ETV Bharat / politics

ఆరు నెలల్లో అనూహ్య ఫలితాలు - పాలమూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు - BJP Political Strategy in Palamuru

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 4:27 PM IST

Palamuru Politics Changing Equations : ఆర్నెళ్ల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓ లెక్క, ఎంపీ ఎన్నికల తర్వాత మరో లెక్క. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ లెక్క మారుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సీఎం సహా అధికార పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలను ఎదుర్కొని మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో పాగా వేసింది. క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేని, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానంలోనూ బీఆర్ఎస్​ను తలదన్ని రెండో స్థానంలో నిలిచింది. తాజా ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలు కాషాయ దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​లకు కంచుకోటగా ఉన్న పాలమూరులో కమలం వికాసానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం.

Palamuru Politics Changing Equations
BJP Political Strategy in Palamuru District (ETV Bharat)
ఆరు నెలల్లో అనూహ్య ఫలితాలు - పాలమూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు (ETV Bharat)

BJP Political Strategy in Palamuru District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. గత పార్లమెంట్, శాసనసభ ఎన్నికలతో పోల్చితే, ఈ లోకసభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఓట్లు గణనీయంగా పెరిగాయి. అధికార కాంగ్రెస్‌కు సిటింగ్‌ ఎంపీ ఉన్న బీఆర్ఎస్​ను తలదన్ని మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పెద్దగా బలంలేని నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనూ సిటింగ్‌ బీఆర్ఎస్​ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.

కాంగ్రెస్ కంచుకోటైన కందనూలు, నడిగడ్డల్లో గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు కమళదళంలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో 2019లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 3,33,000 ఓట్లు పోలయ్యాయి. 78వేల ఓట్ల తేడాతో అప్పుడు డీకే అరుణ ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్షా 80 వేల ఓట్లు అధికంగా చేరడంతో, బీజేపీకి 5లక్షల 10వేల ఓట్లు దక్కాయి.

సీఎం సొంత జిల్లాలో పాగా వేసిన కమలదళం : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7నియోజక వర్గాల్లో కాషాయపార్టీకి కేవలం లక్షా 20 వేల ఓట్లే దక్కాయి. 6నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా 4లక్షల ఓట్లు అదనంగా కమలదళం ఖాతాలో పడ్డాయి. 7నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ సెగ్మెంట్లలో కాషాయపార్టీకే మెజారిటీ దక్కింది. నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఓట్లు లక్షా 29 వేలు.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ వచ్చిన ఓట్లు దాదాపుగా అంతే. కానీ, 2024 ఎంపీ బరిలో కమలదళానికి దక్కిన ఓట్ల సంఖ్య ఏకంగా 3లక్షల 70 వేలకు పెరిగింది. 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 2లక్షల 30వేల ఓట్లు అదనంగా వచ్చాయి. మరోవైపు నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్​కు సిటింగ్‌ స్థానం కాగా, బలమైన అభ్యర్థి ఆర్​ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ బరిలో నిలిచారు. ఐనప్పటికీ గులాబీ పార్టీని వెనక్కినెట్టి కమలం పార్టీ రెండో స్థానంలో నిలవడం, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

BJP Campaign On Congress Failures : బీజేపీ లోకసభ ఎన్నికల్లో పుంజుకోవడానికి అనేక కారణాలున్నాయి. 2 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, నాగర్‌కర్నూల్‌లో ఎన్నికల ముందు బీఆర్ఎస్​ను వీడి బీజేపీలో చేరిన సిటింగ్‌ ఎంపీగా ఉన్న రాములు కుమారుడు భరత్‌ ప్రసాద్‌కు టికెట్లు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, కేంద్రంలో మోదీ అధికారంలో ఉండటమే మేలంటూ ఉద్ధృతంగా ప్రచారం చేసింది.

ఆరు గ్యారంటీల అమలు విషయంలోనూ కాంగ్రెస్ వైఫల్యాలను జనంలో ఎండగట్టింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా బీఆర్ఎస్​లో నైరాశ్యం నిండింది. బరిలో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపినా, వారిని పార్లమెంట్‌కు పంపాల్సిన ఆవశ్యక్తతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. దీంతో ప్రత్యాన్మాయంగా ఓటర్లు బీజేపీను ఎన్నుకున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలం గణనీయంగా పెరిగింది.

