ETV Bharat / politics

రాహుల్​ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలపడంలో విఫలమయ్యారు : కేటీఆర్​ - KTR Fires On Rahul Gandhi

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 8:29 PM IST

KTR Fires On Rahul Gandhi : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్​లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని రాహుల్​ గాంధీ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని కేటీఆర్​ 'ఎక్స్'​ వేదికగా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

KTR Fires On Rahul Gandhi
KTR Fires On Rahul Gandhi (ETV Bharat)

KTR Fires On Rahul Gandhi : రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్​కు కట్టుబడి ఉన్నామని చెబుతున్న ఆయన(రాహుల్​ గాంధీ) ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్​లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.

KTR On Resignation Of MP Kesava Rao : కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని 'ఎక్స్' వేదికగా కేటీఆర్ స్వాగతించారు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్​లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్​సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారని ఆయన పరిస్థితి ఏమిటని అడిగారు. వీటిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మ్యానిఫెస్టో న్యాయపత్రం ఎలా అవుతుంది : రాజ్యాంగ స్ఫూర్తి అమలుపై ఆయన చిత్తశుద్ధిని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని అన్నారు. అది అప్పుడు న్యాయపత్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి తమ మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

" కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ ఎంపీ కేశవరావు రాజీనామాను స్వాగతిస్తున్నాను. కానీ బీఆర్ఎస్​ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్​లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేమిటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటున్న మీ(రాహుల్ గాంధీ) మాటల్ని దేశం ఎలా నమ్ముతుంది" అని కేటీఆర్​ తన ట్వీట్​ ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీని ప్రశ్నించారు.

సీనియర్​ నేత కె.కేశవరావు ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ జగ్​దీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన నిన్న దిల్లీలో బీఆర్​ఎస్​ పార్టీకి గుడ్​పై చెప్పి, కాంగ్రెస్​ గూటిలో చేరారు.

'ప్రజా పాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? - ప్రతిపక్షాలను అడ్డుకోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం' - KTR on Gandhi Hospital Incident

'రేవంత్ సాబ్ ప్రజాపాలన అంటే ఇదేనా?' - కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ రియాక్షన్ - KTR REACTION OVER CASE ON BRS MLA

KTR Fires On Rahul Gandhi : రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్​కు కట్టుబడి ఉన్నామని చెబుతున్న ఆయన(రాహుల్​ గాంధీ) ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్​లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.

KTR On Resignation Of MP Kesava Rao : కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని 'ఎక్స్' వేదికగా కేటీఆర్ స్వాగతించారు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్​లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్​సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారని ఆయన పరిస్థితి ఏమిటని అడిగారు. వీటిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మ్యానిఫెస్టో న్యాయపత్రం ఎలా అవుతుంది : రాజ్యాంగ స్ఫూర్తి అమలుపై ఆయన చిత్తశుద్ధిని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని అన్నారు. అది అప్పుడు న్యాయపత్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి తమ మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

" కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ ఎంపీ కేశవరావు రాజీనామాను స్వాగతిస్తున్నాను. కానీ బీఆర్ఎస్​ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్​లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేమిటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటున్న మీ(రాహుల్ గాంధీ) మాటల్ని దేశం ఎలా నమ్ముతుంది" అని కేటీఆర్​ తన ట్వీట్​ ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీని ప్రశ్నించారు.

సీనియర్​ నేత కె.కేశవరావు ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ జగ్​దీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన నిన్న దిల్లీలో బీఆర్​ఎస్​ పార్టీకి గుడ్​పై చెప్పి, కాంగ్రెస్​ గూటిలో చేరారు.

'ప్రజా పాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? - ప్రతిపక్షాలను అడ్డుకోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం' - KTR on Gandhi Hospital Incident

'రేవంత్ సాబ్ ప్రజాపాలన అంటే ఇదేనా?' - కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ రియాక్షన్ - KTR REACTION OVER CASE ON BRS MLA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.