ETV Bharat / politics

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్​ చేసిన సీబీఐ - నేడు కస్టడీకి కోరనున్న అధికారులు - BRS MLC Kavitha in CBI Custody

CBI Arrested BRS MLC Kavitha in Delhi Liquor Case : దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్‌ చేయటంతో తిహాడ్‌ జైలులో ఉన్న కవితను అరెస్ట్‌ చేసినట్లు మరో దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించింది. కవితను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ, కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టులో రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించనుంది. న్యాయస్థానం అనుమతిస్తే అదుపులోకి తీసుకొని ప్రశ్నించనుంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 2:20 PM IST

Updated : Apr 12, 2024, 6:09 AM IST

Delhi Liquor Case
Delhi Liquor Case
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్​ చేసిన సీబీఐ

CBI Arrested BRS MLC Kavitha in Delhi Liquor Case : దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితను, తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది. ఐపీసీ 477, 120(బి) సహా అవినీతి నిరోధక చట్టంలోని ఏడో సెక్షన్‌ ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపింది.

ఇందుకోసం రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈరోజు ప్రత్యేక న్యాయస్థానంలో కవితను హాజరుపరచనున్న సీబీఐ, రిమాండ్‌ రిపోర్టు సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది. తిహాడ్​ జైలులో ఉన్న తనకు బెయిల్‌ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు, సీబీఐ అరెస్ట్‌తో ఊహించని పరిణామం ఎదురైంది.

సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్ - విచారణ ఈ నెల 26కు వాయిదా - mlc kavitha delhi liquor scam case

Kavitha Arrested In Delhi Liquor Scam : మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని, ఈ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, 2022 డిసెంబర్‌ 11న తొలుత హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను మూడ్రోజుల పాటు విచారించింది.

దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత - సీబీఐ విచారణకు అనుమతివ్వడంపై పిటిషన్‌ - CBI To Investigate MLC Kavitha

CBI To Investigate MLC Kavitha : దిల్లీ మద్యం విధానం రూపకల్పన కేసులోనే గత నెల 15న కవితను ఈడీ అరెస్టు చేసి, 10 రోజుల పాటు విచారించగా, ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ఆమె తిహాడ్‌ జైళ్లో ఉన్నారు. అటు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం కోర్టు అనుమతితోనే కవితను తిహాడ్‌ జైల్లో సీబీఐ విచారించింది. సహ నిందితుడు బుచ్చిబాబు ఫోన్‌ నుంచి రికవరీ చేసిన వాట్సాప్‌ చాట్స్‌ ఆధారంగా ప్రశ్నించింది. దిల్లీ మద్యం పాలసీలో లిక్కర్‌ లాబీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణపైనా విచారించినట్లు తెలుస్తోంది. సీబీఐ దగ్గర ఉన్న ఆధారాలతో శుక్రవారం రౌస్​ అవెన్యు కోర్టులో హాజరు పరిచి కస్టడీకి కోరనుంది.

అత్యవసర విచారణకు నిరాకరించిన జడ్జి : సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ ప్రత్యేక కోర్టులో అత్యవసర విచారణకు ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేసినా ఊరట దక్కలేదు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్న న్యాయమూర్తి, ఈ కేసులో ఎలాంటి ఊరట ఇవ్వలేనని స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, తనకు ఏ విషయం తెలియదన్నారు. అత్యవసర కేసులకు సంబంధించి వాదనలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం రెగ్యులర్‌ కోర్టులో దరఖాస్తు చేయాలని ప్రత్యేక కోర్టు జడ్జి మనోజ్‌ కుమార్‌ సూచించినట్టు న్యాయవాది మోహిత్‌రావు వెల్లడించారు.
ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్‌ నిరాకరించిన కోర్టు - MLC Kavitha Interim Bail Denied

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్​ చేసిన సీబీఐ

CBI Arrested BRS MLC Kavitha in Delhi Liquor Case : దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితను, తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది. ఐపీసీ 477, 120(బి) సహా అవినీతి నిరోధక చట్టంలోని ఏడో సెక్షన్‌ ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపింది.

ఇందుకోసం రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈరోజు ప్రత్యేక న్యాయస్థానంలో కవితను హాజరుపరచనున్న సీబీఐ, రిమాండ్‌ రిపోర్టు సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది. తిహాడ్​ జైలులో ఉన్న తనకు బెయిల్‌ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు, సీబీఐ అరెస్ట్‌తో ఊహించని పరిణామం ఎదురైంది.

సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్ - విచారణ ఈ నెల 26కు వాయిదా - mlc kavitha delhi liquor scam case

Kavitha Arrested In Delhi Liquor Scam : మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని, ఈ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, 2022 డిసెంబర్‌ 11న తొలుత హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను మూడ్రోజుల పాటు విచారించింది.

దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత - సీబీఐ విచారణకు అనుమతివ్వడంపై పిటిషన్‌ - CBI To Investigate MLC Kavitha

CBI To Investigate MLC Kavitha : దిల్లీ మద్యం విధానం రూపకల్పన కేసులోనే గత నెల 15న కవితను ఈడీ అరెస్టు చేసి, 10 రోజుల పాటు విచారించగా, ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ఆమె తిహాడ్‌ జైళ్లో ఉన్నారు. అటు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం కోర్టు అనుమతితోనే కవితను తిహాడ్‌ జైల్లో సీబీఐ విచారించింది. సహ నిందితుడు బుచ్చిబాబు ఫోన్‌ నుంచి రికవరీ చేసిన వాట్సాప్‌ చాట్స్‌ ఆధారంగా ప్రశ్నించింది. దిల్లీ మద్యం పాలసీలో లిక్కర్‌ లాబీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణపైనా విచారించినట్లు తెలుస్తోంది. సీబీఐ దగ్గర ఉన్న ఆధారాలతో శుక్రవారం రౌస్​ అవెన్యు కోర్టులో హాజరు పరిచి కస్టడీకి కోరనుంది.

అత్యవసర విచారణకు నిరాకరించిన జడ్జి : సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ ప్రత్యేక కోర్టులో అత్యవసర విచారణకు ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేసినా ఊరట దక్కలేదు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్న న్యాయమూర్తి, ఈ కేసులో ఎలాంటి ఊరట ఇవ్వలేనని స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, తనకు ఏ విషయం తెలియదన్నారు. అత్యవసర కేసులకు సంబంధించి వాదనలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం రెగ్యులర్‌ కోర్టులో దరఖాస్తు చేయాలని ప్రత్యేక కోర్టు జడ్జి మనోజ్‌ కుమార్‌ సూచించినట్టు న్యాయవాది మోహిత్‌రావు వెల్లడించారు.
ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్‌ నిరాకరించిన కోర్టు - MLC Kavitha Interim Bail Denied

Last Updated : Apr 12, 2024, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.