ETV Bharat / politics

వరంగల్​లో ఫ్లెక్సీ - అధికారిక నిర్ణయమా అనధికార నిర్లక్ష్యమా? : కేటీఆర్ - KTR TWEETS TODAY LATEST NEWS

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 10:14 AM IST

Updated : Aug 27, 2024, 11:41 AM IST

KTR Today's Tweets On Telangana Issues : రాష్ట్రంలో నెలకొంటున్న తాజా సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతిపనిలోనూ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వరుస ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి కొనసాగుతున్న ఎస్​ఆర్​డీపీ పనులన్నీ మందగించాయని అన్నారు. మరోవైపు రాజముద్రపై వెలిసిన ఫ్లెక్సీపై ఘాటుగా స్పందించారు.

KTR Demands To Take Up SRDP Works
KTR Tweets On State Issues (ETV Bharat)

KTR Demands To Take Up SRDP Works : హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎస్​ఆర్​డీపీలో భాగంగా 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టి, 36 పూర్తి చేసిందన్నారు. 2024లో మిగిలినవి పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి కొనసాగుతున్న ఎస్​ఆర్​డీపీ పనులన్నీ మందగించాయని కేటీఆర్ తెలిపారు. గత 8నెలలుగా సరైన పర్యవేక్షణ, చెల్లింపులు లేవని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ఎస్​ఆర్​డీపీలో 3వ దశ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు మూసీ, ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్‌ కింద టన్నెల్స్‌, ఫ్లైఓవర్‌లు, అండర్‌ పాస్‌లు సహా మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.

అవినీతి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతోంది : అవినీతి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమవుతోందని కేటీఆర్ అన్నారు. ఉపాధ్యాయులు లేక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 15 రోజులుగా మూతపడి ఉన్న పాఠశాలల పరిస్థితిని ఉటంకించారు. అలాగే మహానగరంలోని డిస్పెన్సరీలో మందుల కొరతను ఎత్తిచూపుతూ, ఈనాడు పత్రికలోని కథనాన్ని ట్యాగ్ చేశారు. అవినీతి కాంగ్రెస్ పాలనలో అసమర్థ ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ ఆగమవుతోందని, ఆయన ట్వీట్ చేశారు.

అధికారిక నిర్ణయమా లేదా అనధికార నిర్లక్ష్యమా : కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట వెలిసిన ఫ్లెక్సీపై కేటీఆర్ స్పందించారు. ఇది అధికారిక నిర్ణయమా లేదా అనధికార నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో మీకైనా తెలుసా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ట్యాగ్ చేశారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు అయిన కాకతీయ తోరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు మంచివి కాదన్నారు. ఈ కొత్త చిహ్నాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఆమోదించారని ప్రశ్నించారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు దీని ఎందుకు వాడారన్నారు. దీనికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టుకున్న కుటుంబాలే ఎక్కువ : కేటీఆర్

కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది : కేటీఆర్ - KTR Comments On Valmiki Scam

KTR Demands To Take Up SRDP Works : హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎస్​ఆర్​డీపీలో భాగంగా 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టి, 36 పూర్తి చేసిందన్నారు. 2024లో మిగిలినవి పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి కొనసాగుతున్న ఎస్​ఆర్​డీపీ పనులన్నీ మందగించాయని కేటీఆర్ తెలిపారు. గత 8నెలలుగా సరైన పర్యవేక్షణ, చెల్లింపులు లేవని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ఎస్​ఆర్​డీపీలో 3వ దశ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు మూసీ, ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్‌ కింద టన్నెల్స్‌, ఫ్లైఓవర్‌లు, అండర్‌ పాస్‌లు సహా మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.

అవినీతి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతోంది : అవినీతి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమవుతోందని కేటీఆర్ అన్నారు. ఉపాధ్యాయులు లేక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 15 రోజులుగా మూతపడి ఉన్న పాఠశాలల పరిస్థితిని ఉటంకించారు. అలాగే మహానగరంలోని డిస్పెన్సరీలో మందుల కొరతను ఎత్తిచూపుతూ, ఈనాడు పత్రికలోని కథనాన్ని ట్యాగ్ చేశారు. అవినీతి కాంగ్రెస్ పాలనలో అసమర్థ ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ ఆగమవుతోందని, ఆయన ట్వీట్ చేశారు.

అధికారిక నిర్ణయమా లేదా అనధికార నిర్లక్ష్యమా : కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట వెలిసిన ఫ్లెక్సీపై కేటీఆర్ స్పందించారు. ఇది అధికారిక నిర్ణయమా లేదా అనధికార నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో మీకైనా తెలుసా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ట్యాగ్ చేశారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు అయిన కాకతీయ తోరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు మంచివి కాదన్నారు. ఈ కొత్త చిహ్నాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఆమోదించారని ప్రశ్నించారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు దీని ఎందుకు వాడారన్నారు. దీనికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టుకున్న కుటుంబాలే ఎక్కువ : కేటీఆర్

కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది : కేటీఆర్ - KTR Comments On Valmiki Scam

Last Updated : Aug 27, 2024, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.