ETV Bharat / politics

తాడేపల్లికి చేరిన చిలకలూరిపేట 6.5 కోట్ల పంచాయితీ - జగన్​కు ఆధారాలు అందజేత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 5:41 PM IST

Mallela Rajesh met CM YS Jagan: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి విడుదల రజని, మల్లెల రాజేశ్ మధ్య రాజుకున్న వివాదం చివరికి సీఎంవోకు చేరింది. మంత్రి విడదల రజని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై సీఎం జగన్​కు ఫిర్యాదు చేసిన రాజేశ్​ అందుకు సంబంధించి ఆధారాలు కూడా అందించినట్లు తెలిసింది.

mallela_rajesh_met_cm_ys_jagan
mallela_rajesh_met_cm_ys_jagan

Mallela Rajesh met CM YS Jagan : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. సీఎంవో నుంచి పిలుపు రావడంతో చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడు సీఎం వైఎస్ జగన్​ను కలిశారు. చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే విడుదల రజినికి గుంటూరు వెస్ట్ టికెట్​ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నూతన ఇన్​చార్జిగా మల్లెల రాజేష్ నాయుడును నియమించి ఆ తర్వాత కొద్ది రోజులకే బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవలే చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును నియమించింది. ఈ క్రమంలో మల్లెల రాజేష్ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. పైగా తాను ఆరున్నర కోట్ల రూపాయలు రజినీకి ఇచ్చానని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో సజ్జల జోక్యం చేసుకుని రూ. 3 కోట్లు తిరిగి ఇప్పించారని తెలిపారు.

'సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు'

ఎమ్మెల్యే సీటు కోసం మంత్రి విడదల రజినికి రూ. 6 కోట్లు ఇచ్చినట్లు మల్లెల రాజేష్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు ఫిర్యాదు చేస్తే రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగిలిన డబ్బు ఇవ్వాలని మంత్రి రజినిని కోరితే దిక్కున్నచోట చెప్పుకోమన్నారని రాజేష్ ఆరోపించారు. మల్లెల రాజేష్ ఆరోపణలు సంచలనం రేకెత్తించడంతో ఈ వ్యవహారంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. మల్లెల రాజేష్ను సీఎంవోకి పిలిపించి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడారు. అనంతరం సీఎంతో సమావేశమైన మల్లెల రాజేష్ మంత్రి విడదల రజిని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై జగన్​కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీఎంకు ఆధారాలు కూడా అందించినట్లు తెలిసింది. పంచాయితీ దృష్ట్యా నరసారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సైతం సీఎంవోకు చేరుకున్నారు.

చిలకలూరిపేటలో మల్లెల అనుచరుల ఆందోళన - టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం

మంత్రి రజిని తనకు ఇంకా 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని కార్యకర్తల సమావేశంలో రాజేష్ వాపోయారు. సజ్జల జోక్యంతో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజిని తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు స్పందిస్తూ సజ్జలను మార్చాలని, పార్టీని బతికించాలని నినాదాలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోబోమని అధిష్ఠానాన్ని హెచ్చరించిన రాజేష్​ మర్రి రాజశేఖర్​కు టికెట్ ఇస్తే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని అన్నారు. స్థానికుడికి మాత్రమే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు సైతం డిమాండ్ చేశారు. కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే దగ్గరుండి మరీ ఒడిస్తామని హెచ్చరించారు.

ఇద్దరు మంత్రులు.. ఒక్కొక్కరికి 3 ఆఫీసులు..

మరీ ఈ వివాదానికి సీఎం జగన్​ ఏ విధంగా చెక్​ పెడతారో వేచి చూడాలి

Mallela Rajesh met CM YS Jagan : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. సీఎంవో నుంచి పిలుపు రావడంతో చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడు సీఎం వైఎస్ జగన్​ను కలిశారు. చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే విడుదల రజినికి గుంటూరు వెస్ట్ టికెట్​ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నూతన ఇన్​చార్జిగా మల్లెల రాజేష్ నాయుడును నియమించి ఆ తర్వాత కొద్ది రోజులకే బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవలే చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును నియమించింది. ఈ క్రమంలో మల్లెల రాజేష్ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. పైగా తాను ఆరున్నర కోట్ల రూపాయలు రజినీకి ఇచ్చానని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో సజ్జల జోక్యం చేసుకుని రూ. 3 కోట్లు తిరిగి ఇప్పించారని తెలిపారు.

'సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు'

ఎమ్మెల్యే సీటు కోసం మంత్రి విడదల రజినికి రూ. 6 కోట్లు ఇచ్చినట్లు మల్లెల రాజేష్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు ఫిర్యాదు చేస్తే రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగిలిన డబ్బు ఇవ్వాలని మంత్రి రజినిని కోరితే దిక్కున్నచోట చెప్పుకోమన్నారని రాజేష్ ఆరోపించారు. మల్లెల రాజేష్ ఆరోపణలు సంచలనం రేకెత్తించడంతో ఈ వ్యవహారంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. మల్లెల రాజేష్ను సీఎంవోకి పిలిపించి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడారు. అనంతరం సీఎంతో సమావేశమైన మల్లెల రాజేష్ మంత్రి విడదల రజిని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై జగన్​కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీఎంకు ఆధారాలు కూడా అందించినట్లు తెలిసింది. పంచాయితీ దృష్ట్యా నరసారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సైతం సీఎంవోకు చేరుకున్నారు.

చిలకలూరిపేటలో మల్లెల అనుచరుల ఆందోళన - టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం

మంత్రి రజిని తనకు ఇంకా 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని కార్యకర్తల సమావేశంలో రాజేష్ వాపోయారు. సజ్జల జోక్యంతో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజిని తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు స్పందిస్తూ సజ్జలను మార్చాలని, పార్టీని బతికించాలని నినాదాలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోబోమని అధిష్ఠానాన్ని హెచ్చరించిన రాజేష్​ మర్రి రాజశేఖర్​కు టికెట్ ఇస్తే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని అన్నారు. స్థానికుడికి మాత్రమే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు సైతం డిమాండ్ చేశారు. కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే దగ్గరుండి మరీ ఒడిస్తామని హెచ్చరించారు.

ఇద్దరు మంత్రులు.. ఒక్కొక్కరికి 3 ఆఫీసులు..

మరీ ఈ వివాదానికి సీఎం జగన్​ ఏ విధంగా చెక్​ పెడతారో వేచి చూడాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.