన్నవన్నీ మాట్లాడతారు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ఎక్స్ (ట్విటర్‌)లో మాట్లాడతారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ యత్నిస్తుంటే ట్విటర్‌ టిల్లు ఎందుకు ప్రశ్నించటం లేదు. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్‌, బీజేపీలది ఒకే విధానం. 2022లో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్‌ చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకుందామా? ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో కలవడానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. - రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు : దిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్‌ కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వారిద్దరూ కలిసి పోతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందన్న ముఖ్యమంత్రి, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన పీడను వదిలిస్తానని వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత నేతన్నల బకాయిలు పూర్తిగా చెల్లించడంతో పాటు వారిని ఆదుకుంటామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణనలో జాప్యం : సీఎం రేవంత్ - CM Revanth Jana Jatara Sabha

Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం, వనపర్తి జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ముఖ్యమంత్రి సభ విజయవంతం చేసేందుకు శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడేనికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఎండ వేడిమి నుంచి రక్షించడం కోసం జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో టెంట్లు ఏర్పాట్లు చేశారు.

కొత్తగూడెం సభ అనంతరం మహబూబ్‌నగర్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటన అనంతరం, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్స్‌లోనూ రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.

బీజేపీకి వేసే ప్రతి ఓటు - రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది : రేవంత్ రెడ్డి - lok sabha elections 2024

ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి : సీఎం రేవంత్ - CM Revanth Road Show at Siddipet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.