ఉత్కంఠ నడుమ పాలమూరు ఫలితాలు - చెరో స్థానాన్ని చేజిక్కించుకున్న జాతీయ పార్టీలు - Mahbubnagar MP Results 2024

సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఓటమి - కారణాలపై అధికార పార్టీలో అంతర్మథనం! - Congress Lost MP Seat Of Mahbubnagar

ఆరు నెలల్లో అనూహ్య ఫలితాలు - పాలమూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు (ETV Bharat)

BJP Political Strategy in Palamuru District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. గత పార్లమెంట్, శాసనసభ ఎన్నికలతో పోల్చితే, ఈ లోకసభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఓట్లు గణనీయంగా పెరిగాయి. అధికార కాంగ్రెస్‌కు సిటింగ్‌ ఎంపీ ఉన్న బీఆర్ఎస్​ను తలదన్ని మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పెద్దగా బలంలేని నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనూ సిటింగ్‌ బీఆర్ఎస్​ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.

కాంగ్రెస్ కంచుకోటైన కందనూలు, నడిగడ్డల్లో గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు కమళదళంలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో 2019లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 3,33,000 ఓట్లు పోలయ్యాయి. 78వేల ఓట్ల తేడాతో అప్పుడు డీకే అరుణ ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్షా 80 వేల ఓట్లు అధికంగా చేరడంతో, బీజేపీకి 5లక్షల 10వేల ఓట్లు దక్కాయి.

సీఎం సొంత జిల్లాలో పాగా వేసిన కమలదళం : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7నియోజక వర్గాల్లో కాషాయపార్టీకి కేవలం లక్షా 20 వేల ఓట్లే దక్కాయి. 6నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా 4లక్షల ఓట్లు అదనంగా కమలదళం ఖాతాలో పడ్డాయి. 7నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ సెగ్మెంట్లలో కాషాయపార్టీకే మెజారిటీ దక్కింది. నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఓట్లు లక్షా 29 వేలు.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ వచ్చిన ఓట్లు దాదాపుగా అంతే. కానీ, 2024 ఎంపీ బరిలో కమలదళానికి దక్కిన ఓట్ల సంఖ్య ఏకంగా 3లక్షల 70 వేలకు పెరిగింది. 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 2లక్షల 30వేల ఓట్లు అదనంగా వచ్చాయి. మరోవైపు నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్​కు సిటింగ్‌ స్థానం కాగా, బలమైన అభ్యర్థి ఆర్​ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ బరిలో నిలిచారు. ఐనప్పటికీ గులాబీ పార్టీని వెనక్కినెట్టి కమలం పార్టీ రెండో స్థానంలో నిలవడం, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

BJP Campaign On Congress Failures : బీజేపీ లోకసభ ఎన్నికల్లో పుంజుకోవడానికి అనేక కారణాలున్నాయి. 2 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, నాగర్‌కర్నూల్‌లో ఎన్నికల ముందు బీఆర్ఎస్​ను వీడి బీజేపీలో చేరిన సిటింగ్‌ ఎంపీగా ఉన్న రాములు కుమారుడు భరత్‌ ప్రసాద్‌కు టికెట్లు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, కేంద్రంలో మోదీ అధికారంలో ఉండటమే మేలంటూ ఉద్ధృతంగా ప్రచారం చేసింది.

ఆరు గ్యారంటీల అమలు విషయంలోనూ కాంగ్రెస్ వైఫల్యాలను జనంలో ఎండగట్టింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా బీఆర్ఎస్​లో నైరాశ్యం నిండింది. బరిలో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపినా, వారిని పార్లమెంట్‌కు పంపాల్సిన ఆవశ్యక్తతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. దీంతో ప్రత్యాన్మాయంగా ఓటర్లు బీజేపీను ఎన్నుకున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలం గణనీయంగా పెరిగింది.

ఉత్కంఠ నడుమ పాలమూరు ఫలితాలు - చెరో స్థానాన్ని చేజిక్కించుకున్న జాతీయ పార్టీలు - Mahbubnagar MP Results 2024

సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఓటమి - కారణాలపై అధికార పార్టీలో అంతర్మథనం! - Congress Lost MP Seat Of Mahbubnagar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.